Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పంట కొనుగోళ్లు ప్రయివేటుకు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Sep 26,2022

పంట కొనుగోళ్లు ప్రయివేటుకు..

- సబ్సిడీలకు కోతలు, ప్రజా పంపిణీలోనూ మార్పులు
- సమూల మార్పులంటూ కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం
- రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ సర్కార్‌ లేఖలు
            ''ఆహార పంటల కొనుగోళ్ల ప్రక్రియను ప్రయివేటు కంపెనీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల సేకరణలో 6 నుంచి 8శాతం నిర్వహణ ఖర్చుల కింద రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఇది చాలా ఎక్కువ. ఇవ్వాల్సిన అవసరం లేదు. 2శాతం ఇస్తే చాలు'' అని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సులో చెప్పారు. పంట కొనుగోళ్లు, ఆహార నిల్వల నిర్వహణ, పంపిణీలో సమూల మార్పులు చేపట్టాలని ఆయన మోడీ సర్కార్‌కు నివేదిక పంపారు. పంట కొనుగోళ్లలోకి ప్రయివేటును తీసుకొస్తున్నామని, ఇందుకు సన్నద్ధం కావాలని గోధుమ మిల్లర్ల అసోసియేషన్‌కు తెలియజేశారు.
న్యూఢిల్లీ : ఆహారరంగాన్ని..ముఖ్యంగా పంట కొనుగోళ్లు, ప్రజా పంపిణీ అంతా కూడా ప్రయివేటు చేతిలో పెట్టేందుకు విధివిధానాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడున్న విధానాన్ని సమూలంగా రద్దు చేసి...కొత్త విధానం తీసుకురావాలని కేంద్రంలో ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గత ఏడాది రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో గోధుమ సేకరణ అంతా ప్రయివేట్‌ ట్రేడర్స్‌కు కేంద్రం అప్పజెప్పింది. ఇలా సేకరించిన గోధుమల్ని విదేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా ట్రేడర్స్‌కు అనుకూలంగా వ్యవహరించింది. మరోవైపు ప్రభుత్వ గోడౌన్లలో నిల్వలు లేవనే సాకుతో దేశమంతా రేషన్‌ సరుకుల పంపిణీలో గోధుమల స్థానంలో బియ్యాన్ని పంపిణీ చేసింది. దాంతో అనేకమంది గోధుమల కోసం బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. పంట సేకరణలో మోడీ సర్కార్‌ ఎంచుకున్న ఈ విధానం గోధుమ ధరల పెంపునకు దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ లేకపోవటం వల్ల ఉత్తరాదిన అనేకమంది బహిరంగ మార్కెట్లో గోధుమ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాంతో డిమాండ్‌ ఏర్పడింది. రాబోయే రోజుల్లోనూ ప్రయివేటు ట్రేడర్స్‌కు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని సుధాంశు పాండే సంకేతాలు పంపారని తెలిసింది. ప్రభుత్వ సేకరణలోనూ ప్రయివేటు ట్రేడర్స్‌కు భాగస్వామ్యం కల్పించాలని చూస్తున్నట్టు చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు పంపిందని ఆయన అన్నారట.
సంక్షోభాన్ని సాకుగా చూపి..
            ఆహార సంక్షోభం దేశాన్ని చట్టుముట్టే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితిని సాకుగాచూపి మోడీ సర్కార్‌ మరో సంచలన, ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశముందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ సంక్షోభాన్ని సాకుగా చూపి కేంద్రం అత్యంత వివాదాస్పద సాగు చట్టాలు చేసింది. ప్రజా ఆందోళనతో వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. కార్మికశక్తిని దెబ్బతీయడానికి, కార్పొరేట్లకు బలం చేకూర్చేందుకు లేబర్‌కోడ్స్‌ను చేసింది. ఆర్థికమాంద్యం అడ్డుపెట్టుకొని..అత్యంత ధనికులకు, బడా కార్పొరెట్లకు పన్ను ప్రయోజనాలు భారీఎత్తున ప్రకటించింది. విధానపరంగా కేంద్రం చేపట్టిన ఈ చర్యలు ఈ దేశ ప్రజల్ని ఎంత దారుణంగా దెబ్బకొట్టాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా ప్రజల గగ్గోలు పట్టించుకోకుండా..మరో సంచలన నిర్ణయంతో మోడీ సర్కార్‌ సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మందుగా సబ్సిడీలకు కోత
            దేశవ్యాప్తంగా ఆహార సబ్సిడీలపై కోతలు పెట్టాలని, రాష్ట్రాలను సైతం ఆ దిశగా వెళ్లేట్లు ఒత్తిడి తేవాలని కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజా పంపిణీలో సమూల మార్పులు చేసే అవకాశముంది. ధాన్యం సేకరణ నుంచి క్రమంగా కేంద్రం తప్పుకుంటోంది. ఇది రైతుల పంటసాగుపై తీవ్ర ప్రభావం చూపింది. అందువల్లే ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 6శాతం తగ్గింది. గత ఏడాదితో 2022లో పోల్చితే కందులు, పెసర్లు, మినుముల పంట దిగుబడులు తగ్గాయి. నూనెగింజల దిగుబడి కూడా గణనీయంగా(30లక్షల టన్నులకుపైగా) పడిపోయింది. ప్రభుత్వ గోడౌన్లలో ఆహార నిల్వలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాడి ఆగస్టునాటికి 788.7 టన్నుల నిల్వలుంటే, ఈ ఏడాది అవి 495 లక్షల టన్నులకు పడిపోయాయి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సజ్జలు..మొదలైనవన్నీ కలుపుకొని ఈ గణాంకాల్ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఇందులో అత్యంత ముఖ్యమైంది గోధుమ నిల్వల్లో దాదాపు 2.9కోట్ల టన్నుల (37శాతం) తగ్గుదల నమోదైంది.
            పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద లబ్దిదారులకు ఇస్తున్న 5కిలోల ఉచిత బియ్యం అక్టోబర్‌లో కొనసాగుతుందా ? లేదా ? అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆహార పంట ఉత్పత్తుల సేకరణ తగ్గించుకోవాలని, తద్వారా నిల్వలు కనిష్టస్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.