Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆరేండ్లుగా అదే మాట | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2022

ఆరేండ్లుగా అదే మాట

- 'ప్రాణహిత-చేవెళ్ల'ను మార్చి వార్దా ప్రకటన
- వార్దా బ్యారేజీ నిర్మాణంపైనా సందేహాలే..
- సర్వేలతో సరి.. డీపీఆర్‌ కాలే..
- లైడార్‌ సర్వే చేపట్టి ఆరేండ్లైనా అతీగతి లేదు
నవతెలంగాణ - కాగజ్‌నగర్‌
ఒకటి కాదు రెండు కాదు, ఆరేండ్ల నుంచి ఒకటే మాట. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపకల్పన జరిగిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు 56 వేల ఎకరాలకు మాత్రమే నీరందేది. మా ప్రభుత్వం దీన్ని రీ డిజైన్‌ చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం'. ఈ మాటను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016 నుంచి చెప్పుకుంటూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణంపై ఒక్క అడుగు ముందుకు పడకపోగా, దీన్ని ప్రాణహిత నదిపై నుంచి వార్దా నదిపైకి మారుస్తున్నట్టు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ప్రాజెక్టు డీపీఆర్‌ దశను వీడలేదు. ఇప్పుడు మళ్లీ అధికారులు హడావుడి చేస్తుండటం చర్యనీయాంశమైంది.నెల రోజుల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ డీపీఆర్‌ త్వరగా తయారు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల ఒకటో తేదీన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించి వెళ్లారు. అయినా ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఈ ప్రాంత రైతాంగం మాత్రం పూర్తి విశ్వాసంతో లేదు. దీనికి ప్రధాన కారణం.. 2016లో ఇదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించడమే కాకుండా లైడార్‌ సర్వే కూడా చేపట్టింది. 2016, అక్టోబర్‌లో వాప్కోస్‌, జీఎంఆర్‌ జియోనో సంస్థలు సంయుక్తంగా లైడార్‌ సర్వే చేపట్టాయి. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 56వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందే విధంగా డీపీఆర్‌ తయారు చేశారని, తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఎకరాలకు నీరందే విధంగా డీపీఆర్‌ తయారు చేసేందుకు లైడార్‌ సర్వే చేపడుతున్నట్టు నీటిపారుదల శాఖ ఈఈ రాంచంద్రం అప్పట్లో ప్రకటించారు. సర్వే తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునేవారే కరువయ్యారు.
2018లో మళ్లీ తెరపైకి ప్రాజెక్టు
   2016లో లైడార్‌ సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చింది. ప్రాణహితపై కాకుండా ఎగువన ఉన్న వార్దా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ప్రకటించింది. కౌటాల మండలం గుండాయిపేట్‌ సమీపంలోని వార్దా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించింది. ప్రాణహిత ప్రాజెక్టు కంటే వార్దా ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతాంగానికి లాభం జరుగుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు అప్పట్లో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. 2018, డిసెంబర్‌లో ఎన్నికలు ముగిశాక మళ్లీ షరా మామూలే.
నాలుగేండ్ల తర్వాత..
   ఈ నాలుగేండ్లలో ఒక్కసారి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేయలేదు. నెల రోజులుగా ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రతి 12 ఏండ్లకోసారి జరిగే ప్రాణహిత పుష్కరాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉండటమే ఇందుకు కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రాణహిత ప్రాజెక్టును ఇక్కడి నుంచి తరలించడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్ర అసందృప్తితో ఉంది. మరో వైపు ప్రతిపక్షాలు పుష్కరాల సమయంలోనే ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీన్ని నుంచి బయటపడేందుకే రాష్ట్ర ప్రభుత్వం వార్దా బ్యారేజీ నిర్మాణం పేరిట మరో కొత్త నాటకానికి తెర తీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
'ప్రాణహిత'ను పక్కన పెట్టడంలో ఆంతర్యం ఏమిటో?
    మహారాష్ట్ర నుంచి ప్రవహించే వార్దా నది, వైన్‌గంగల కలయికే ప్రాణహిత. ఇది కౌటాల మండలం తుమ్డిహేటి వద్ద ప్రాణహితగా ఆవిర్భవిస్తుంది. తుమ్డిహేటి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి నాటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం (2008, డిసెంబర్‌ 16) శంకుస్థాపన చేసింది. ఇపుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీన్ని ప్రాణహితకు ఎగువన ఉన్న వార్దా నదిపైకి తరలించింది. వార్దానది, వైన్‌గంగ కలిసి ప్రవహించే ప్రాణహితలో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నీటి కరువు అధికంగా ఉన్న సమయంలోనే ప్రాణహితలో నీటి సామర్థ్యం 1500 టీఎంసీలకు పైగా ఉంటుంది. ఇతర సమయాల్లో ప్రాణహితలో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీటి ప్రవాహం ఉంటుంది. ఇప్పటికే ప్రాణహిత ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపట్టి సుమారు రూ. 2వేల కోట్ల వరకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాణహితపై 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఉంది. ఎలాంటి ఎత్తిపోతలూ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా సుందిళ్ల వరకు సాగునీరందించే అవకాశం ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం వార్దా బ్యారేజీ నిర్మాణం ద్వారా సిర్పూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ఒక్క మండలం, బెల్లంపల్లి నియోజకవర్గలోని ఐదు మండలాలకు సాగు నీరందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అతి తక్కువ నీటి ప్రవాహం ఉన్న వార్దా నదిపై నిర్మించే బ్యారేజీ ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా అందుతుందనే సందేహాలు నెలకొన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.