Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంఎస్‌సీఎస్‌ వద్దు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2023

ఎంఎస్‌సీఎస్‌ వద్దు

- సహకార సంఘాలపై కేంద్రం తీరు సరికాదు
- రాష్ట్రాల అధికారాల్లో జోక్యం
- ఫెడరల్‌ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్న మోడీ సర్కారు
- కేరళ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత
తిరువనంతపురం : దేశంలో సహకారం సంఘాలపై పెత్తనం చలాయించాలని చూస్తున్న కేంద్రం తీరును కేరళ సర్కారు తప్పుబట్టింది. కేంద్రం గతంలో చేసిన సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించింది. మోడీ సర్కారు సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించింది. వాస్తవానికి సహకార సంఘాలు అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో రాష్ట్ర జాబితాలో ఉన్న 32 అంశాల్లో సహకార సంఘాలు అనేవి ఒకటి. దీంతో మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో సహకార సంఘాలను తన చేతిలోకి లాక్కోవాలని మోడీ సర్కారు యోచిస్తున్నదని నిపుణులు, విశ్లేషకులు ఆరోపిం చారు. రాష్ట్ర జాబితాలో కేంద్రం వేలు పెట్టాలనుకోవడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు.
2021-22 బడ్జెట్‌ ప్రసంగంలో బహుళరాష్ట్ర సహకార సంఘాలు (ఎంఎస్‌సీఎస్‌) గురించి ప్రకటన వచ్చింది. కేంద్రం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై 2021, జులైలో ప్రకటన చేసింది. దీంతో ఎంఎస్‌సీఎస్‌పై కేంద్రం తీరును అప్పటి నుంచి అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వందేండ్లుగా సహకార సంఘాలను విజయవంతంగా నడుపుతున్న కేరళ రాష్ట్రం మోడీ సర్కారు ఎత్తులను ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది.
ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం
బహుళ రాష్ట్ర సహకార సంఘాల ( సవరణ) బిల్లు, 2022 ను లోక్‌సభలో గతేడాది డిసెంబర్‌ 7న ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సెషన్‌ రెండో భాగంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదికను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న చట్టానికి అనేక సవరణలతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఏదైనా సహకార సంఘం ఉనికిలో ఉన్న ఎంఎస్‌సీఎస్‌లో కలిసేలా ఈ బిల్లు దారి కల్పిస్తుంది. అలాగే కేంద్రం సహకార ఎన్నిక యంత్రాంగంను ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్రాలను సంప్రదించలేదు
కేంద్రం చేస్తున్న ఈ చర్యనే కేరళ వద్దంటున్నది. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటున్నదని కేరళ సహకార మంత్రి వి.ఎన్‌ వాసవన్‌ అన్నారు. 'ఒకే దేశం, ఒకే భాష' తర్వాత బీజేపీ 'ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషన్‌' విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే దీని ఉద్దేశమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహకార రంగం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశమైనప్పటికీ.. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించలేదని విజయన్‌ సర్కారు ఆరోపించింది. సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి, రిజిస్ట్రార్‌కు నేరుగా ఆదేశాలు ఇచ్చారని వాసవన్‌ ఆరోపించారు.
ఎంఎస్‌సీఎస్‌ రాజ్యాంగానికి విరుద్ధం
బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం, 1984 అమలులోకి వచ్చిన తర్వాత ఎంఎస్‌సీఎస్‌ ఉనికిలోకి వచ్చింది. ఎంఎస్‌సీఎస్‌పై కేరళ ఆందోళనను వెలిబుచ్చింది. ఈ సొసైటీలు ఇతర విధులతో పాటు నిధులను సేకరించేందుకు, వడ్డీరేట్లను స్వతంత్రంగా నిర్ణయించడానికి అధికారం కలిగి ఉంటాయని కేరళ మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా సహకార విభాగం ఇలాంటి సొసైటీలను నియంత్రించలేవనీ, అది తప్పుడు నిర్వహణకు దారి తీస్తుందని, ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతారని తెలిపారు. ఎంఎస్‌సీఎస్‌ అనేది రాజ్యాంగానికి విరుద్ధమని నిపుణులు అన్నారు.
కేరళ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది?
కేరళ ఒక బలమైన సహకార వ్యవస్థకు పేరు గాంచింది. 1910 నుంచి వందేండ్లకు పైగా చరిత్రను కలిగి ఉన్నది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు కూడా ట్రావెన్‌కోర్‌ (1914), కొచిన్‌ (1913), మలబార్‌ (1932) ప్రాంతాల్లోనూ సహకార చట్టాలు ఉండేవి. ప్రస్తుతం కేరళలో మొత్తం 941 పంచాయతీలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) 1607, మత్స్యకార సంఘాలు 1562 ఉన్నాయి. అలాగే, 23,167 సహకార సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉరాలుంగల్‌ కార్మిక ఒప్పంద సహకార సంఘం (యూఎస్‌సీసీఎస్‌), బ్రహ్మగిరి డెవలప్‌మెంట్‌ సొసైటీ (బీడీస్‌), కేరళ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌ (కేరళ బ్యాంకు), ఎస్సీ, ఎస్టీ సహకార సంఘం, వనిత సహకార సంఘాలు వంటివి చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రజల ద్వారా నడుస్తున్న ఈ సహకార వ్యవస్థను కేంద్రం నాశనం చేయాలని, స్వార్థ ప్రయోజనాలను రుద్దాలని ప్రయత్నిస్తున్నదని వాసవన్‌ అన్నారు. కేంద్ర సహకార శాఖ నిర్ణయాలను, దానితో కలిగే ముప్పు దృష్ట్యా వ్యతిరేకించాలని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.