Authorization
Thu April 10, 2025 11:10:45 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ -మహబూబ్నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మహబూ బ్నగర్ వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తెలం గాణలో కేంద్ర బిజెపి ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం లో భూమి కోసం భుక్తి కోసం పోరాడింది కమ్యూ నిస్టులేనన్నారు. పెరుగుతున్న ధరల నుంచి ప్రజలను దారి మలిపెందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాల ను గ్రహించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవ సాయ కార్మి క సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కడియాల మోహన్, రాజకుమార్, నాయకులు హనుమంతు, జగన్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.