Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధి సంక్షోభం... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 19,2022

ఉపాధి సంక్షోభం...

- మూడేండ్లుగా పెరుగుతోన్న నిరుద్యోగ రేటు
            నేను పనిచేస్తున్న కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగుళూర్‌లో ఉంది. ఐటీ కంపెనీలన్నీ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని తొలగించాయి. నేను పనిచేసిన కంపెనీ ఏకంగా మూతపడింది. నాతో సహా వందలాది మందికి 8 నెలల జీతం బాకీ ఉంది. కేంద్ర కార్మిక మంత్రి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రికి, బీజేపీ నాయకులకు ఫిర్యాదు చేశాం. మా గోడు వినే నాథుడే లేడు''..ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి సందేశం ఇది. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- డిసెంబర్‌ 16నాటికి 9.3శాతం : సీఎంఐఈ
- కరోనాకు ముందు నిరుద్యోగులు 4.5 కోట్లు...తర్వాత 5.1కోట్లు
- ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నా..మోడీ సర్కార్‌ మౌనం
- 10 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ జూన్‌లో రోజ్‌గార్‌ మేళా పేరుతో హడావిడి
- కొద్దిరోజులు ఘనమైన ప్రచారం..ప్రకటనలు
న్యూఢిల్లీ : ఉపాధి సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. ఉన్నత చదువులు పూర్తిచేసినవారు, పనిచేయగల స్థితిలో ఉన్నవారికి ఉపాధి దొరకటం లేదు. అంతేగాక పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న 35 నుంచి 43ఏండ్ల వయస్సున్న వారూ నిరుద్యోగులుగా మారుతున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగరేటు ప్రతినెలా పెరుగుతూనే ఉంది. కరోనా సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పట్టినా..ఉపాధి మాత్రం మెరుగుపడటం లేదు. డిసెంబర్‌ 16నాటికి భారత్‌లో నిరుద్యోగరేటు 9.3శాతానికి చేరుకుందని 'సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ' (సీఎంఐఈ) తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిరంతరం పిరియాడిక్‌ శాంపిల్‌ సర్వేలు చేపడుతోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఉపాధి తీరు అత్యంత నిరుత్సాహంగా ఉందని, ఉపాధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నవారిలో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు దక్కటం లేదని నివేదిక పేర్కొన్నది. కరోనాకు ముందునాటి 2019తో పోల్చితే నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని తెలిపింది.
ప్రకటనలకు పరిమితం
            దేశవ్యాప్తంగా కార్మికరంగంలో నవంబర్‌, 2022నాటికి 40.18కోట్లమంది ఉపాధి పొందుతున్నారు. కరోనా సంక్షోభం రాకముందు నవంబర్‌, 2019లో ఉపాధిపొందేవారి సంఖ్య 40.3కోట్లు. గత మూడేండ్లుగా ఉపాధి రంగం స్తుబ్దుగా ఉండిపోయిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. కార్మికరంగంలో ప్రవేశించాలని ఎంతోమంది తాపత్రయ పడుతున్నా, వారికి సరైన ఉపాధి లభించటం లేదని తెలుస్తోంది. నిరుద్యోగం తీవ్రరూపం దాల్చుతోందని ప్రతిపక్షాలు, యువత ఆందోళనలు చేపడుతున్నప్పుడల్లా, ఉద్యోగాల భర్తీపై బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. 10 లక్షల ఉద్యోగ ఖాళీలు (రోజ్‌గార్‌ మేళా) చేపడతున్నామని ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. కేంద్రంలోని అన్నిశాఖల్లోనూ నియామకాలుంటాయని తెలిపారు. కొద్ది రోజులు గడిచాక..మళ్లీ అంతా మామూలే. ఆందోళనలు, నిరసనలు, యువత ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఇదొక ఎత్తుగడగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రోజ్‌గార్‌ మేళా ఆర్భాటం
            ప్రధాని మోడీ ప్రకటించిన 'రోజ్‌గార్‌ మేళా' ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయింది. దేశంలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్ట్‌ల ద్వారా ఉద్యోగాల కల్పన చేశామని ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి పొందుతున్నవారి లెక్కలూ 'రోజ్‌గగార్‌ మేళా'లో వేస్తున్నారు. వారు ఉపాధి పొందటం తన ఘనతగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా, అధిక ధరలు వేధిస్తున్నా..ప్రధాని మోడీ మాత్రం నోరు మెదపటం లేదు. కఠినమైన మౌనం పాటిస్తున్నారు. దేశంలో బడా కార్పొరేట్ల వ్యాపారాలు, వాణిజ్యం పుంజుకున్నాయి. పెద్ద పెద్ద సంస్థల లాభాల మార్జిన్‌ ఎన్నోరెట్లు పెరిగింది. అయితే ఇదంతా ఉపాధి రహిత వృద్ధిగా నిపుణులు చెబుతున్నారు. అందువల్లే దేశంలో అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని అన్నారు. స్టాక్‌మార్కెట్‌లో లిస్టెడ్‌ కంపెనీల లాభాల వృద్ధిని ఆర్థిక వృద్ధిగా భావించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉపాధి వేట
            2019లో కార్మికరంగంలో ఉపాధి పొందేవారి సంఖ్య 44.2కోట్లుగా ఉంది. ఇది 2020లో 42.4 కోట్లకు పడిపోయింది. అటు తర్వాత 2021లో 43.5 కోట్లకు, 2022లో 43.7 కోట్లకు చేరుకుంది. ఈ మధ్యకాలంలో డిగ్రీలు, ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న కొత్తవారెంతో మంది ఉపాధి వేటకు బయల్దేరారు. గత కొన్నేండ్లుగా దేశంలో నిరుద్యోగరేటు తగ్గుముఖం పడటం లేదు. 2019లో 7.4 శాతం నుంచి 2020కి 25శాతానికి పెరిగింది. అటు తర్వాత 10శాతానికి రాగా, నవంబర్‌లో (నెలవారీ సగటు) 7.5శాతం నమోదైంది. 30 రోజుల సగటు లెక్కలోకి తీసుకుంటే, డిసెంబర్‌ 1న 8.2శాతం ఉండగా, డిసెంబర్‌ 16న 9.3శాతం ఉందని నివేదిక గణాంకాలు విడుదల చేసింది. ఇక పట్టణాల్లో నిరుద్యోగరేటు 9.7శాతం దాటుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ 9శాతంపైన్నే ఉంది. డిసెంబర్‌ 2021లో దేశంలో నిరుద్యోగరేటు 7.9శాతం ఉందని లెక్క తేలింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.