Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Sep 25,2022

దేశ రక్షణ కోసం మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

- దేశ రక్షణ భేరిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
అమరావతి : దేశాన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశరక్షణ భేరీలో భాగంగా విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆర్థికదోపిడీ ఆపాలన్నా, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవాలన్నా మోడీ సర్కారును గద్దెదించడమొక్కటే మార్గమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, అది పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్ని వక్తలు విమర్శించినప్పుడు సభకు హాజరైన వారు పెద్దఎత్తున కరతాళధ్వనులు చేశారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఏడేండ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. దేశ వ్యాప్తంగా 42శాతం మంది నిరుద్యోగులు ఉన్నారనీ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పారు. తినడానికి తిండికూడా లేని అభాగ్యుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదే సమయంలో పెద్దపెద్ద పెట్టుబడిదారులకు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేశారనీ, మరో రూ.2 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారని తెలిపారు. ఇదంతా సాధారణ ప్రజల కష్టార్జితమేనని, వారు రూపాయి, రూపాయి కూడగట్టి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులేనని వివరించారు. కార్పొరేట్లు రుణాల తీసుకుని ఎగ్గొడుతున్నా మోడీ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వాటిని వసూలు చేస్తే దేశం అన్ని రంగాల్లోనూ ముందుక వెళ్తుందని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఉండదని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసిన మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలు, రవాణా వ్యవస్థలను తెగనమ్ముతోందన్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొచ్చిన ఐదుగురు మహా కోటీశ్వరులు గుజరాత్‌కు చెందిన వారేనని చెప్పారు. ఉపాధి హామీ పనులకు రూ.73 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని కేంద్రం గుజరాత్‌కు చెందిన వేదాంతకు రూ.80 వేలకోట్ల మైనింగ్‌ సబ్సిడీ ఇచ్చిందని చెప్పారు. ఒకవైపు కార్పొరేట్లకు భారీ ఎత్తున లభ్ది చేకూరుస్తున్న మోడీ ప్రభుత్వం అందే సమయంలో ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు చేస్తూ లౌకికతత్వానికి తూట్లు పొడుస్తోందని వివరించారు. లైంగికదాడికి గురైన బిల్కిస్‌బానో కేసులో నేరస్తులను శిక్ష పూర్తికాకుండానే వదిలేసిందని, వారిని హీరోలుగా చిత్రీకరిస్తోందని అన్నారు. బీమా కోరేగావ్‌ కేసులో మేధావులు, రచయితలను జైల్లో కుక్కి నాలుగేళ్లవుతున్నా ఛార్జిషీటు దాఖలు చేయలేదని చెప్పారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతోందని, ప్రశ్నించిన వారిపైనా, ప్రతిపక్ష నాయకులపైనా సీబీఐ, ఇడి దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలిపారు. కర్నాటక, గోవా, మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, దీనివెనుక సీబీఐ, ఈడీ ఉన్నాయని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో 11 వేలమంది యువకులు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మహిళలపై దాడులు 20 శాతం పెరిగాయని వివరించారు. దళితులపై దాడులకు అంతేలేదని వివరించారు. భూములు సాగుచేసుకుంటున్న దళితులు, మైనార్టీలను ఆ భూముల్లో నుండి తరిమేస్తూ వాటిని భూస్వాముల పరం చేస్తున్నారని తెలిపారు. మీడియా సంస్థలను భయపెట్టి ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారాలకు దిగుతోందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన దేశ భక్తులకు పోరాడే సమయం వచ్చిందని అన్నారు.
సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం పట్ల వైసీపీ సానుకూల వైఖరి అనుసరిస్తోందన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదన్నారు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే కార్మికులే పోరాడుతున్నారని కడప ఉక్కు ఫ్యాక్టరీని ఇంతవరకు నిర్మించలేదని విమర్శించారు. పోలవరం పునరావాసం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ముంపు లెక్కలు సక్రమంగా లేకపోవడంతో ప్రభుత్వం చెబుతున్న దానికన్నా ఎక్కువ ప్రాంతం నీట మునుగుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు డిజైన్‌లో తప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం ముంపు లెక్కలు సక్రమంగా ఉన్నట్లు భావిస్తోందని, ఇదెక్కడి పద్దతని ప్రశ్నించారు. పాత ముంపు లెక్కలను పక్కనబెట్టి కొత్తగా లెక్కలు తీయాలని డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో ముంపు బాధితులను గుర్తించి, వారికి పరిహారం, పునరావాసం పూర్తి చేసిన తరువాతే పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగించాలన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ షభ్యుల ఎం.ఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ, సీనియర్‌ నాయకులు పి.మధు, గిరిజన నాయకులు మొడియం నాగమణి ప్రసంగించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.