Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీ మోసాలకు అంతేలేదయా..!. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2023

అదానీ మోసాలకు అంతేలేదయా..!.

- ఆస్ట్రేలియాలోనూ బాధితులు
- ప్రజల రిటైర్మెంట్‌ పొదుపులు ప్రభావితం
- పెద్ద ఎత్తున పెట్టుబడులతో భారీగా నష్టం
- అదానీ గ్రూపు స్టాక్స్‌లో ఏర్పడిన క్షీణతే కారణం
- వెల్లడించిన 'ది గార్డియన్‌' పత్రిక
న్యూఢిల్లీ: అదానీ బాధితుల చిట్టా భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. కేంద్రం సాయంతో ఆయన వ్యాపారాలు విదేశాలకు పాకిన విధంగానే.. అక్కడ కూడా బాధితులు పెరుగుతున్నారు. హిండెన్‌ బర్గ్‌ పరిశోధక నివేదిక బయటకు వచ్చిన అనంతరం అదానీ గ్రూపు కంపెనీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం విదితమే. ఫలితంగా భారత్‌లోని పెట్టుబడుదారులు లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ఈ విషయం ఇటు భారత పార్లమెంటులో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు మోడీ సర్కారును ప్రశ్నించాయి. సుప్రీంకోర్టు సైతం దేశంలోని పెట్టుబడిదారుల రక్షణ విషయంలో కేంద్రం స్పందనను కోరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో 'ది గార్డియన్‌' పత్రిక అదానీ కంపెనీకి సంబంధించిన ఇంకో విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. అదానీ బాధితులు భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదనీ, ఆస్ట్రేలియాలోనూ ఉన్నారని వివరించింది.
పెట్టుబడులకు భారీ దెబ్బ
'ది గార్డియన్‌' పత్రిక కథనం ప్రకారం.. మోడీ సర్కారు ఇచ్చిన విపరీతమైన స్వేచ్ఛ అదానీ వ్యాపార విస్తరణకు కారణమైంది. దేశీయంగానే కాదు.. విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టడం.. పోర్టులు చేజిక్కించుకోవడం.. ఆకాశమే హద్దుగా విపరీతమైన లాభాలను గడించింది. ఆస్ట్రేలియాలను బొగ్గు గనులతో పాటు ఒక పోర్టును సైతం అదానీ గ్రూపు నిర్వహిస్తున్నది. దీంతో అదానీ గ్రూపు కంపెనీలకు మంచి పేరు వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి అదానీ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అయితే అదానీ గ్రూపు కంపెనీ స్టాక్స్‌లో ఏర్పడిన క్షీణతతో ఆస్ట్రేలియా ప్రజల రిటైర్మెంట్‌ పొదుపులు ప్రభావితం అయ్యాయి. వారు అదానీ సంస్థల్లో పెద్ద ఎత్తును పెట్టుబడులు పెట్టడంతో నష్ట పోయారని 'ది గార్డియన్‌' వెల్లడించింది. ముఖ్యంగా, క్వీన్స్‌ లాండ్‌ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కామన్‌వెల్త్‌ సిబ్బందికి సంబంధించిన ఫండ్‌పై ఎక్కువ ప్రభావం చూపినట్టు పేర్కొన్నది.
ఆస్ట్రేలియాలో వ్యాపార సామ్రాజ్యం
అదానీ గ్రూపునకు ఆస్ట్రేలియాలోనూ వ్యాపార సామ్రాజ్యము ఉన్నది. అక్కడ కార్మైకేల్‌ బొగ్గు గనితో పాటు అబాట్‌పాయింట్‌ పోర్టును అదానీ గ్రూపు నిర్వహిస్తున్నది. ఈ సంస్థలు అక్కడ మంచి వృద్ధిని నమోదు చేశాయి. ఈ కారణంగా అక్కడ ఈ కంపెనీలకు పేరు వచ్చింది. దీంతో అనేక సూపర్‌ యాన్యుయేషన్‌ ఫండ్‌లు వీటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కామన్‌వెల్త్‌ బ్యాంకు దీర్ఘకాలిక ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి రూ. 20.12 లక్షల కోట్లు (243 బిలియన్‌ డాలర్లు)తో ఒక ఫ్యూచర్‌ ఫండ్‌ను ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది. అదానీ గ్రూపులోని రెండు కంపెనీల్లో అది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. పెట్టుబడితో పోలిస్తే ప్రస్తుత స్టాక్‌ విలువ దారుణంగా పడిపోవడం గమనార్హం.
భారీగా పెట్టుబడులు
బ్రిస్బేన్‌కు చెందిన ఆస్ట్రేలియన్‌ రిటైర్మెంట్‌ ట్రస్టుకు రూ. 16.56 లక్షల కోట్ల ( 200 బిలియన్‌ డాలర్ల)ఆస్తులున్నాయి. అది కూడా అదానీ గ్రూపులో ని దాదాపు ఆరు కంపెనీల్లో లక్షలాది డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. హెల్త్‌, కమ్యూనిటీ సర్వీస్‌ వర్కర్లకు సేవలందించే రూ. 5.79 లక్షల కోట్ల (70 బిలియన్‌ డాలర్ల) విలువైన హెస్టా ఫండ్‌ కూడా వీటిలో పెట్టుబడి పెట్టినట్టు గార్డియన్‌ పేర్కొన్నది. నార్వేకు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌కు సైతం పెద్ద ఎత్తున ఈ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. కానీ.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడే కొంత కాలానికి ముందే.. తన మొత్తం వాటాలను విక్రయించి బయటపడిందని గార్డియన్‌ వివరించింది. గార్డియన్‌ కథనం నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనూ అదానీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.