Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెట్టింపు ఆదాయం ఉత్తమాటే..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2022

రెట్టింపు ఆదాయం ఉత్తమాటే..!

- ఆ దిశగా బడ్జెట్‌లో కేటాయింపుల్లేని వైనం
- నిటి అయోగ్‌ సూచనలను సైతం పట్టించుకోని ఆర్థిక మంత్రి
- రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన బీజేపీ సర్కారు
గుడిగ రఘు
      'భూమినే నమ్ముకున్న అన్నదాతలు కష్టాల్లో ఉన్నారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తేగానీ సాగుబండి నడిచే పరిస్థితి లేదు. పంట చేతికొచ్చినప్పుడు రైతు ఎంత ఆనందపడుతాడో, దాన్ని అమ్మితే అప్పులు తీరి, అవసరాలకు తగిన ఆదాయం మిగిలితే రైతుకుండే ఆ సంతోషమే వేరు' అంటూ ప్రధాని నరేంద్రమోడీ 2016 ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించలేదు. అందుకనుగుణంగా కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్‌లో చేయలేదు. గతేడాది సర్కారు వడ్డీ మాఫీ కోసం రూ 18,142 కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ 19,500 చూపించింది. రుణమాఫీ కోసం రూ 1,300 కేటాయించినట్టు కనిపించినప్పటికీ అది వడ్డీ రాయితీకి కూడా సరిపోదు. పంటల బీమాకు గతేడాది ఖర్చు మాత్రం రూ 15,989 కేటాయించినా, రూ 15,500 కోట్లకే పరిమితమైంది. రూ 489 కోట్లు మిగుల్చుకుంది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కోసం స్వల్పంగా పెంచింది. ఆహార భద్రత విషయంలో రూ 500 కోట్లు తగ్గించి రైతుల ఆదాయానికి గండికొట్టింది. ఉద్యావన పంటలకు, వర్షాభావ ప్రాంతాలపై కేంద్ర శీతకన్నేసింది. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నదనీ, సాగుకయ్యే ఖర్చు, కుటుంబ శ్రమను కలుపుకుని కనీస మద్దతు ధర నిర్ణయించాలనే స్వామినాథన్‌ కమిటీ సిఫారులను బీజేపీ సర్కారు విస్మరించింది. దాని ప్రతి నిర్ణయం వెనుక కార్పొరేట్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా రైతు సంక్షేమానికి కోతలు పెడుతూ...మరోవైపు ఆదాయం రెట్టింపు చేయడం ఎలా సాధ్యమని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
లక్ష్యం రూ 21,146...వస్తున్నది రూ 12952
కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు ( ఫార్మర్‌ ఇన్‌కం డబుల్‌) చేయడంలో భాగంగా రూ 21,146 లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ప్రస్తుతం ఒక్కొ రైతు కుటుంబానికి వస్తున్న ఆదా యం మాత్రం రూ 12,952 నమోదవుతున్నది. 2012-13లో ఈ ఆదాయం రూ 6,496 ఉండగా, 2015-16లో 8,059గా లెక్కలేసింది. 2018-19లో అది పదివేలుగా
నమోదైంది. ఈ లెక్క ప్రకారం ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతుకు మిగులుతున్నది అంతంతేనని విధితమవుతున్నది. నిటి అయోగ్‌ అధ్యయనం ప్రకారం వ్యవసాయేతర కార్మికుడి ఆదాయం 34 శాతంగా ఉంది. దీంతో కార్మికుడి, కర్షకుడి ఆదాయంలో చాలా తీవ్రమైన వ్యత్యాసం కొనసాగుతున్నది. సాగు ఖర్చులు భారమవుతున్నాయి.
రైతుకు సవాళ్లేన్నో
సాగు కోసం రైతు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాటికి పరిష్కారం చూపించకుండా రైతుకు రెట్టింపు ఆదాయమనేది కలే. దేశంలో ఉదారవాద విధానాలు ప్రవేశించిన తర్వాత వాటి ప్రభావం వల్ల రైతు ఆత్మహత్యలు పెరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఎనిమితి లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మన రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటున్నాయి. వాటికి పరిహారం అందనిద్రాక్షగా మారింది. సాగుబడి కోసం తెచ్చిన అప్పులు తీరక, విధిలేని పరిస్థితుల్లో రైతులు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. పండిన పంటలకు కనీస మద్దతు ధరలకు గ్యారంటీ కూడా లేదు. ఆ చట్టం చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ఇప్పటికే ఎరువుల ధరలు పెంచిన కేంద్రం...తాజాగా యూరియా సబ్సిడీకి కోత పెట్టింది. ఫలితంగా రైతులపై ధరల భారం పడనుంది. సాగుకు సాంకేతికతను జోడిస్తే తప్ప రైతుకు మేలు జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ దిశగా కూడా బడ్జెట్‌లో నిధులులేవు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు. యాంత్రీకరణ, సబ్సిడీలు...ఇలా అన్ని విధాలుగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
'సహకార'ం నిర్వీర్యం
బీజేపీ సర్కారు వ్యవసాయ సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నది. వాటి స్థానంలో ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో)లను ప్రోత్సహిస్తున్నది. దీని ఫలితంగా రైతులకు సహకారం ఉండదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో 908 వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వాటికి సహాయనిరాకరణ చేయడంతో అవి అప్పుల్లో కూరుకుపోయాయి. ఆత్మనిర్భర్‌ పథకంలో భాగంగా సహకార సంఘాలకు కేంద్రం రూ.3వేల కోట్లు కేటాయించింది. ఒక్కొక్క సంఘానికి రెండు కోట్ల చొప్పున ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇప్పటికీ ఆ నిధులు చేరలేదు. సాగుపనులకు అవసరమయ్యే ఆధునిక యంత్రాలను కొని రైతులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని కేంద్రం సూచించింది. నిధులు లేకపోవడంతో అద్దె యంత్రాలు ఎక్కడా అందుబాటులోకి రావడం లేదు. ఇలా అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ కేంద్ర సర్కారు ఉత్తుత్తి మాటలుచెతున్నదని వ్యవసాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.