Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫీజు కట్టకపోతే పరీక్షకు నో | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 19,2022

ఫీజు కట్టకపోతే పరీక్షకు నో

- యూపీలోని బీబీఏయూ యాజమాన్యం హుకుం
- ఏడాదిగా స్కాలర్‌షిప్‌లు అందని వైనం
- విడుదల చేయడంలో యోగి సర్కారు జాప్యం
లక్నో : యూపీలోని లక్నోలో గల బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ (బీబీఏయూ) యాజమాన్యం తీరు చర్చనీయాంశంగా మారింది. పెండింగ్‌ ఫీజులు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు నిరాకరిస్తూ వర్సిటీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్సిటీ యాజమాన్యం
తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ తమకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను విడుదల చేయలేదనీ, దీంతో తాము ఫీజులు చెల్లించలేకపోయామని చెప్పారు. బీబీఏయూలోని యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (యూఐఈటీ)కు చెందిన విద్యార్థులు వర్సిటీ యాజమాన్యం తీరును నిరసిస్తూ తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
గత, ప్రస్తుత సెమిస్టర్ల ఫీజును చెల్లించని విద్యార్థులు ఈనెల 25 లోగా చెల్లించాలనీ ఒక నోటీసును యాజమాన్యం విడుదల చేసింది. ఫీజు చెల్లించిన వారికే పరీక్షా పత్రాలు నింపడానికి అనుమతిస్తామనీ, జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నది. వర్సిటీ యాజమాన్యం తీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విద్యార్థులు తీవ్ర అంసతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. '' మా సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 12 నుంచి జరుగుతున్నాయి. ఫీజు కట్టనివారిని పరీక్షకు అనుమించలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్‌ల పైనే ఆధారపడతారు. స్కాలర్‌షిప్‌ అందుకునేవారంతా ఆర్థికంగా బలహీన నేపథ్యం నుంచి వచ్చినవారేననీ, ఒకవేళ స్కాలర్‌షిప్‌లు రాకపోతే వారు (విద్యార్థులు) తమ చదువులను బలవంతంగా ఆపాల్సి వస్తుంది'' అని ఒక కూలీ కొడుకు అయిన వర్సిటీ విద్యార్థిత గౌతమ్‌ వాపోయాడు. దళితులు విద్యను అభ్యసించటం వర్సిటీ యాజమాన్యానికి ఇష్టం లేదనీ, లేకపోతే వారు మా స్కాలరషిప్‌ల విషయంలో ఏదో ఒకటి చేసేవారని ఆయన తెలిపాడు. ఈ విషయంలో గతంలో తాము నిరసనలు చేశామని చెప్పాడు. సంబంధిత అధికారులతోనూ మాట్లాడినట్టు వివరించాడు. అయితే, ఫలితం మాత్రం లేదని చెప్పాడు. దళితుల గురించి ఎవరు పట్టించుకుంటారని ఆందోళన వ్యక్తం చేశాడు.
స్కాలర్‌షిప్‌లలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి ఆసిమ్‌ అర్జున్‌ను సైతం కలిశారు. స్కాలర్‌షిప్‌ డబ్బులను విడుదల చేస్తామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలనీ, అలా అయితేనే తాము ఫీజులు చెల్లించగలమని నిరసన చేస్తున్న విద్యార్థులు యోగి సర్కారును డిమాండ్‌ చేశారు. ఫీజుల చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యం తమపై ఒత్తిడి చేస్తున్నదంటూ విద్యార్థులు వాపోయారు. ముఖ్యంగా, డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే వర్సిటీ యాజమాన్యం తమకు హాల్‌ టికెట్లు ఇవ్వదనే భయంతో ఉన్నారు. వర్సిటీలోని లా, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌తో పాటు పలు విభాగాల్లోని విద్యార్థులదీ ఇదే పరిస్థితి. అయితే, విద్యార్థులకు స్కాలరషిప్‌లను ఆలస్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎస్‌ఎప్‌ఐ బీబీఏయూ యూనిట్‌ తన ఆందోళనను వ్యక్తం చేసింది. స్కాలర్‌షిప్‌లలో జాప్యం అనేది ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించింది.
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను ఉన్నత విద్యకునోచకోకుండా చేస్తున్నాయని విద్యావేత్తలు ఆరోపించారు. మైనారిటీలకు ఉద్దేశించిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఫెలోషిప్‌ను కేంద్రం ఇటీవల రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రం చూపెట్టిన దారిలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు నడుస్తున్నాయనడానికి యూపీ సర్కారు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.