Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యాజమాన్య హక్కేది? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

యాజమాన్య హక్కేది?

- రెండు దశాబ్దాల క్రితం ఇండ్లు అందజేత
- ఇప్పటికీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్టర్‌ కాని వైనం
- ఏండ్లు గడుస్తున్నా గుజరాత్‌ సర్కారులో లేని చలనం
- కుచ్‌ భూకంప బాధితుల గోడు
          గుజరాత్‌లోని కుచ్‌ జిల్లా పేరు వినగానే 2001 భూకంపం నాటి భయానక పరిస్థితులు గుర్తుకొస్తాయి. ప్రకృతి విపత్తు కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర గోసను ఎదుర్కొన్నారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం బాధితులకు ఇండ్లను అందజేసింది. అయితే, వారికి ఇండ్లపై యాజమాన్య హక్కు ఇప్పటికీ సంక్రమించలేదు. రెండు దశాబ్దాల వుతున్నప్పటికీ గుజరాత్‌ సర్కారు వారికి యాజమాన్య హక్కును కల్పించేందుకూ ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో బాధితులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గుజరాత్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. వెంటనే యాజ మాన్య హక్కును కల్పించాలని డిమాండ్‌ చేశారు.
అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని కుచ్‌ జిల్లాలో సంభవించిన చేదు గుర్తులు అన్నీ ఇన్నీ కావు. 2001లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు వేలాది మంది ప్రాణాలను తీసుకున్నది. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. కుచ్‌ ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ పీడకలను భూకంప బాధితులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. భుజ్‌ భూకంపంగా పిలిచే దీని తీవ్రత రిక్టరీస్కేలుపై 7.7గా నమోదైంది. భుజ్‌ అనేది కుచ్‌ జిల్లా కేంద్రం. భూకంపానికీ ఇది కేంద్రబిందువు కావటంతో దీనిని భుజ్‌ భూకంపంగా పిలిచేవారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 13,805 నుంచి 20,023 మంది ఈ ప్రమాదానికి బలయ్యారు. మరో 1.67 లక్షల మంది గాయాలపాలయ్యారు. దాదాపు 3.40 లక్షల ఇండ్లు నేల మట్టమయ్యాయి. ఈ భయానక ప్రకృతి విపత్తు చోటు చేసుకొని దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే గడుస్తున్నది. ఆనాటి భయానక పరిస్థితులు ఇప్పటికీ అక్కడి స్థానికుల మెదళ్లలో మెదులుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. భూకంపంను ధైర్యంగా ఎదు ర్కొన్నందుకు గానూ గుర్తుగా ఈ ఏడాది ఆగస్టు 28లోనే ప్రధాని మోడీ భుజ్‌లో స్మృతి వన్‌ మెమోరియల్‌ను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచు కున్నారు. అయితే, కుచ్‌ ప్రజలు మాత్రం దీనితో తమకు ఏం లాభమని ప్రశ్నించారు. ''నేను ఆ మెమోరియల్‌ను చూడలేదు. చూడాలనీ అను కోవటం లేదు. దానితో మేము ఏం చేస్తాం'' అని కుచ్‌వాసి కైన్యాభారు (53) అన్నారు.'' ప్రభుత్వం మాకు సాయం అందించలేదు. చాలినంత పరిహార మివ్వలేదు. అందుకే మేము దీనిని (మెమోరియల్‌) తిరస్కరించాం'' అని మరొక వ్యక్తి (74) తెలిపారు. 2001, జనవరి 26న ప్రకృతి విపత్తు చోటు చేసుకున్న సమయంలో చిన్నారులుగా ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడు వయోజన ఓటు హక్కును పొందారు. ప్రభుత్వం ఆ సమయంలో భూకంప బాధితులకు ఇండ్లు అందజేసింది. అయితే, దాని మీద వారికి యాజమాన్య హక్కులు ఇప్పటికీ అందలేదు. దీనిపై బాధితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాకు ఇండ్లు ఇచ్చినా.. అవి ఇప్పటికీ మా సొంతం కాలేదని కుచ్‌ స్థానికులు చెప్పారు. ''నేను వేరే ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. డబ్బులు లేకపోవటంతో నా ఇంటిని అమ్మాలి. అయితే, నేను అలా చేయలేను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఇళ్లు నా పేరు మీద నమోదై లేదు. కాబట్టి దీనిని నేను అమ్మలేను'' అని అధోరు గ్రామానికి చెందిన రాంచోడ్‌భారు చెప్పారు. ఇక్కడ ఉండే చాలా మందిది ఇదే సమస్య. ''మహారాష్ట్రలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదాపు 1500 నుంచి 2000 ఇండ్లు భూకంప బాధితుల కోసం నిర్మించింది. 22 ఏండ్లు గడుస్తున్నా ఈ ఇండ్లు గుజరాత్‌ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్టర్‌ కాలేదు. దీంతో ఇండ్లపై హక్కు లేకపోవటంతో వారు వీటిని అమ్మలేకపోతున్నారు'' అని గ్రామ సర్పంచ్‌ వాంకర్‌భారు చెప్పారు. ఆ సమయంలో గుజరాత్‌ ప్రభుత్వం రూ. 90వేలు పరిహారంగా ప్రకటించింది. అయితే, ఈ పరిహారమూ బాధితులందరికి సరిగ్గా అందలేదు. కొందరికి రూ. 60వేల అందితే.. మరికొందరికి రూ. 30వేలు, 40వేలు మాత్రమే అందాయని వాంకర్‌భారు చెప్పారు. ఈ విష యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదిం చినప్పటికీ ఎలాంటి పరిష్కారమూ లభించ లేదన్నారు. తాము ఇప్పటికీ భూకంపం షాక్‌ నుంచి కోలుకోలేదని స్థానికులు చెప్పారు.
ఇలాంటి సమయంలో బాధితులు పరిహారం, ఇండ్ల యాజమాన్య హక్కులు కల్పించటంపై దృష్టి పెట్టాలన్నారు. స్మృతివన్‌తో లాభం ఏమిటనీ, అక్కడకు ఎవరు వెళ్తారని ప్రశ్నించారు. గుజరాత్‌ ప్రభుత్వం స్మృతి వనాలపై దృష్టి తగ్గించి బాధితులకు కావాల్సినదేమిటో అర్థం చేసుకొని అటువైపుగా పని చేయాలని కుచ్‌ వాసులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.