Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పర్యావరణ పరిరక్షణ మాటల్లోనే.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Sep 29,2022

పర్యావరణ పరిరక్షణ మాటల్లోనే..

- ప్రయివేట్‌ విద్యుత్‌ కంపెనీలకు అనుకూలంగా గెజెట్‌ విడుదల
             నగరాల్లో గాలి కాలుష్యానికి ముఖ్య కారణం 'సల్ఫర్‌'. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల నుంచి సల్ఫర్‌ పెద్దమొత్తంలో వాతావరణంలోకి విడుదలవుతోంది. దీనిని అరికట్టే పరిజ్ఞానం 'డీసల్ఫరైజేషన్‌' (ఎఫ్‌జీడీ) మన వద్ద ఉన్నా.. అనేక కంపెనీలు నియంత్రణా చర్యలు చేపట్టడం లేదు. బడా కార్పొరేట్‌ కంపెనీలు తీసుకొచ్చిన ఒత్తిడికి మోడీ సర్కార్‌ తలొగ్గింది. ఎఫ్‌జీడీ డెడ్‌లైన్‌ గడువు డిసెంబర్‌ 2027కు మార్చుతూ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. పాలకులు మరోవైపు 'నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం' అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. డెడ్‌లైన్‌ మార్పు వెనుక పాలకుల ఆర్థిక, రాజకీయ ప్రయోజనం దాగుందని నిపుణులు విమర్శిస్తున్నారు.
- కాలుష్య ఉద్గారాల 'డెడ్‌లైన్‌' డిసెంబర్‌ 2027కు మార్చుతూ నిర్ణయం
- సల్ఫర్‌ ఉద్గారాన్ని అడ్డుకునే చర్యలపై కేంద్రం రాజీ!
- కార్పొరేట్‌ లాబీ ఒత్తిడికి తలొగ్గింది..
- 'నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం' లక్ష్యాన్ని చేరదు : పర్యావరణ నిపుణులు
న్యూఢిల్లీ : రోజంతా విపరీతమైన ఎండ..కొంతసేపటి తర్వాత భారీ వర్షం. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంబయి, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాల్ని ముంచెత్తుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల ఫలితమిది. నగరాల్లో గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు ఆధునిక మానవుడికి సవాల్‌గా మారాయి. దీనిని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు కార్బన్‌, సల్ఫర్‌ ఉద్గారాల్ని అరికట్టే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో ముఖ్యమైంది విద్యుత్‌ ప్లాంట్ల వద్ద 'ఎఫ్‌జీడీ' అమలు. దీనిపై మనదేశంలో కేంద్రం పదే పదే గడువు పెంచటాన్ని పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఒకసారి 'డెడ్‌లైన్‌' పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మళ్లీ రెండోసారి డెడ్‌లైన్‌ గడువు మార్చుతూ (సెప్టెంబర్‌ 7న) ఆదేశాలు జారీకావటంపై పర్యావరణ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
             ఎఫ్‌జీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా విద్యుత్‌ తయారీ కంపెనీలు డిసెంబర్‌ 2027 వరకు ఏర్పాటు చేయనక్కర్లేకుండా వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయాన్ని పర్యావరణవేత్తలు, పర్యావరణ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివిధ నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన 'నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం' లక్ష్యాల్ని తాజా నోటిఫికేషన్‌ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, హైదరాబాద్‌..సహా వివిధ నగరాల్లో నేడు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నగరాల్లో గాలి నాణ్యత పెంచేందుకు 'నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం'ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులోని లక్ష్యాల్ని 2025కల్లా చేరుకుంటామని మోడీ సర్కార్‌ ప్రకటించింది.
ససేమిరా అంటున్న ప్రయివేటు
             మనదేశంలో సుమారుగా 600కు పైగా ప్రభుత్వ, ప్రయివేటు బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్ల వద్ద కార్బన్‌, సల్ఫ్యూరస్‌ ఆక్సైడ్‌..తదితర కాలుష్యకారకాలు పెద్దమొత్తంలో వాతావరణంలోకి విడుదల వుతున్నాయి. ముఖ్యంగా సల్ఫ్యూరస్‌ ఆక్సైడ్‌ అత్యంత ప్రమాదకరమైంది. దీనిని అడ్డుకునేందుకు 'ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌' (ఎఫ్‌జీడీ) అనే సాంకేతిక పరిజ్ఞానముంది. దీనిని ప్లాంట్ల వద్ద ఏర్పాటుచేయడానికి విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు నిరాకరిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో మనదేశం ముందున్న లక్ష్యాలు నెరవేరాలంటే విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఎఫ్‌జీడీని కచ్చితంగా అమల్లోకి తేవాలి. అయితే ఇందుకు విద్యుత్‌ ఉత్పత్తిలో ఉన్న బడా కార్పొరేట్‌ కంపెనీలు ససేమిరా అంటున్నాయి. వాటి ఒత్తిడికి మోడీ సర్కార్‌ తలొగ్గుతూ కాలుష్య ఉద్గారాల డెడ్‌లైన్‌ను డిసెంబర్‌ 2027కు మార్చుతూ గెజెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఆర్థిక, రాజకీయ ప్రయోజనం కోసమే?
             మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చింది మొదలు..దేశవ్యాప్తంగా అనేక బొగ్గు గనుల్ని ప్రయివేటుకు కేటాయిస్తూ వస్తోంది. కొత్తగా ప్రయివేటు విద్యుత్‌ తయారీ ప్లాంట్లకు పర్యావరణ అనుమతులు మంజూరుచేసింది. ఇవన్నీ ఎఫ్‌జీడీ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వీటి వెనుకున్న కార్పొరేట్‌ లాబీ తీసుకొచ్చిన ఒత్తిడికి మోడీ సర్కార్‌ తలొగ్గుతూ 'ఎఫ్‌జీడీ డెడ్‌లైన్‌'ను రెండోసారి మార్చింది. కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు శాఖ సెప్టెంబర్‌ 7న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
రాజీ పడితే...ప్రమాదం
             పాలకులు దేశవిదేశాల్లో పలు వేదికలపై పెద్ద పెద్ద మాటలు చెప్పటం కాదు, కాలుష్య ఉద్గారాల్ని అడ్డుకునే చర్యలు కఠినంగా అమలుజేయాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు రాజీపడితే దేశ ప్రజల భవిష్యత్‌ ప్రమాదంలో పడటం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న అనూహ్య మార్పులు, విపరీతమైన వేడిమి, మరోవైపు వెంటనే భారీ వర్షం..వంటివి ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి.
             భారత్‌లో కోట్లాది మంది గాలి కాలుష్యం బారినపడుతున్నారు. చలికాలంలో ఢిల్లీలాంటి నగరాల్లో బయటకు రాలేని పరిస్థితి. గుండె, శ్వాసకోశ వ్యాధులకు సల్ఫ్యూరస్‌ ఆక్సైడ్‌, ఇతర సమ్మేళనాలు కారణమవుతున్నాయి. అంతేకాదు వాతావరణంలో నైట్రోజన్‌తో కలిసి సల్ఫర్‌ భూమిని చేరుతుంది. సారవంతమైన భూములను దెబ్బతీస్తుంది. తద్వారా హఠాత్తుగా పంట ఉత్పత్తి పడిపోయే ప్రమాదముంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.