Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్పొరేట్‌ టీచర్ల బతుకులు ఆగం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2022

కార్పొరేట్‌ టీచర్ల బతుకులు ఆగం

- రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు
- డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ ఉపాధ్యాయుల ఆవేదన
- రెండేండ్ల నుంచి విధుల్లోకి తీసుకోని వైనం
- న్యాయం చేయాలంటూ ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉన్నది. పైకి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారంటూ సమాజంలో పేరుంటుంది. కానీ చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి వారిది. ప్రస్తుతం పనిచేస్తున్న వారి పరిస్థితే ఇలా ఉంటే వాటిలో పనిచేసి ఇప్పుడు విధుల్లోకి తీసుకోని ఉపాధ్యాయుల దుస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మానసికంగా, ఆర్థికంగా వారు ఎంత దయనీయ పరిస్థితిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ టీచర్లుగా పనిచేసిన వారిని రెండేండ్లుగా విధుల్లోకి తీసుకోవడం లేదు. 20 ఏండ్ల నుంచి వాటిలో పనిచేస్తున్నా కనీసం కనికరం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సాకుతో వారి జీవితాలతో ఆయా యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. దీంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఉపాధి లేక, జీతాల్లేక వారి బతుకులు ఛిద్రమయ్యాయి. కుటుంబాలను పోషించుకోవడానికి టీచర్లు అప్పులపాలయ్యారు. మానవతా దృక్పథంతో ఆలోచించి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలను వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఎప్పుడు ఆయా యాజమాన్యాల నుంచి పిలుపు వస్తుందోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆ టీచర్లతోనే విద్యార్థులకు మానసిక ఉల్లాసం
   బడుల్లో ఆటలు, పాటలుంటేనే విద్యార్థులు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు, డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ దోహదపడతాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలంటేనే బట్టీ చదువులకు నిలయాలని పేరుంది. అయితే డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ వంటి నేర్పించే ఉపాధ్యాయుల వల్ల అక్కడి విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇతర సబ్జెక్టులను శ్రద్ధగా వినాలన్నా, నేర్చుకోవాలన్నా, చదవాలన్నా కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉన్నా ఆయా ఉపాధ్యాయులను మాత్రం శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలు రెండేండ్లుగా విధుల్లోకి తీసుకోవడం లేదు. వారు లేకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ఉల్లాసానికి దూరమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఉద్యోగాలున్నాయా? లేదా?అన్న దానిపై సరైన సమాధానం ఇవ్వడం లేదు. అవసరమైనప్పుడు తీసుకుంటామంటూ యాజమాన్యాల నుంచి సమాధానం వస్తున్నది. దీంతో ఈ వృత్తినే నమ్ముకున్న ఆ ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగం, జీతం లేక విలవిలలాడుతున్నారు. ఇంటిఅద్దె, కుటుంబ పోషణ, విద్యార్థుల చదువులు, వైద్య ఖర్చులు వంటి వాటికోసం డబ్బుల్లేక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. కొందరు ఈ వృత్తిని వదిలేసి సొంతూర్లకు వెళ్లి వ్యవసాయ పనులు, ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారు. ఇంకొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
నెల జీతం ఉండదు...
   శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌నే నేర్పించే ఉపాధ్యాయులు వందల సంఖ్యలో పనిచేశారు. వారికి నెల జీతం ఉండదు. వారంలో వారు నేర్పించే తరగతులను బట్టి జీతం ఇస్తారు. అందులోనూ ఒకే పాఠశాల లేదా కాలేజీ వరకే పరిమితం కాకుండా రెండు, మూడు బ్రాంచీల్లో విద్యార్థులకు వాటిని నేర్పించాలి. అలా నెలకు ఎన్ని తరగతులు నేర్పిస్తారో వాటి ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం తీసుకుంటారు. ఇప్పుడు వారికి ఒక్క రూపాయి జీతం రాకపోవడంతో కుంగిపోతున్నారు. బడా కార్పొరేట్‌ కాలేజీలు తమ ప్రతాపాన్ని చిరుద్యోగులపైన చూపడం సరికాదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం, కళలు నేర్పించే ఉపాధ్యాయుల జీవితాలు, వారి కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.