Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ...ప్రజల పక్షం కాదు... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2022

మోడీ...ప్రజల పక్షం కాదు...

- అంబానీ, ఆదానీల పక్షం.....
- సబ్‌ కా సాత్‌... సబ్‌ కా వికాస్‌ ఒట్టి బోగస్‌
- ఏఐటీయూసీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎంపీ బినోరు విశ్వం
నవతెలంగాణ - హైదరాబాద్‌
ప్రధాని నరేంద్రమోడీ శ్రామికవర్గం, ప్రజలవైపు లేడనీ, ఆయన ఆదానీ, అంబానీలవైపే ఉన్నాడని రాజ్యసభలో సీపీఐ పక్ష నేత బినోరు విశ్వం ఆరోపించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు మోడీ మోకరిల్లుతున్నారని విమర్శించారు. సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అనేది ఒట్టి బోగస్‌ చెప్పారు. పార్లమెంటులో నిర్మలా సీతారమన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వల్ల దేశ ప్రజలు, కార్మికవర్గం సంతృప్తిగా లేరని స్పష్టం చేశారు. ఆల్‌ ఇండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో (గురుదాస్‌ దాస్‌గుప్తానగర్‌ (టి.నరసింహన్‌ హాల్‌)లో మూడు రోజుల పాటు జరగనున్నాయి. శనివారం సమావేశాలను ప్రారంభించిన బినోరు విశ్వం ప్రసంగించారు. దళితులు, మహిళలు, యువకులు, సామాన్యులు, కార్మికులు, రైతులు మోడీ పాలనలో సంతృప్తిగా లేరని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన మోడీ ఆదానీ, అంబానీల పక్షాన నిలబడి వారికి మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం మద్దతు ధర చట్టం చేయాలని పదే పదే డిమాండ్‌ చేస్తున్నా చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌ సరళిని చూసి చట్టం తెస్తారా? అని ప్రశ్నించారు. కనీసం మద్దతు ధర చట్టం సాధించే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. రైతులు సాగించిన మహత్తర పోరాటం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చట్టాలను వెనక్కి తీసుకున్నదని అన్నారు. అనేక పోరాటాలు సాగించిన ఏఐటీయూసీ ఎన్నో విజయాలను సాధించిందని మోడీ ప్రభుత్వంపై అదే తరహాలో పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
   ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ పేరుతో మౌలిక సదుపాయాలైన రోడ్లు, రహదారులు, ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలను అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నదని అన్నారు. జాతి సంపదను కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని చెప్పారు. ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో మార్చిలో సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని రకాల ధరలు పెరిగిపోయాయనీ, 95 శాతం మంది ప్రజలు మోడీ ప్రభుత్వంపై ఆగ్రహాంతో ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఫాసిజం, నాసిజం తరహాలో పాలన సాగుతున్నదని ఆరోపించారు. జాతీయ ఉపాధి పథకం అమలుకు గతంలో 98 వేల కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో 70 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. 100 రోజులు ఉపాధి కల్పించాల్సిందిపోయి కేవలం 50 రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు. గతంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారనీ, ఇప్పుడు రైల్వే బడ్జెట్‌ ఊసే లేదని గుర్తుచేశారు. సాధారణ బడ్జెట్‌లో 400 కొత్త రైళ్ళు నడిపిస్తామని మాత్రమే పేర్కొన్నారని గుర్తుచేశారు. ఆజాదీ కా అమృత మహౌత్సవ్‌ మోడీకి మాత్రమేననీ, అది ప్రజలకు మాత్రం విషమని అన్నారు. 2024లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా కార్మికవర్గం ప్రతిఘటన పోరాటాలకు సిద్దం కావాలని కోరారు.
   అనంతరం ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి మోహనశర్మ ఇటీవల కాలంలో అమరులైన కార్మిక నేతలకు సంతాప సూచకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి అంజలి ఘటించారు. తొలుత అమర్‌జిత్‌కౌర్‌ ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమర్‌జిత్‌కౌర్‌, బీ.వీ.విజయలక్ష్మి, బినోరు విశ్వం, ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యం.డి.యూసుఫ్‌, అధ్యక్షులు బాల్‌రాజ్‌, ప్రధాన కార్యదర్శి వీ.ఎస్‌.బోస్‌, కోశాధికారి పి.ప్రేంపావని, కార్యదర్శులు యం.నర్సింహ్మా, బి.వెంకటేశం, బి.చంద్రయ్య, సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, జాతీయ కార్యవర్గ సభ్యులు వి.రత్నాకర్‌రావు తదితరులు నివాళులర్పించారు. పల్లె నర్సింహ బృందం ఆలపించిన విప్లవ గేయాలు ఆలోచింపచేశాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.