Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆధార్‌తోనే బువ్వ... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2023

ఆధార్‌తోనే బువ్వ...

- మిడ్‌ డే మీల్స్‌లో మోడీ సర్కార్‌ కోత!
- విద్యార్థుల ఆధార్‌ వివరాలు కోరిన కేంద్రం
- బడుగుల బిడ్డలపై సదువుల బండ
- ఆ ఆలోచనే విరమించుకోవాలి : సామాజిక కార్యకర్తలు
         బతుకుబండి లాగటమే కష్టమవుతుంటే..సర్కారు బడుల్లో పెట్టే మధ్యాహ్న భోజనమైనా తిని బిడ్డలు బాగుపడతారు..అని అనుకుంటున్నారు పేదలు. కానీ మోడీ ప్రభుత్వానికి ఇవేం పట్టవు. పైసలుంటే కార్పొరేట్‌ బడుల్లో చదువుకోండి. అంతేకానీ మీకు సబ్సిడీలు,సంక్షేమ పథకాలు అమలు చేయటం అసాధ్యమంటోంది. ఎన్నికలొచ్చిపుడు మాత్రం కటాఫ్‌ డేట్లు పెట్టి మరీ పేదల ఓట్లేసుకోవటం కామన్‌ అయిపోయింది. తాజాగా ఆధార్‌ లింకు చేసి..మీడ్‌ డే మీల్స్‌ను ఎత్తేసే కుట్రలకు దిగుతోంది. ఇది పేద కుటుంబాలను చదువులనుంచి దూరం చేయటమే నని సామాజికవేత్తలు ఆక్షేపిస్తున్నారు.
           న్యూఢిల్లీ: దేశంలోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మిడ్‌డే మీల్స్‌ అమలు ఇప్పటికీ సమస్యగానే మిగిలి ఉన్నది. ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడంలో యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం చర్య ఇప్పుడు కలవరానికి గురి చేస్తున్నది. ఈ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
దేశంలోని ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆధార్‌తో ప్రామాణీకరించబడిన విద్యార్థుల సంఖ్య మరియు ప్రతి ఒక్కరికి అందించే భోజనాల సంఖ్యపై కేంద్రం నెలవారీ అప్‌డేట్‌లను కోరింది. ఇప్పుడిదే పేద వర్గాలకు చెందిన విద్యార్థులు, వారి కుటుంబాలలో భయాలను రేకెత్తిస్తున్నది. కేంద్రానికి చెందిన పీఎం పోషణ్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా డేటాను అప్‌లోడ్‌ చేయాలనే ప్రభుత్వ ఆదేశంతో ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులపై ఇటీవల కేంద్రం తీరు నేపథ్యంలో మిడ్‌ డేమీల్స్‌పై ఈ అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు.
           ఇటు ఆధార్‌ అనుసంధానంపై ఆందోళనలు వెలువడుతున్నప్పటికీ సంబంధిత విభాగాలు మాత్రం స్పష్టతను ఇవ్వడం లేదు. పాఠశాల విద్యా కార్యదర్శి సంజరు కుమార్‌కు ఈ విషయంలో ఈ-మెయిల్‌ పంపినా సమాధానం లేదని సామాజిక కార్యకర్తలు అన్నారు. మధ్యాహ్న భోజనానికి ఆధార్‌ లింక్‌ చేయడం వినాశకరమైనదని సామాజిక కార్యకర్త నిఖిల్‌ డే అభిప్రాయపడ్డారు. దేశంలో చాలా మంది పిల్లలు ఇంకా ఆధార్‌ కోసం నమోదు చేసుకోలేదని తెలిపారు. ఉచిత పాఠశాల విద్య ఒక హక్కు అనీ, దాన్ని లాభదాయకంగా చూడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే. అయినా మోడీ ప్రభుత్వం మీడ్‌ డే మీల్స్‌ కు ఆధార్‌ లింక్‌ చేయటం లాంటి చర్య.. ఏదైనా చట్ట విరుద్ధం అని, ఏ పాఠశాల ప్రయోజనం అయినా ఆధార్‌పై షరతులు విధించబడదని ఆర్థికవేత్త, పబ్లిక్‌ పాలసీ నిపుణుడు జీన్‌ డ్రేజ్‌ అన్నారు.
           ఆధార్‌-ప్రామాణీకరించబడిన విద్యార్థుల సంఖ్య, జిల్లా అధికారుల నుంచి ప్రతి పాఠశాలకు వచ్చిన నిధులు, నెలలో ఖర్చు చేసిన నిధులు, ఈనెలలో వడ్డించిన భోజనం గురించి నెలవారీ డేటాను కోరుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత నాలుగు నెలల్లో అన్ని రాష్ట్రాలకు రెండు లేఖలు రాసింది. ప్రతినెలా పది లోపు ప్రధాన మంత్రి పోషణ్‌ పోర్టల్‌లో డేటాను అప్‌లోడ్‌ చేయాలని జాయింట్‌ సెక్రెటరీ ప్రాచీ పాండే తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ఆధార్‌ ఫీడ్‌ చేసిన తర్వాతే మధ్యాహ్న భోజనం పథకంలో ఆధార్‌ అనుసంధానం విజయవంతం అవుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ , నెట్‌వర్క్‌ పనితీరు తక్కువగా ఉండటం, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా చాలా పాఠశాలలు జిల్లా అధికారులకు డేటాను పంపడానికి ఇబ్బంది పడతాయని విశ్లేషకులు అన్నారు. ప్రధాన మంత్రి పోషన్‌ పథకం 11 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల వరకు 11 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. అయితే, వీరిలో పేద, అణగారిణ వర్గాల ప్రజలు అధికంగా ఉంటారనీ, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ వారిని ఈ పథకం నుంచి దూరం చేస్తుందని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు అన్నారు. ఈ ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.