Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పని గంటల్లేవ్‌.. కిలోమీటర్లే లెక్క | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2022

పని గంటల్లేవ్‌.. కిలోమీటర్లే లెక్క

- ఆర్టీసీలో కొత్త నిబంధనలు
- లాంగ్‌రూట్లలో ఇద్దరు డ్రైవర్లకు ఇదే గీటురాయి
- బస్సుల్లోనే నిద్ర.. టిక్కెట్ల బాధ్యత కూడా
- ఈ రూట్లకూ లింక్‌ సర్వీసులు
- లబోదిబోమంటున్న కార్మికులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
          ఆర్టీసీ నిజామాబాద్‌ రీజియన్‌లో కొత్త నిబంధనలు కార్మికులకు ఊపిరిసలపనీయడం లేదు. చట్టం ప్రకారం పని గంటలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. కిలోమీటర్లను బట్టి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కారా లేదా అన్నది కాకుండా టార్గెట్‌ ఇచ్చిన ప్రకారం కిలోమీటర్లు వెళ్లారా లేదా అన్నదే ఇప్పుడు పనికి గీటురాయిగా మారింది. ఇక డబుల్‌ డ్యూటీ(డీడీ) చేస్తే అత్తెసరు చేతిలో పెట్టి సరిపెట్టుకోమంటున్నారు. ఇదేంటి అంటే టార్గెట్‌ చేసి రాచిరంపాన పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఇదే ట్రెండ్‌గా మారింది. నవతెలంగాణలో సోమవారం ప్రచురితమైన 'శ్రమదోపిడీకి ప్రయోగశాల'పై నిజామాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సుధాపరిమిళ స్పందించారు. నిజామాబాద్‌ డిపో-2తో పాటు ఏ డిపోలోనూ కార్మికులు వారానికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడం లేదని తెలిపారు. ఆర్టీసీలో పని గంటలు అటకెక్కాయి. ఇప్పటికే స్పెషల్‌ ఆఫ్‌లు, ఓటీలు ఎత్తేసిన వైనాన్ని 'నవతెలంగాణ' వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా పని గంటల బదులుగా కిలోమీటర్ల టార్గెట్‌ విధిస్తున్నారు. ఒక బస్సుపై ఎంత మంది కార్మికులు ఉంటే అన్ని కిలోమీటర్లు లెక్కగట్టి పనిచేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అటు టిక్కెట్లు ఇవ్వడం, ఇటు బస్సు నడపడం రెండు పనులు చేయిస్తూ డ్రైవర్లను రెస్ట్‌లెస్‌గా మారుస్తున్నారు. ఒకప్పుడు నాలుగు రోజుల మస్టర్‌ ఉన్న డ్యూటీ ప్రస్తుతం రెండు రోజులకు మార్చారు. అదనంగా 200-240 కిలోమీటర్లు పెంచారు. ఒక్కో బస్సుకు కండక్టర్‌ స్థానంలో ఇద్దరు డ్రైవర్లను పంపుతూ 900-1000 కిలోమీటర్ల లక్ష్యం విధిస్తున్నారు.
          ఉదాహరణకుకు కామారెడ్డి డిపోలోని భద్రాచలం సర్వీసుకు మొదట కండక్టర్‌, డ్రైవర్‌ను ఇచ్చి నాలుగు రోజుల హాజరు ఇచ్చేవారు. (776 కిలోమీటర్లు) ఆ తరువాత మూడు రోజులకు తగ్గించారు. ప్రస్తుతం దాన్ని రెండు రోజులకు తగ్గించారు. ప్రస్తుతం భద్రాచలం సర్వీసుకు ఇద్దరు టీమ్‌ డ్రైవర్లను ఇచ్చి ఒక జేబీఎస్‌ లేదా రెండు నిజామాబాద్‌ ట్రిప్పులు అదనంగా జత చేశారు. దాదాపు 30 గంటలు పని చేయించి కేవలం రెండు రోజుల హాజరు ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి భద్రాచలం సర్వీసు టైమింగ్‌
కామారెడ్డి 5.00/30 నిజామాబాద్‌ 6.40/7.00
కామారెడ్డి 8.10/30 భద్రాచలం 21.00/22.00
రెండో రోజు భద్రాచలం నుంచి
కామారెడ్డి 8.40/9.00 నిజామాబాద్‌ 10.10/20
కామారెడ్డి 11.30(ఇన్‌కమింగ్‌)
          ఈ విధంగా సుమారు 1016 కిలోమీటర్లు ఇద్దరు డ్రైవర్లకు రెండు రోజుల పాటు ఒక్కో డ్రైవర్‌తో 2 రోజుల హాజరు ఇస్తూ నష్టం చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇదే విధంగా వింజమూరు సర్వీసులో సైతం 1400 కిలోమీటర్లు తిప్పుతూ కార్మికులతో 39.30 గంటలు పని చేయిస్తూ మూడు రోజుల హాజరు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. ఇలానే నిజామాబాద్‌, ఆర్మూర్‌ డిపోల నుంచి గుంటూరు, విజయవాడ, భద్రాచలం సర్వీసులకు రెండు రోజుల హాజరు ఇస్తున్నారని, ఇక బోధన్‌ నుంచి మదనపల్లి, తెనాలి 1400 కిలోమీటర్లు తిప్పి కేవలం మూడు రోజుల హజరు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
          ప్రయాణికులకు టికెట్‌ ఇవ్వడం, చిల్లర ఇవ్వడం పది నిమిషాలు దాటితే దాన్ని డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధనను అడ్డుపెట్టుకుని కార్మికుడు స్టీరింగ్‌పై ఉన్న గంటలను పని గంటలను లెక్కించి తప్పుడు లెక్కలు వేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. సరాసరి ఒక కార్మికుడు లాంగ్‌ సర్వీస్‌కు సైతం 200-250 కిలోమీటర్లు ఒక మస్టర్‌గా లెక్కిస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు డ్రైవర్లను లెక్కిస్తూ రెస్టు లేకుండా కిలోమీటర్ల టార్గెట్‌ ఇచ్చి చివరి పాయింట్లలో ఎలాంటి రెస్టు ఇవ్వకుండా నిద్రించడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులోనే ఒక డ్రైవర్‌ టిక్కెట్లు ఇవ్వాలి, మరో డ్రైవర్‌ పడుకోవాలి, రెస్ట్‌ తీసుకోవాలి అని ఆదేశాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
వారంలో 48 గంటలు కూడా పని చేయట్లే
          మోటారు వాహన చట్టం ప్రకారం ఒక్కో ఉద్యోగి రోజుకు 8 గంటల చొప్పున వారానికి 48 గంటలు పని చేయాలి. నిజామాబాద్‌ డిపో-2లో నిర్మల్‌, హైదరాబాద్‌, భైంసా డ్యూటీలకు వరంగల్‌, భైంసా లింక్‌ చేస్తూ వారం రోజులలో 4 రోజులు పని చేసేలా 48 గంటలు కన్నా తక్కువ పని గంటలు వచ్చే విధంగా డ్యూటీలు రూపొందించాం. డ్యూటీ చార్ట్‌ ప్రకారం ఒక్కో ఉద్యోగికి ఒక వారంలో అత్యధికంగా 43.30 గంటలు అత్యల్పంగా 33.35 గంటలు ఉన్నవి.
- ఆర్‌ఎం. సుధాపరిమిళ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.