Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేరళలో ప్రజా పోలీస్‌ వ్యవస్థ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 29,2022

కేరళలో ప్రజా పోలీస్‌ వ్యవస్థ

- ఇరువురికీ సమాన భాగస్వామ్యం
- ప్రజల భద్రతకు భరోసా : చింతన్‌ శివిర్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
న్యూఢిల్లీ : కేరళలో ప్రజా పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటుచేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదనీ, పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతో వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రాల హోం మంత్రుల చింతన్‌ శివిర్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస పాలనలో పోలీసుల పాత్రకు పూర్తి భిన్నంగా ప్రజాస్వామ్య దేశంలో ఉండాలనీ, ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు రావాలని సూచించారు. పరిశోధనలో సాంకేతిక సాధనాలకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలనీ, ప్రధాన ప్రాధాన్యత ప్రజలకు స్నేహపూర్వక, పౌర కేంద్రీకృత విధానానికి ఉండాలని సూచించారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌ ఏర్పాటు
           ఆధునిక ప్రజాస్వామ్య సమాజం అవసరాలను తీర్చగల సేవా ఆధారితమైన, పౌర స్నేహపూర్వకమైన పోలీసు దళాన్ని ఏర్పాటుచేయడంలో కేరళ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కేరళలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను జనమైత్రి (కమ్యూనిటీ పోలీసింగ్‌)ను ఏర్పాటుచేశామని, దీనికి కేరళ పోలీసు చట్టంతో చట్టబద్ధమైన మద్దతు ఉందని తెలిపారు. దీనివల్ల పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారనీ, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో పోలీసులు, ప్రజలు సమాన భాగస్వాములని స్పష్టంచేశారు. కేరళ ప్రభుత్వం కస్టడీ హింస, చిత్రహింసలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకుంటుదనీ, తాము ఈ విషయంలో జీరో-టాలరెన్స్‌ (పూర్తిగా నిర్మూలిస్తున్నాం) విధానాన్ని కలిగి ఉన్నామని తెలిపారు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్లు, షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రజల పట్ల పోలీసులు ప్రజానుకూల విధానాన్ని అమలు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ మొబిలిటీని సాంకేతిక వనరులతో మెరుగుపరచబడాలనీ, కేంద్ర ప్రభుత్వం దీని కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. చిన్నారుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి తాము చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌ స్టేషన్లను ప్రవేశపెట్టామనీ, అలాగే స్టూడెంట్‌ పోలీస్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చామని చెప్పారు. ఈ మోడల్‌ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిదని గుర్తుచేశారు.
మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు 'యోధవు' కార్యక్రమం
           మాదకద్రవ్యాల దుర్వినియోగం అత్యంత తీవ్రమైన సవాలనీ, తాము ఇటీవల 'యోధవు' కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఇందులో మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో తాము కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీబీ వంటి సంస్థల సహాయాన్ని అభ్యర్థిస్తున్నామని అన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరిగాయని, సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్ల సహకారంతో అత్యవసర కార్యకలాపాలను నిర్వహించడానికి పోలీసు బలగాలను సన్నద్ధం చేయాలని సూచించారు. విపత్తు నిర్వహణలో పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి సాంకేతిక సహాయం తక్షణం అవసరమని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నామనీ, తాము ఎక్కడిక్కడే సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో హైటెక్‌ సెల్‌, అన్ని జిల్లా కేంద్రాలలో సైబర్‌ సెల్‌లను ఏర్పాటు చేశామన్నారు. తాము తమ సైబర్‌ వాలంటీర్‌ల భాగస్వామ్యంతో ఇంట్లోనే డార్క్‌ వెబ్‌ మానిటరింగ్‌ టూల్‌ను కూడా అభివృద్ధి చేసామని వివరించారు.
ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలు అప్‌గ్రేడ్‌ చేయాలి
           జాతీయ భద్రతలో తీర భద్రత ముఖ్యమైన అంశమనీ, కేరళలో మూడు దశల్లో తీర ప్రాంత భద్రతా పథకం అమలు చేస్తున్నామని అన్నారు. మొదటి రెండు దశల్లో 18 కోస్టల్‌ పోలీస్‌ స్టేషన్లు పని చేస్తున్నాయనీ, మూడో దశలో మరో ఏడు పోలీస్‌ స్టేషన్లు ప్రతిపాదించామని చెప్పారు. తాము మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి పోలీసు, ప్రజలతో ప్రచారాన్ని కూడా ప్రారంభించామని అన్నారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడే చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.