Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మధురాంతకం నరేంద్రకు సాహిత్య అకాడమీ అవార్డు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 23,2022

మధురాంతకం నరేంద్రకు సాహిత్య అకాడమీ అవార్డు

- వారాల ఆనంద్‌కు అనువాద పురస్కారం
- 23 భాషలకు,17 పుస్తకాలకు అవార్డులు
- ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ
న్యూఢిల్లీ : తెలుగు రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన మనోధర్మపరాగం నవలకు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అలాగే రచయిత, కవి వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ రచయిత గుల్జార్‌ హిందీలో రాసిన గ్రీన్‌ పోయెమ్స్‌ (కవిత)ను తెలుగులోకి 'ఆకుపచ్చ' కవితల పుస్తకానికిగాను వారాల ఆనంద్‌కు ఈ పురస్కారం లభించింది. గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర్‌ కంబర్‌ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశం అనంతరం 2022 ఏడాది సంబంధించి 23 భాషలకు అవార్డులను, 17 పుస్తకాలకు అనువాద పురస్కారాలను ప్రకటించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి ఏడు కవిత్వం, ఆరు నవల, రెండు లఘు కథలు, మూడు ప్లే డ్రామా, రెండు సాహిత్య విమర్శ, ఒక ఆత్మకథ రచన, ఒక ఆర్టికల్స్‌ సేకరణ, ఒక సాహిత్య చరిత్రకు సంబంధించిన పుస్తకాలు సాహిత్య అకాడమీ అవార్డు లు గెలుచుకున్నాయని తెలిపింది. 2016 జనవరి 1నుంచి 2020 డిసెంబర్‌ 31 ఐదేండ్లలో రాసిన పుస్తకాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, రాగి షీల్డ్‌ అందజే యనున్నట్టు వెల్లడించింది. బెంగాలీ భాషకు సంబం ధించి త్వరలోనే ప్రకటిస్తామని సాహిత్య అకాడమీ పేర్కొంది. తెలుగు భాషకు జ్యూరీ సభ్యులుగా సిఎల్‌ఎల్‌ జయప్రద, నందిని సిద్థారెడ్డి, పి. కుసుమ కుమారి వ్యవహరించారు. అనువాద పురస్కారానికి సంబంధించి 17 పుస్తకాలను ఎంపిక చేసింది.
మనోధర్మపరాగం నవలా నేపథ్యం
మనోధర్మపరాగం నవలను వ్యక్తుల చరిత్రల్ని, సామాజిక చరిత్రని మిళితం చేస్తూ రచయిత మధురాంతకం నరేంద్ర రాశారు. దాదాపు ఒక శతాబ్దన్నర కాలాన్ని, ఆ కాలంలో ఉన్న దేవదాసీ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని, ఇంగ్లీషు వాళ్ళు వచ్చిన తరువాత దేవదాసీల ఈనాం భూములు రద్దు చేయటంవల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు, ఆ మార్పుల ఫలితంగా వాళ్ళు నమ్ముకున్న సంగీతం, నాట్యం మొదలైన వాటిలో వచ్చిన మార్పులు అన్నీ ఈ నవలలో పేర్కొన్నారు.
మధురాంతకం నరేంద్ర జీవిత నేపథ్యం
మధురాంతకం నరేంద్ర చిత్తూరు జిల్లా పాకాల మండలం, రమణయ్యగారి పల్లెలో 1959 జూలై 16న జన్మించారు. ఆయన తండ్రి మధురాంతకం రాజారాం అదే ఊళ్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. నరేంద్రకు సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2014లో మల్లెమాల సాహితీ పురస్కారంతో మరో 11 రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి.
ఆకుపచ్చ కవితల నేపథ్యం
గుల్జార్‌ గ్రీన్‌ పోయెమ్స్‌ని పవన్‌ కె వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో తెలుగులోకి ద్విభాషాకవి, జర్నలిస్టు వారాల ఆనంద్‌ అనువదించారు. ఇందులోని 58 కవితలన్నీ ప్రకృతికి సంబంధించినవే. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఎంతో సూటిగా, సున్నితంగా, సరళంగా చెప్పిన కవితలు.
వారాల ఆనంద్‌ జీవిత నేపథ్యం
వారాల ఆనంద్‌ వేములవాడలో 1958 ఆగస్టు 21న జన్మించారు. డిగ్రీ వరకు విధ్యాభ్యాసం కరీంనగర్‌లో జరిగింది. పి.జి. తెలుగు, తత్వశాస్త్రం, లైబ్రరీ సైన్స్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. లైబ్రేరియన్‌గా 1980-2016 వరకు పలు జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో పని చేశారు. అదే విధంగా ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో గ్రంధాలయ భవన్‌ నిర్మాణం, రెండు జాతీయ సెమినార్ల నిర్వహణ, రెండు మైనర్‌ రిసర్చ్‌ ప్రాజెక్టుల నిర్వహణ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సహకారంతో బుక్‌ ఫెస్టివల్స్‌ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంద్‌ కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్షుడు, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కౌన్సిల్‌ సభ్యుడుగా ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.