Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టెస్టులను పెంచండి.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 23,2022

టెస్టులను పెంచండి..

- కోవిడ్‌ ఇంకా ముగియలేదు..
- అధికారులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు
- ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచన
- అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
- కరోనాపై సమీక్షా సమావేశాలు.. కొత్త మార్గదర్శకాలతో ముందుకు
న్యూఢిల్లీ : ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ప్రధాని మోడీ భేటీ కొనసాగింది. ముందుగా కోవిడ్‌పై ప్రధానికి ఆరోగ్య శాఖ వివరణాత్మక బ్రీఫింగ్‌ ఇచ్చింది. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సన్నాహాలను ప్రధాన మంత్రి ప్రశ్నించారు. అనంతరం అధికారులకు ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు.
కోవిడ్‌ వ్యాప్తిపై గట్టి నిఘా ఉంచాలని ప్రధాని సూచించారు. కోవిడ్‌ ఇంకా ముగియలేదని ప్రధాని మోడీ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలపై మరింత నిఘా ఉంచాలని సూచించారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌, టెస్టింగ్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. మాస్క్‌లు ధరించడంతోపాటు, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండుగల సీజన్‌ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
దీంతోపాటు.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, కరోనా యోధుల నిస్వార్థ సేవను ప్రధాన మంత్రి మోడీ మరోసారి ప్రశంసించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, సిబ్బందితో సహా ఆస్పత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడానికి కోవిడ్‌కు సంబంధించిన అవసరమైన సౌకర్యాలను ఆడిట్‌ చేయాలని రాష్ట్రాలను పీఎం మోడీ కోరారు. అవసరమైన ఔషధాల లభ్యత, ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుందని సూచించారు. సరిపడా మందులు, వ్యాక్సిన్లు, హాస్పిటల్‌ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయని ఈ హైలెవల్‌ మీటింగ్‌లో ప్రధానికి అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశంలో హౌం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవ్య, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన వద్దు..అప్రమత్తంగా ఉందాం..
- కరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ రావు ఉన్నత స్థాయి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             కరోనా పట్ల ఆందోళన అవసరం లేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్‌ వ్యాక్సిన్‌ వెంటనే తీసుకోవాలనీ, బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కోవిడ్‌ సన్నద్ధతపై మంత్రి గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జూమ్‌ ద్వారా నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేతా మహంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జి శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేష్‌ రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎండి చంద్రశేఖర్‌ రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజరు కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ బి.ఎఫ్‌ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్‌ సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం కోవిడ్‌ నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందనీ, ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్‌ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మానవ వనరులు , మందులు , ఆక్సిజన్‌ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్‌ వచ్చిన శాంపిల్స్‌ని జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం గాంధీ ఆస్పత్రికి పంపాలనీ, ఎయిర్‌ పోర్టులో స్క్రీనింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.