Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్యదర్శివర్గంలోకి కొత్తగా ... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2022

కార్యదర్శివర్గంలోకి కొత్తగా ...

భూస్వాములను ఎదురించి ఉద్యమాలవైపు
తీగల సాగర్‌ ప్రస్థానం...
విద్యార్థి, యువజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల్లో కీలకంగా పనిచేసిన తీగల సాగర్‌... ఆ తర్వాత రైతు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నారాయణపేట జిల్లా, మండలంలోని కోటకొండ గ్రామంలో జన్మించారు. ఎనిమిదోతరగతి చదువుతున్న సమయంలో గ్రామ భూస్వామిని ఎదిరించాడు. పదోతరగతిలో మూఢనమ్మకాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా నికరంగా నిలబడ్డాడు. భగత్‌సింగ్‌ యువజన సంఘాన్ని స్థాపించారు. భూస్వామి బనాయించిన అక్రమ కేసులతో ఇంటర్‌లోనే జైలుకు వెళ్లాడు. 1997లో ఎల్‌ఎల్‌బీ చదివేందుకు హైదరాబాద్‌ వచ్చారు. అప్పటి నుంచే ఎస్‌ఎఫ్‌ఐలో చురుగ్గా పాల్గొన్నారు. 1997 నుంచి 2005 వరకు ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు, ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రైతుసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017నుంచి రైతు సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.విద్యార్థి దశ నుంచే ఉద్యమాలవైపు
ఎండీ అబ్బాస్‌
   జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(జీ) గ్రామంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వారి తాత నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రాణాలు వదిలారు. 1999లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌లో పీజీ పూర్తిచేశారు. అదే ఏడాది జులైలో పార్టీ పూర్తికాల కార్యకర్తగా వచ్చారు. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లోని బషిర్‌బాగ్‌ కాల్పుల ఘటనలో లాఠీదెబ్బలు తిని అరెస్టయి జైలుకూ వెళ్లారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండ నేపథ్యంలో ఏర్పాటైన అవాజ్‌ సంస్థకు మొదటి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ముస్లిం రిజర్వేషన్ల సాధన పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకుడిగా కొనసాగిన సుదీర్ఘ మహాజనపాదయాత్ర బృందంలో భాగస్వామి అయ్యారు.
విలేకరి నుంచి విప్లవ ప్రయాణం...
పాలడుగు భాస్కర్‌
   మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కేంద్రంలో వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించారు. మహబూబాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, ఖమ్మంలోని సిద్దారెడ్డి కళాశాలలో డిగ్రీ చదివారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే 1995 నుంచి 1997 వరకు ప్రజాశక్తి దినపత్రికలో గార్ల విలేకరిగా పనిచేశారు. 1998లో ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చి సీఐటీయూ బాధ్యతలు స్వీకరించారు. అదే సంవత్సరం కేవీపీఎస్‌ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో గార్ల కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఎన్నికై వైస్‌చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు.
   పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు నేతృత్వంలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌యాత్రలో పాల్గొన్నారు. 2003లో మహబూబ్‌నగర్‌లో జరిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్మికగర్జన పాదయాత్రలో 400 కిలోమీటర్లు నడిచారు. 2014లో సీపీఐ(ఎం) ప్రథమ మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ మూడో మహాసభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అంకితభావంతో పార్టీ కోసమే..
మల్లు లక్ష్మి
   రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల్లో ఆమె ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా నూతనంగా ఎన్నికయ్యారు. 1996లో ఐద్వా సభ్యత్వం, 2002లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నల్లగొండ పట్టణ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. సూర్యాపేట మండలంలో రాయిన్‌గూడెం సర్పంచ్‌గా 2006లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2011లో ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, 2015లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2018లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.