Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిర్భయ నిధులేవి? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 18,2022

నిర్భయ నిధులేవి?

- ఆరేండ్లలో 6,712 కోట్లు కేటాయింపు..రూ.4480 కోట్లు విడుదల
- నిధుల కేటాయింపు,వ్యయం గందరగోళం :రాజకీయ విశ్లేషకులు
- దేశంలో సగటున రోజుకు 87 లైంగికదాడి ఘటనలు
- ఢిల్లీలో ప్రతిరోజూ 5.6 కేసులు..
- నిర్భయ ఘటనకు10ఏండ్లయినా పరిస్థితిలో మార్పురాలేదు..
న్యూఢిల్లీ: డిసెంబర్‌ 16, 2012న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ లైంగికదాడి, హత్య ఘటన దేశ ప్రజల్ని వణికించింది. కదులుతున్న బస్సులో లైంగికదాడికి దిగిన దుండగుల దుశ్చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేగాయి. ముఖ్యంగా నగరాల్లోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పాలకుల తీరును ఖండిస్తూ ర్యాలీలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన జరిగి 10ఏండ్లు దాటుతోంది. అయినా ఢిల్లీ సహా అనేక నగరాల్లో మహిళలకు రక్షణ కొరవడింది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళలు రాత్రివేళ ఇంటికి తిరిగి వెళ్తూ ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఆనాటి ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చడానికి యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. నిర్భయ ఫండ్‌ను ఏర్పాటుచేసింది. మహిళల రక్షణ నిమిత్తం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ఆనాటి పాలకులు ప్రకటించారు. కేంద్రంలో 2014లో మోడీ సర్కార్‌ అధికారం చేపట్టాక నిధుల్ని సగాకి తగ్గించేసింది. 2018-19లో అత్యంత తక్కువగా కేవలం రూ.500కోట్లను నిర్భయ ఫండ్‌కు కేంద్రం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. గత 8ఏండ్లుగా ఈ ఫండ్‌ లెక్కలు అంత గందరగోళంగా తయారయ్యాయి. కేంద్రం విడుదల చేస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయికి పరిస్థితికి పొంతన ఉండటం లేదనే విమర్శలున్నాయి.
కేటాయించిన నిధుల్లో 66శాతం విడుదల
నిర్భయ ఫండ్‌ ఏర్పాటైన తర్వాత అప్పట్నుంచీ ఆగస్టు 2022 వరకు కేంద్రం రూ.6712 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందులో విడుదలైన నిధులు రూ.4480 కోట్లు. కేటాయించిన నిధుల్లో ఇది కేవలం 66శాతం మాత్రమే. మిగిలిన రూ.2232 కోట్లు నిధులు ఏమయ్యాయో స్పష్టత లేదు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా మహిళలపై హింస, లైంగికదాడులు మితిమీరుతున్నాయి. దేశంలో సగటున రోజుకు 87 లైంగికదాడి ఘటనలు జరుగుతున్నాయి. లైంగికదాడి కేసులు ఏటా 13శాతం పెరుగుతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో పేర్కొన్నది. బాధితుల్లో దళిత సామాజికవర్గానికి చెందినవారు 12శాతం మంది ఉన్నారు. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో ఇంకా పరిస్థితి మెరుగుపడలేదని పోలీసులే చెబుతున్నారు. ప్రతిరోజూ సగటున 5.6 లైంగికదాడి కేసులు పోలీస్‌ స్టేషన్లో నమోదవుతున్నాయి. నిర్భయ చట్టం పకడ్బంధీగా ఉన్నా..నిర్భయ కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. నిందితులకు సులభంగా బెయిల్‌ దక్కుతోంది. విచారణ ఏండ్లుగా సాగటంతో ప్రత్యక్ష సాక్షులు గట్టిగా నిలబడలేకపో తున్నారు. ఇదంతా కూడా నిందితులకు కలిసివస్తోంది.
పాలకుల నిర్లక్ష్యం
నిర్భయ ఘటన తర్వాత మహిళా రక్షణపై పాలకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. మహిళలపై లైంగికదాడి, హింసను అడ్డుకోవటమే లక్ష్యంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం 'నిర్భయ ఫండ్‌'ను రూ.1000 కోట్లతో ఏర్పాటుచేసింది. లైంగికదాడి బాధితులకు సాయం, పునరావాసం కోసం ఈ ఫండ్స్‌ను రాష్ట్రాలు వినియోగిం చుకోవాలి. లక్ష్యం, ఉద్దేశాలు మంచివే అయినా కేంద్రంలో పాలకులు 'నిర్భయ ఘటన'ను నిర్లక్ష్యం చేశారు. దాంతో వివిధ నగరాల్లో మహిళా రక్షణ మెరుగుపడలేదు. ఫండ్స్‌ విడుదలపై లోక్‌సభలో ఆమధ్య కేంద్రమంత్రి స్మృ తి ఇరానీ మాట్లాడారు. ఆరేండ్లలో కేంద్రం నుంచి 36 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు విడుదలయ్యాయి. తమకు విడులైన నిధుల్లో 60శాతం కూడా ఖర్చు చేయని రాష్ట్రాలు 17 ఉన్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు విడుదల కావటం ఒక పెద్ద ప్రహసనంగా ఉందని, నిధుల కేటాయింపునకు, విడుదలకు పొంతనలేకపోవటంపై ఫిర్యాదులు వస్తున్నాయి.చట్టం అమలు పకడ్బంధీగా ఉండటంతోపాటు, సామాజిక దృక్పథాన్ని మార్చుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ''సమాజం ఆలోచన మారనంత వరకు మహిళలకు సమాన హోదా, భద్రత లభించదు. సమాజంలో సగభాగమైన మహిళలకు సురక్షితమైన స్థలాన్ని సృష్టించడం అందరి బాధ్యత'' అని మహిళా హక్కుల కార్యకర్తలు నినదిస్తున్నారు. లింగ సమస్యలపై సున్నితంగా ఉండాలని, పాఠశాలల్లో కార్యక్రమాలు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.