Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీ వ్యవహారంలో ప్రధాని పేరొద్దు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 19,2023

అదానీ వ్యవహారంలో ప్రధాని పేరొద్దు

- మీడియా సంస్థలకు బీజేపీ నేతల ఆదేశాలు
            గౌతం అదానీ ఆర్థిక అక్రమాల్ని 'హిండెన్‌బర్గ్‌' బయటపెట్టాక, మీడియాలో పెద్ద ఎత్తున చర్చసాగింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాల గొంతును నొక్కేయటమేగాక, వారి ప్రశ్నలు అధికారిక రికార్డుల్లో నమోదుకాకుండా కేంద్రం తొలగించింది. అంతేగాక ఆ రోజు రాత్రి దేశంలోని మీడియా సంస్థల యాజమాన్యాలకు బీజేపీ పెద్దల నుండి ఫోన్‌కాల్స్‌ వెళ్లాయి. చర్చల సందర్భంగా 'ప్రధాని మోడీ పేరు వినిపించడానికి వీల్లేదు' అనే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాని మోడీ పేరు వినిపించిందా? పర్యావసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది.. ఆ ఫోన్‌ కాల్స్‌ సందేశం.
- మోడీ పేరు చర్చకు తేవద్దంటూ బెదిరింపులు
- వేధింపులు, బెదిరింపులతో స్వతంత్ర మీడియాపై దాడులు
- సుప్రీంకోర్టును టార్గెట్‌ చేస్తూ..పాంచజన్యలో ఆర్‌ఎస్‌ఎస్‌ సంపాదకీయం
- భారత్‌లో మునుపెన్నడూ లేని పరిస్థితులు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చింది మొదలు, దేశంలో మీడియాకు సంకెళ్లు బిగుసుకున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే పాత్రికేయుల్ని, ఎడిటర్స్‌ను బెదిరించటం, జైళ్లకు పంపటం సర్వసాధారణమై పోయింది. 'బీబీసీపై ఐటీ దాడుల' వ్యవహారం బయటకు కనిపించేది మాత్రమే, కనిపించనవి ఎన్నో ఉన్నాయని, సామాన్యుడికి తెలియకుండా అనేకం జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టును అవమానించిన ఆర్‌ఎస్‌ఎస్‌
            గుజరాత్‌లో 2002 మారణకాండపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ డాక్యుమెంటరీ ప్రసారాలను నిషేధించాలనే పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అధికార బీజేపీ నాయకులకు, ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలకు సుప్రీంకోర్టు తీరు మింగుడుపడలేదు. దాంతో సుప్రీంకోర్టును అవమానపర్చే పన్నాగానికి తెరలేపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధికారిక వార పత్రిక (పాంచజన్య)లో రాసిన 'సంపాదకీయం'లో సుప్రీంకోర్టుపై అనేక విమర్శలు ఎక్కుపెట్టింది. మరోవైపు బీబీసీపై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. డాక్యుమెంటరీ విడుదలైన నెలరోజుల్లో ఐటీ దాడులు చోటుచేసుకున్నాయి. పన్ను ఎగవేతలు, ఆర్థిక అక్రమాలపై ఆధారాల్ని సేకరించాలని ఐటీ అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి కొనసాగుతోంది. దీనిని ఎలా డీల్‌ చేయాలో ఐటీ శాఖ ఉన్నతాధికారులకు అర్థం కావటం లేదు. ఇన్నేండ్లుగా బీబీసీపై రాని అనుమానం, లేని అక్రమాలు..ఇప్పుడు కొత్తగా గుర్తించడానికి ఐటీ శాఖ యంత్రాంగం రాత్రిపగలు అన్న తేడా లేకుండా పని చేయాల్సి వస్తోంది. ఏదో ఒక లోపాన్ని, అక్రమాన్ని గుర్తించాలని ఐటీ శాఖపై మోడీ సర్కార్‌ చేస్తున్న ఒత్తిడి మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల లోకం దీనిపై మాట్లాడుకుంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పాత్రికేయులు రాకుండా అడ్డంకులు
            భారత్‌లో పనిచేస్తున్న విదేశీ మీడియా ప్రతినిధులపై గతకొన్నాండ్లుగా కేంద్రం పలు ఆంక్ష లు విధిస్తోంది. వారి వీసా పేపర్లకు ఆమోదం తెలప టం లేదు. భారత్‌లో పనిచేస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన మీడియా కరస్పాండెంట్స్‌ వీసా పేపర్లను కేంద్రం పక్కనపడేసింది. దాంతో వారు ఇక్కడ ఉండాలో, స్వదేశానికి వెళ్లిపోవాలో ? తెలియని సంకట స్థితిలో ఉండిపోయారు. ఇటీవల అమెరికాకు చెందిన ఒక పాత్రికేయుడు భారత్‌కు రాకుండా కేంద్రం నిరాకరిం చింది. బ్రిటన్‌ ప్రభుత్వ మీడియా అయిన 'బీబీసీ'పై ఏకంగా బెదిరింపులకు దిగింది. భారత్‌లో మీడియా స్వేచ్ఛపై ఇంత తీవ్రస్థాయిలో దాడులు జరుగుతు న్నా, పాశ్చాత్య మీడియా నోరు మెదపటం లేదు.
మీడియా స్వేచ్ఛపై కత్తి
            ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, బెదిరింపులకు లోంగని వారిని కేంద్రం టార్గెట్‌ చేస్తోంది. అదానీ అక్రమాలు, బీబీసీ డాక్యుమెంటరీ బయటకు కనిపించే ఉదాహరణలు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని స్వతంత్ర మీడియా పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, డిజిటల్‌ మీడియా సంస్థల యాజమాన్యాలు, ఎడిటర్స్‌..మోడీ సర్కార్‌కు శత్రువులుగా కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకునే స్థితిలోకి బీబీసీని నెట్టడం మోడీ సర్కార్‌ వ్యూహం. తద్వారా దేశంలోని మిగతా మీడియాను కూడా ప్రభావితం చేయాలన్నది ఉద్దేశం. నిధులు అడ్డుకోవటం, పాత్రికేయుల్ని జైలు పాలు చేయటం పెద్ద విషయం కాదని బీజేపీ పెద్దలు బెదిరింపులకు దిగుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.