Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేతనాల పతనం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

వేతనాల పతనం

- సామాజిక అశాంతికి దారి తీస్తున్న వైనం
- మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిలో క్షీణత
- తక్కువ ఆదాయం కలిగిన వర్గాలపై ప్రభావం
- భారత్‌లోనూ పడిపోయిన వేతనాలు
- అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పడిపోతున్న వేతనాలపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఆందోళనను వ్యక్తం చేసింది. తీవ్రమైన వేతనాల పతనం సామాజిక అశాంతికి దారి తీసే అవకాశమున్నదని హెచ్చరించింది. భారత్‌లోనూ కరోనాకు ముందు పరిస్థితుల నుంచి వేతనాల్లో క్షీణత ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌లో యుద్ధపరిస్థితులు, ప్రపంచ ఇంధన సంక్షోభంతో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిలో మందగమనం అనేక దేశాల్లో వాస్తవ నెలవారీ వేతనాల్లో తగ్గుదలకు కారణమవుతున్నాయని ఒక నివేదికలో ఐఎల్‌ఓ పేర్కొన్నది. కొనుగోలు శక్తి, వేతనాలపై కోవిడ్‌-19, ద్రవ్యోల్బణం ప్రభావానికి సంబంధించి 'గ్లోబల్‌ వేజ్‌ రిపోర్టు 2022-23'ను ఐఎల్‌ఓ తయారు చేసింది. ఈ నివేదికను జెనీవాలో విడుదల చేశారు.
వాస్తవ వేతన వృద్ధిలో చైనా ఆధిపత్యం
ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం.. కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితుల నుంచి భారత్‌లోనూ వేతనాలు పడిపోయాయి. ఈ సంక్షోభం మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తున్నది. ప్రత్యేకంగా తక్కువ ఆదాయం కలిగిన గృహాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నది. భారత్‌లో సగటు వాస్తవ వేతన సూచీ కరోనా మహమ్మారి తర్వాత తగ్గుదలను చూసింది. అభివృద్ధి చెందుతున్న జీ20 ఆర్థిక వ్యవస్థలలో వాస్తవ వేతన వృద్ధి విషయంలో చైనా తన ఆధిపత్య ర్యాంకింగ్‌ను కొనసాగిస్తున్నది. ఇక్కడ 2022లో నెలవారీ వేతనాలు 2008లోని వాస్తవ విలువకు దాదాపు 2.6 రెట్లు అధికంగా ఉన్నాయని అంచనాలు చూపిస్తున్నాయి. ఒక్క మెక్సికో తప్పితే, అభివృద్ధి చెందుతున్న అన్ని జీ20 దేశాలూ తమ సగటు నెలవారీ వేతనాలు 2008 బేస్‌లైన్‌ కంటే రియల్‌ టర్మ్స్‌లో అధికంగా చూపిస్తున్నాయి.
జీ20 దేశాల మధ్య గణనీయమైన అంతరం
అభివృద్ధి చెందుతున్న జీ20 ఆర్థిక వ్యవస్థలలో అధిక వేగవంతమైన వేతన వృద్ధి ఉన్నప్పటికీ.. వాటి సగటు వాస్తవ వేతన స్థాయి అనేది అభివృద్ధి చెందిన జీ20 ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే గణనీయమైన అంతరాన్ని కలిగి ఉన్నది. కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా మారకపు ధరలను ఉపయోగించి అన్ని జీ20 దేశాల సగటు వేతనాలను యూఎస్‌ డాలర్లుగా మార్చితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో నెలకు 4000 యూఎస్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3,26,102), అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో నెలకు 1800 యూఎస్‌ డాలర్ల (రూ. 1,46,745) సాధారణ సగటు వేతనం లభిస్తుంది.
మైనస్‌కు పడిపోయిన ప్రపంచ వేతన వృద్ధి
2022 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా నెలవారీ వేతనాలు వాస్తవపరంగా మైనస్‌ 0.9 శాతానికి పడిపోయాయి. వాస్తవ ప్రపంచ వేతన వృద్ధి రుణాత్మకంగా నమోదు కావటం ఈ శతాబ్దంలోనే తొలిసారి కావటం గమనార్హం. అభివృద్ధి చెందిన జీ20 దేశాలలో, 2022 ప్రథమార్థంలో వాస్తవ వేతనాలు మైనస్‌ 2.2 శాతానికి తగ్గుతాయని అంచనావేయబడింది. అయితే, అభివృద్ధి చెందుతున్న జీ20 దేశాలలో వాస్తవ వేతనాలు 0.8 శాతం పెరిగాయి. అయితే, 2019 కంటే ఇది 2.6 శాతం తక్కువ కావటం గమనార్హం.
ద్రవ్యోల్బణం ప్రధాన కారణం
ఆదాయ క్షీణతకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం అని నివేదిక పేర్కొన్నది. తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం ఉన్నదని వివరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం తక్కువ ఆదాయ ప్రజలపై ఎక్కువ జీవన వ్యయ ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నది. వారు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని అవసరమైన వస్తువులు, సేవలపై ఖర్చు చేయాల్సి వచ్చిందని వివరించింది. ద్రవ్యోల్బణం కనీస వేతనాల శక్తినీ దెబ్బ తీస్తున్నదని నివేదిక పేర్కొన్నది. ''ఇటీవల ఆరోగ్య సంక్షోభం, ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రస్తుత అనిశ్చితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ శ్రేయస్సు, శాంతిని సాధించే అవకాశాన్ని ప్రమాదంలో పడే దిశలో నిస్సందేహంగా కూరుకుపోతున్నది'' అని నివేదిక వివరించింది.
అనేక ప్రపంచ విపత్తులు వాస్తవ వేతనాల్లో క్షీణతకు దారి తీశాయని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గిల్బర్ట్‌ ఎఫ్‌. హౌంగ్బో అన్నారు. ''లక్షలాది మంది కార్మికులు పెరుగుతున్న అనిశ్చితిని ఎదుర్కొంటున్నందున ఇది వారిని భయంకర పరిస్థితిలోకి నెట్టింది. తక్కువ వేతనాలు పొందేవారి కొనుగోలు శక్తిని నియంత్రించకపోతే ఆదాయ అసమానత, పేదరికం పెరుగుతుంది. మహమ్మారి అనంతర రికవరీని ఇది ప్రమాదంలోకి నెట్టవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సమాజిక అశాంతికి ఆజ్యం పోస్తుంది. అందిరికీ శాంతి, శ్రేయస్సును సాధించే లక్ష్యాన్ని బలహీనపరుస్తుంది'' అని ఆయన తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.