Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్కాలర్‌షిప్స్‌ నిలిపివేత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

స్కాలర్‌షిప్స్‌ నిలిపివేత

- 1-8 తరగతుల మైనార్టీ విద్యార్థులకు షాక్‌..
- 9, 10 తరగతులకే ఇస్తామన్న మోడీ సర్కార్‌
- పేద విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేయటమే : ప్రతిపక్షాలు
- కేంద్రం నిర్ణయాన్ని ఖండించిన ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌
న్యూఢిల్లీ : ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల జారీలో మైనార్టీ విద్యార్థులకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ పథకాన్ని 1 నుంచి 8వ తరగతి మైనార్టీ విద్యార్థులను తొలగిస్తున్నామని ప్రకటించింది. 9, 10 తరగతుల విద్యార్థుల దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీనికి సంబంధించిన నోటీసు జాతీయ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో విడుదల చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల శాఖ అమలుజేస్తున్న ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి అనుగుణంగా ఇకపై నిబంధనలుంటాయని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బీఎస్పీ, సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. స్కాలర్‌షిప్‌ కేవలం 9, 10 తరగతుల విద్యార్థులకే పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, జమియత్‌ ఉలేమా-ఈ-హింద్‌ తీవ్రంగా ఖండించాయి. సచార్‌ కమిటీ నివేదిక తర్వాతే ముస్లిం సమాజానికి ప్రీ-మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌-కమ్‌-మీన్స్‌ సాల్కర్‌షిప్స్‌ మొదలయ్యాయని, దీనిని ఇప్పుడు ఆపేయాలని నిర్ణయించటం సరైంది కాదని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు డాక్టర్‌ ఎస్‌.క్యూ.ఆర్‌.ఇలియాస్‌ అన్నారు. స్కాలర్‌షిప్‌ ఆపేయటం వల్ల పాఠశాలల్లో ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్స్‌ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌ పథకం నుంచి మైనార్టీల విద్యార్థులను తొలగించటాన్ని బీఎస్‌పీ నాయకుడు కున్వర్‌ డానిష్‌ అలీ ఖండించారు. పేద పిల్లల్ని విద్య నుండి దూరం చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన కుట్రగా కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాలా అభివర్ణించారు.
2014-15కి ముందు రూ.3.03 కోట్ల స్కాలర్‌షిప్‌లు ఇవ్వగా, అటు తర్వాత రూ.5.20 కోట్ల స్కాలర్‌షిప్‌లు మైనార్టీ విద్యార్థులకు పంపిణీ చేశామని పార్లమెంట్‌లో (ఈ ఏడాది మార్చిలో) అప్పటి మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు. ఆయన విడుదల చేసిన వివరాల ప్రకారం, 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో మొత్తం 3,36,11,677 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఇందులో ముస్లిం విద్యార్థులు 53,13,905, క్రైస్తవ విద్యార్థులు-53,13,905, సిక్కు విద్యార్థులు-35,90,880, బౌద్ధ విద్యార్థులు-12,98,637, జైన్‌ విద్యార్థులు-4,58,665 మంది ఉన్నారు. వీటి కోసంగానూ కేంద్రం రూ.9,057 కోట్లు కేటాయించిందని నఖ్వీ చెప్పారు.
స్కాలర్‌షిప్‌లను యథాతధంగా కొనసాగించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            దేశంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే పేద విద్యార్థులకు ఇచ్చే ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ ఉపకార వేతనాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థుల్లో బాలికలకు రూ.1,500, బాలురకు రూ.1,000 చొప్పున ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను కేంద్రం మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తున్నందున ఉపకార వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ, నిలిపేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం అన్యాయమని విమర్శించారు. విద్యా హక్కు చట్టం చేసి 12 ఏండ్లయినా ఇప్పటి వరకు సక్రమంగా అమలుకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ చట్టం అమలుకు ప్రత్యేకంగా నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని తెలిపారు. 2014 నుంచి దాని అమలుపై తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరించిన కేంద్రం హఠాత్తుగా ఆ చట్టం సాకుతో ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఉపకరించే కొద్దిపాటి సహాయాన్ని నిలిపేయాలంటూ నిర్ణయించటం దారుణమని విమర్శించారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాల మంజూరును యథాతధంగా కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.