Authorization
Thu April 10, 2025 06:12:00 pm
- జిల్లా వ్యవసాయాధికారిణి ఆశాకుమారి
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
రైతులు పం టలను వేసే ముం దు వ్యవసాయ అధికారుల సూచ నలను పాటించి అధిక దిగుబ డులను పొందాల ని జిల్లా వ్యవసా యాధి కారిణి ఆశాకుమారి సూచించారు. శనివారం రోజు జిల్లా వ్యవసాయాధికారిణి తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో రైతులు వేసిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయాధి కారులు పంటల వివరాల నమోదుపై రైతుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలో రైతులు వేసిన వరి పంట పొలాలను పరిశీలించి పంటలకు సస్య రక్షణ చర్యల గురించి రైతులకు తెలిపారు. అలాగే రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించి అధిక దిగుబడులను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, ఏఈవో సంతోష్కుమార్తో పాటు రైతులు పాల్గొన్నారు.