Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పురోగతికి దెబ్బ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 29,2022

పురోగతికి దెబ్బ

- టీబీ నివారణలో పరిస్థితులు రివర్స్‌
- 2021 ఏడాదిలాగే ఈ సారి కూడా
- భారత్‌లో పెరిగిన టీబీ మరణాలు
- డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో టీబీ నివారణ పరిస్థితులలో పురోగతి క్షీణించింది. దేశంలో టీబీ కేసులు, మరణాలు పెరగటం.. ప్రభుత్వం వాటికి చేసే కేటాయింపులను తగ్గించటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు సంబంధించి టీబీ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కొన్ని కీలకాంశాలను తెలిపింది. 2030 నాటికి టీబీని నిర్మూలించే లక్ష్యం దిశగా ఉన్న పురోగతికి కోవిడ్‌-19 దెబ్బకొట్టింది. ఈ సారి కూడా 2021 నాటి పరిస్థితులే రిపీట్‌ అయ్యాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ రిపోర్ట్‌ 2022ను విడుదల చేసింది.
ఈ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. అధిక టీబీ భారం ఉన్న దేశాలు నష్టాన్ని భర్తీ చేయటానికి ప్రచారాలు ప్రారంభిచాలి. అధిక టీబీ ప్రభావిత దేశమైన భారత్‌కు 2020, 2021 లలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. గ్లోబల్‌ డెడ్‌లైన్‌కు ఐదేండ్లకు ముందుగా.. అంటే 2025 నాటికి టీబీని నిర్మూలించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, నిపుణులు వాస్తవికతలను బట్టి ఈ లక్ష్యాన్ని సందేహాస్పదంగా భావిస్తారు. 2015తో పోలిస్తే భారత్‌లో టీబీ మరణాలు 6.6 శాతం పెరిగాయి. 2020 నాటికి టీబీ మరణాలలో 35 శాతం తగ్గింపును సాధించాలనేది ప్రపంచ తాత్కాలిక లక్ష్యం. 2020తో పోలిస్తే భారత్‌లో టీబీ మరణాలు 2021లో పెరిగాయి. 4.8 లక్షల నుంచి 5.06 లక్షలకు ఈ పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల 5.1 శాతం గమనార్హం. టీబీ మరణాలు అధికంగా నమోదైన నాలుగు దేశాలలో భారత్‌ ఒకటి. మిగిలిన మూడు దేశాలు ఇండోనేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌. టీబీ కేసుల నోటిఫికేషన్‌ (కేసుల నివేదన) గణనీయంగా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 2019 నుంచి 2020 వరకు రిపోర్టింగ్‌లో అత్యధిక తగ్గింపును భారత్‌ నివేదించింది. 2021 పరిస్థితుల్లో స్వల్ప మెరుగుదల నమోదైన్పటికీ.. ఇందులో చాలా పురోగతి అవసరం. 2019 నుంచి 2020 వరకు కేసుల నివేదనలో తగ్గుదల భారత్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ ల నుంచి 67శాతం ఉండటం గమనార్హం.
భారతదేశ వ్యక్తిగత పనితీరు విషయానికొస్తే, 2019తో పోలిస్తే 2021లో కేసు రిపోర్టింగ్‌లో 29 శాతం క్షీణత (2020లో సంబంధిత సంఖ్య 41 శాతం) ఉన్నది. దేశంలో 2020, 2021లో వరుసగా 41 శాతం, 29 శాతం కేసులు నివేదించబడలేదు. భారత్‌ పనితీరుతో 2013-2019 మధ్య ప్రపంచ పనితీరును ప్రభావితం చేసింది. భారత్‌లో టీబీ సంభవం లక్ష జనాభాకు 204 నుంచి 2021లో 210కి పెరిగిందని అంచనా. ఈ పెరుగుదల 2.8 శాతం కావటం గమనార్హం. 2019 స్థాయిలతో పోలిస్తే 2021లో భారత్‌లో డ్రగ్‌-రెసిస్టెంట్‌ టీబీతో బాధపడుతున్న వారి సంఖ్య 18 శాతం పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ కేసులు భారత్‌లోనే 26 శాతంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో టీబీ ఇన్ఫెక్షన్లకు ఐదు ప్రధాన కారణాలను డబ్ల్యూహెచ్‌ఓ నిదేదిక పేర్కొన్నది. ఇందులో పోషకాహార లోపం అతిపెద్ద అంశం. అలాగే ఆల్కహల్‌ వినియోగం, మధుమేహం, హెచ్‌ఐవీ, ధూమపానం లు టీబీకి కారణమయ్యే ఇతర కారకాలుగా గుర్తించబడ్డాయి.
భారత్‌లో 2020 నుంచి 2021 వరకు నివారణ టీబీ చికిత్స రేట్లు 3.1 శాతం తగ్గాయి. అలాగే టీబీ నిధులను భారత్‌ దాదాపు సగానికి తగ్గించింది. టీబీ నివారణ కోసం 2020లో రూ. 2,684.36 కోట్లకు పైగా (326 మిలియన్‌ డాలర్లు) ఉన్న నిధులు 2021లో రూ. 1506.77 కోట్లు (183 మిలియన్‌ డాలర్లు) తగ్గటం గమనార్హం. టీబీపై దేశీయ వ్యయాన్ని తగ్గించే 30 దేశాలలో భారత్‌ రెండోది కావటం ఆందోళనకరం. ఇటీవలి కాలంలో భారత్‌కు అంతర్జాతీయ నిధులు దాదాపు రెట్టింపు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా టీబీ మరణాల పెరుగుదల 2017 స్థాయికి తిరిగి వెళ్లాయి. 2021లో ఒకే వ్యాధి కారక మరణానికి కారణమైన కోవిడ్‌-19 తర్వాత టీబీ రెండో స్థానంలో ఉన్నది. 2021లో టీబీతో సంభవించిన మరణాలు.. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌తో సంభవించిన మరణాల కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. టీబీ నిర్మూలన విజయాలలో నష్టాలను ఎదుర్కోవటానికి నిధులను పెంచాలనీ, ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.