Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీడనను చిత్రించిన 'సిద్దెంకి' కథలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 12,2023

పీడనను చిత్రించిన 'సిద్దెంకి' కథలు

            ఒకే సమాజంలోనూ జీవిస్తున్న ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాల్ని, సంఘర్షణల్ని కథలు వ్యక్తీకరిస్తాయి. దళిత, దళితేర జీవితాల్లో అటువంటి వైరుధ్యాలు కోకొల్లలు. కొన్ని వైరుధ్యాలని చూసిన పిదప మౌనంగా ఉండడం చాలా కష్టం. అట్లాంటి మౌనాన్ని బద్దలు చేస్తూ డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి ఈ కథల్ని రాశాడు. సిద్దెంకి యాదగిరి రాసిన ఇవి కథలు మాత్రమే కాదు, గుండెలోతుల్లో సంచరిస్తున్న బాధల్ని, గాథల్ని తనదైన భాషా శైలితో కథలుగా మలిచాడు. ఈ కథలు తాను జీవిస్తున్న, అనుభవిస్తున్న వ్యవస్థ పట్ల అపరిమితమైన కన్సర్న్‌తో రాసినవి. దుగ్ధతో, యావతో, కోపంతో రాసిన కథలు కావు. ఈ కథలన్నింటికీ మనిషే అడ్రస్‌. ఆ అడ్రస్‌ గల్లంతవుతున్న మనిషిని ''డిఫెన్స్‌'' చేయడం కోసమే ఈ కథలు రాశాడు. ఈ కథలు చదివిన తర్వాత ఊరు కోల్పోయిన మనిషి, నిరాశ్రయులైన మనిషి, పీడితుడైన మనిషి, కరోనాతో నిరాదరణకు గురైన మనిషి, వంచింపబడిన దళితుడు, రాజకీయవివక్ష ఎదురుకున్న దళిత స్త్రీ, మంచి మనసున్న విద్యార్థి, ఏ కల్మషం లేని ఉపాధ్యాయుడు అందరూ కనపడతారు. ఉట్టిగా కనబడడమే కాదు వారితో సంభాషిస్తున్నట్లుగా ఈ కథలు ఉంటాయి. వారికి భరోసాను ఇస్తాయి. గుండె ధైర్యాన్ని కూడా ఇస్తాయి. మార్పు అనివార్యమనే ఒక మేలుకొలుపును పట్టిస్తాయి.
            ఈ కథ సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. ఈ కథలు వేటికవే ప్రత్యేకమైనవి. కథనంలో, శైలిలో, భాషా సౌందర్యంలో ఒక్కో కథా ఒక్కో నేపథ్యాన్ని తెలియజేస్తుంది. మన కండ్ల ముందర జరుగుతున్నది అభివృద్ధే కాదని, అభివృద్ధిలాగా కనిపిస్తుందని ఒక ''ఎపిఫని'' అర్థం అవుతుంది. ఎపిఫని అంటే ఒక నిజమైన సత్యం 'సాక్షాత్కరించడం'. నిజానికి ఈ మాయ వ్యవస్థలో 'అసత్యం', 'సత్యం' లాగా కనిపిస్తుందని ''ఆఖరి కోరిక'' కథ చదివితే అర్థమై కన్నీళ్లు వస్తాయి. జీవితం పాతదే కానీ వేదనలే కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఈ సందర్భాన్ని చాలా బలమైన కథగా మలిచాడు సిద్దెంకి. గత కాలపు జ్ఞాపకాలను నెమరువేస్తూ బలమైన శైలిలో ఈ 'ఆఖరు కోరిక' కథను రాశాడు. ఈ కథలో ఒక విద్యార్థి తన ఊరు ప్రాజెక్టులో మునుగుతుందని తెలిసి బడి బంద్‌ చేసి ఇంటి దగ్గరే ఉంటాడు. వెంకటయ్య అనే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి కోసం అతని ఊరుకు వెళతాడు. విద్యార్థి ఎందుకు రాలేదని తల్లిదండ్రులను కలుస్తాడు. అక్కడ పోశవ్వ అనే ముసలి అవ్వ మాట మాట కలుపుతూ సారు... ఊరు పోతుందంట కదా. ఇంకా చదివి ఏమి లాభం? అని ఊరుతో, ఇల్లుతో, వాళ్ళకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ ఇల్లు గోడలకు, దూలానికి ఉండే చరిత్రను చెపుతుంది. వాసానికి ఉండే అనుభవాన్ని కూడా ఆర్తితో వేదనతో వలపోస్తుంది. బతుకు మర్మం ఇప్పుతుంది. 'పందిరి మీద గుండు పడ్డట్టు' ఇంత పెద్ద చెరువు ఎందుకు సారు మాకు అనే ప్రశ్న బలంగా వేస్తుంది. మా ఉనికే లేనటువంటి అభివృద్ధి ఎవరి కోసమని ఎందుకోసమని ప్రశ్నిస్తుంది. నిత్య సత్యాలతో నిప్పులు చెరుగుతుంది. వెంకటయ్య సారు అవ్వ ప్రశ్నలకు నిస్సహాయుడైపోతాడు. నీళ్లు వచ్చినా పూర్తిగా బతికే స్థితి లేనప్పుడు కొందరి అభివద్ధికై మేమెందుకు త్యాగం చేయాలన్న ప్రధాన ప్రశ్నకు సమాధానం శూన్యమే. ఈ కథలో గోసలు ఎతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఊరు మునిగితే వచ్చే కష్టాలు, పడే బాధలు, పోగొట్టుకున్న గుర్తులు, చెల్లాచెదురయ్యే జీవితాలు అన్ని గుర్తుకు వస్తాయి. మనిషి చుట్టూ అల్లుకున్న వెలుగులను ఆర్తితో గుర్తుచేశాడు. దోపిడి పరాయి ప్రభుత్వాలే కాదు సొంత ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయని నిరూపించిన కథ ఈ 'ఆఖరి కోరిక' కథ. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రోది చేసుకొని తెలంగాణ కలను సాకారం చేసుకున్నది. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఒక ప్రధానమైన పండుగ. ఈ పండుగలో ఉండే వివక్షతను అంటరానితనాన్ని నిరసిస్తూ 'అంటరాని బతుకమ్మ' అనే కథ రాసిండు.
            అట్లాగే గ్రామాల్లో దళితులకు జరిగే రాజకీయ వివక్షతను పట్టించే కథ 'మూడు గుడిసెల పల్లె 'కథ. ఈ కథలో పటేల్‌ ఊరు సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో కుట్రతో దళిత కులానికి చెందిన సరిత అనే ఉత్తమ గుణాలున్న మహిళను సర్పంచ్‌ కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్‌ చేసినటువంటి మోసం, ఆడినటువంటి నాటకాన్ని బయట పెట్టిండు. అదే దళిత కులానికి చెందిన రాజు మిగతా కొంత మందితో నామినేషన్‌ వేయించి విత్‌డ్రా కావాలంటే లక్ష రూపాయల డబ్బు సరిత ఇవ్వాలని తీర్మానించిండు. చివరకు సరిత, సరిత భర్త శంకర్‌ డబ్బులు ఇవ్వలేక పోటీ చేయరు. పటేల్‌ పెంపుడు కుక్కలుగా మసిలే వ్యక్తులే ఆ పదవిలో కుదురు కుంటారు. ఏమి చేసైనా సరే పటేళ్లు తమ బానిసలనే రాజకీయంగా అందలం ఎక్కిస్తారు. కానీ చైతన్యవంతమైనటు వంటి దళితులను రాజకీయ పదవులు అనుభవించకుండా అడ్డుకుంటారని ఈ కథ ద్వారా తెలియజేసిండు. ఈ కథలో తేలిపోయే వస్తువు లేదు. తన ఉనికి కోసం బలవంతుల మెప్పు కోసం అధికార గుర్తింపు కోసం కాకుండా తన గుండెల్లో తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలను, ఎతలను విప్పి చెప్పాలనే ఉద్దేశం బలంగా కనపడుతుంది.
            ద్రోహం చేసే వ్యక్తుల కళ్ళు తెరిపించాలనే తపన రచయితకు బలంగా ఉంది. ఈ కథలో అల్లిక పూర్తిగా పటిష్టంగా ఉంది. ఏ మాత్రం నీరసంగా కృత్రిమంగా లేదు. చిన్నపిల్లవాడు వందల మంది స్త్రీలు ఉన్న తన తల్లి దగ్గరికి ఎంత సహజంగా కన్ఫ్యూజ్‌ కాకుండా వెళతాడో అంతే సహజంగా పాఠకుడిని కథాంశంలోకి తీసుకుపోగల నేర్పరితనం సిద్దెంకి కి ఉన్నది అని నిరూపించిన కథ. పల్లెలో అగ్రకుల రాజకీయ కుట్రలతో జాగ్రత్తగా ఉండాలని అంతర్గతంగా సూత్రంగా తెలిపిండు అని భావించాలి.
            ''ఆరు కోట్ల అందగాడు'' కథలో ఒకే పాఠశాలలో చదివిన పిల్లలు కొన్ని ఏండ్ల తర్వాత కలుసుకున్నాక జరిగే సంభాషణ ముచ్చట్ల ఆధారంగా కథను నడిపించాడు. విచిత్రమేమంటే టెన్త్‌ ఫెయిల్‌ అయిన వాడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ప్లాట్లు కోట్లు సంపాదించాడు. క్లాసులో మంచి ర్యాంకులు వచ్చి బాగా చదివిన విద్యార్థులు చిన్నపాటి ఉద్యోగంచేసి కుటుంబ పోషణకు పరిమితమైన స్థితిని చూయించాడు. ఈకథలో ఉద్యోగం అనేది మనిషిని పరిమితమైన స్థాయిలో ఎలా బంధిస్తుందో చెప్పిండు. కథా వస్తువు తెలిసిన జీవితమే. చాలామంది పెద్దలు 'కథకు ముడి సరుకు జీవితమే' అంటారు. అట్లాంటి జీవితాలు ఎన్నో సిద్దెంకి కథల్లో రూపుదిద్దుకున్నాయి. అంబేద్కర్‌ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యా యుడి కథ 'ఆచరణ'. ఈ కథ చాలామంది ఉపాధ్యాయులు చదవాల్సిన అవసర ముంది. అంబేద్కర్‌ జీవితంలో నుంచి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో ఈ కథ తెలియజేస్తుంది.
            'రుణం' కథ ఈ కథల్లో చాలా భిన్నమైన కథ. ఈ కథలో నేటివిటీ బాగా కనిపిస్తుంది. కరోనా వచ్చిన వ్యక్తి పట్ల ఎంత అమానవీయంగా సొంత మనుషులే ప్రవర్తించారో నిరూపించిన కథ. ఈ కథలో డాక్టర్‌ కత్తి మల్లయ్యగారి పాత్ర చాలా స్ఫూర్తివంతంగా ఉంది. దాదాపు చావుకు దగ్గరగా పోయిన వ్యక్తిని డాక్టర్‌ కత్తి మల్లయ్య బతికించి మళ్లీ పూర్వపు స్థితికి తీసుకు వచ్చారు. బతకడానికి ఒక భరోసానిచ్చిన అంశం అందరి డాక్టర్లకు మాత్రమే కాదు మనందరికీ కూడా ఆదర్శం.ఈ కథల్లో సిద్దెంకి వాడిన పద సంపద భాషా సొబగు అందరిని ముగ్దుల్ని చేస్తుంది. సందర్భానికి అనుగుణంగా జాతీయాలను, నుడులను సామెత లను ఎంత గొప్పగా వాడారో. ఈ సామెతలు కచ్చితంగా అసహజంగా మాత్రం లేవు. సందర్భానికి అదనపు బలాన్ని మెరుపులు చేకూరుస్తున్నాయి. మచ్చుకు కొన్ని సామెతలను ఇక్కడ పేర్కొంటున్న దినడమంత్రాన నాలుగు వెంట్రుకలు వచ్చిన అవ్వ ఎగిసి పడుకుంటూ కొప్పులు పెట్టినట్లు ఉంది.
ఆరాటం గళ్ళ అప్ప తొర్ర ఎప్పుడొచ్చినా చిప్ప తొర్ర.
అంబేద్కర్ను మొక్కుడే, మనకు బతుకమ్మ లేదంటే తొక్కుడే.
నల్ల వెంట్రుకలని పాపితే తెల్ల వెంట్రుకను ఊడబీకినట్లు.
మూలుగులు మునుపటోల్నే తిండి ఎప్పటిల్నే.
తెలిస్తే మొలిచినట్టు దిఊరంతా ఒక దిక్కు ఊసుగంలోడు ఒక దిక్కు.
పిట్ట బెదిరించి బట్ట గుంజుకపోయినట్లు.
రసీదు తప్పితే మసీదు దితోలుడిగిన ముసలి భవిష్యత్తును పోతపోస్తది.
దమ్ము లేనోడు దుమ్ముల ఏమో చేసిండంటా.
మాటకు సత్యం మందుకుపథ్యం.
అతనికి ఆగం ఎక్కువ ఆలోచన తక్కువ.
రాయిని లక్క లక్కను చేసిండు.
పులి బక్కగైనా సారుకలు తగ్గినట్లే.
కష్టాల కొలిమిలో కాలినోల్లే సోకం బంగారమైతరు.
            సదివినోళ్లకు సన్మానం లేదంటే అవమానం లాంటి సామెతలు కథకు 10 చొప్పున విరివిగా పడ్డాయి. ఇన్ని సామెతలు ఉట్టిగనే పడవు. సామాన్యులు మాట్లాతుంటే గొప్ప గ్రహింపు ఉంటేనే ఇది సాధ్యం. అట్లాగే ఒక డిక్షనరీకి సరిపోయేటాన్ని తెలంగాణ భాషా పదాలు కూడా ఈ కథల్లో దొరుకుతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మేలు ఏదైనా ఉంది అంటే తెలంగాణ భాష సాహిత్య గౌరవాన్ని పొందడం. అది సిద్దెంకి లాంటి వాళ్లు బతికిస్తున్నందువల్లే ఈ గౌరవం దక్కింది.
            దాదాపుగా ప్రతి కథలో వ్యవస్థల మధ్యన జరిగిన ఘర్షణ ఉంది. ఘర్షణ లేకుండా కథ రాస్తే ఆ కథకుడికి ఒక నిర్దిష్ట జీవిత నేపథ్యం, ఒక నిర్దిష్ట చూపు లేనట్టే లెక్క. ఈ కథలకు ఒక సామాజిక నేపథ్యం ఉంది. సామాజిక ప్రతిఫలం ఆశిస్తూ అంతర్గత ఘర్షణను బలంగా వ్యక్తీకరించిన కథలు ఇవి. సామాన్యుల కలలు సాఫల్యం కావాలని సామాన్యుడు ఉన్నతంగా జీవించాలని ఆశించి రాసిన కథలు.
            కల చెదిరిన మనుషులకు, ఆ కలల్ని చెదరగొట్టిన మనుషులను పట్టిస్తాడు. ముఖ్యంగా శత్రువు ఎవరో మిత్రువు ఎవరో అర్థం చేయించడానికి ఒక వంతెనలాగా సిద్దెంకి కథలు ఉన్నాయని బలంగా నేను నమ్ముతున్నాను. నా దష్టిలో చెదిరిన జీవితాలను సాహిత్యంలో ఒంపడమే రచయిత కథకుడి పని. ఆ పనిని బలంగా చేస్తున్న సిద్దెంకి యాదగిరికి నా జై భీమ్‌లు.

- గుడిపల్లి నిరంజన్‌, 9493319878

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.