Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గూడు చెదిరింది | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2022

గూడు చెదిరింది

- గిరిజనులు, పేదల ఇండ్లు కూల్చేసిన తహసీల్దార్‌
- కూలి పనులు చేసి కట్టుకుని రోడ్డున పడ్డాం : బాధితులు
- సీపీఐ(ఎం), గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల్లో.. పేదలు రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న గూడును అధికారులు శనివారం కూల్చేశారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు.. దీన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం), గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సిఎస్‌సి బస్తీ గ్రామ పంచాయతీ సున్నం రాజయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌ తండాలో 13 సంవత్సరాల కిందట ఇందిరమ్మ ఫేజ్‌ -2లో 70 మంది గిరిజనులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చింది. రెక్కల కష్టంతో వాళ్లు రేకుల షెడ్లు, పాకలు కట్టుకుని నివాసం ఉంటున్నారు. అకస్మాత్తుగా శనివారం ఉదయం ఏడు గంటలకే తహసీల్దార్‌ కృష్ణవేణి ఆధ్వర్యంలో
   పోలీసులు, సిబ్బంది ట్రాక్టర్‌, డోజర్‌తో వెళ్లారు. బాధితులను బయటకు రప్పించి ఇండ్లను నేలమట్టం చేశారు. కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. అన్నం గిన్నెలు, బియ్యం, బట్టలు, నీళ్లు నేలపాలయ్యాయని సూరబాక లకిë, ధనసరి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే సీపీఐ(ఎం), గిరిజన సంఘాల నేతలు సంఘటన స్థలానికి వచ్చి కూల్చివేతలను పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్లను దౌర్జన్యంగా కూల్చేయదాన్ని నిరసిస్తూ మహబూబాబాద్‌ - ఇల్లందు రోడ్డుపై బైటాయించారు. రెండు గంటలపాటు సీపీఐ(ఎం), తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్‌) ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇండ్లు కూల్చివేతపై తహసీల్దార్‌ సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. పోలీసుల ఒత్తిడి, జోక్యంతో రాస్తారోకో విరమించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ.. బాధితుల లిస్ట్‌ ఇస్తే డబుల్‌ బెడ్‌ రూంలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), కేవీపీఎస్‌, వ్యసాయ కార్మిక, టీఏజీఎస్‌ సంఘాల నేతలు దేవులపల్లి యాకయ్య, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్‌, మన్నెం మోహన్‌ రావు, రాందాస్‌, సానప రమేష్‌, సుర్నపాక లక్ష్మి పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు
   అవి ప్రభుత్వ భూములు. అక్కడ ఇండ్లు నిర్మించుకోవద్దని చెప్పాం. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఏమీ లేవు. మండలంలో అనుమతులు లేని ఫంక్షన్‌హాల్స్‌, పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నట్టు దృష్టికి రాలేదు.
- తహసీల్దార్‌ కృష్ణవేణి
ఎమ్మెల్యేప్రోద్బలంతోనే కూల్చివేతలు
   ఎమ్మెల్యే హరిప్రియ ప్రోద్బలంతోనే గిరిజనుల ఇండ్లు కూల్చేశారు. పేదలు, గిరిజనులు ఇండ్లు నిర్మిచుకొని ఉంటున్నారు. కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చేశారు. ఇందిరమ్మ పట్టాల ఆధారంగానే గిరిజనులు ఇండ్లు నిర్మించుకున్నారు. ఏజెన్సీ చట్టాలు ఉన్నా గిరిజనులకు న్యాయం జరగట్లేదు.
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్‌ నబి, టీఏజీఎస్‌ జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్‌
కూలి పనులు చేసుకుని కట్టుకున్నాం
   నాకు ఇల్లు లేకుండే.. ఇందిరమ్మ ఇంటి జాగ ఇస్తే.. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని సాగదీస్తున్నా. పైసాపైసా కూడబెట్టుకుని మట్టి పోయించి సిమెంటు స్థంభాలతో రేకులు వేయించాను. ఇప్పుడు ఉన్నదంతా పోయింది. ఎక్కడ ఉండాలి. సీఎం కేసీఆర్‌ పేదలకు చేసే న్యాయం ఇదేనా..? ఇండ్లు కూల్చొద్దని తహసీల్దార్‌ కాళ్లు మొక్కినా కనికరించలేదని ఊకె సమ్మక్క, ఈసం లక్ష్మి అన్నారు. పిల్లలు, ముసలివాళ్లతో బయట ఉన్నాం. మాకు దిక్కెవరు అంటూ రోధించారు.
- గొగ్గెల వీరమ్మ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.