Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సేద్యం భూమిలో ఇండిస్టీయల్‌ పార్క్‌ .. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2022

సేద్యం భూమిలో ఇండిస్టీయల్‌ పార్క్‌ ..

- పేదలను భయపెట్టి భూములను గుంజుకునే యత్నం
- ప్రాణం పోయినా భూమి ఇవ్వబోమంటున్న రైతులు
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనకు కార్యాచరణ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పేద రైతులకు భూమే ఆత్మగౌరవం.. దాంతో సమాజంలో గుర్తింపు దక్కుతుందని పదే పదే చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆ పేద రైతుల సేద్యపు భూములను లాక్కునేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు గోడు చెప్పుకుందామని రైతులు వెళితే ''ఆ భూముల వల్ల మీకేమి ఉపయోగం ఉంది..' అని హేళనగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆ కుటుంబాలు మొత్తం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
నాలుగు తరాలుగా సేద్యం
   యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో సుమారు 80ఏండ్ల కిందట నుంచి సర్వే నెంబర్‌ 72లోని 108.21ఎకరాల భూమి 67 మంది రైతుల పేరుతో పట్టా ఉంది. అప్పుడు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమి ఇది. సుమారు నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్నారు. రాళ్లకుప్పలుగా ఉన్న భూమిని అప్పట్లోనే వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగుకు అనుకూలం చేసుకున్నారు. బోర్లు వేసి వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. 67మంది రైతుల పేరుతో పట్టాలున్నప్పటికీ.. నేడు సుమారు 250 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కొంత భూమిలో పంటలు సాగు చేసుకుంటూ, మరి కొంత భూమిలో యాదవులకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు మేత కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం పంటరుణాలు ఇవ్వడం మొదలు పెట్టిన నాటి నుంచి నేటి వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. రైతుబంధు కూడా వస్తోంది.
ఇండిస్టీయల్‌ పార్కు పేరుతో గుంజుకునేందుకు కుట్ర
   సారవంతమైన ఆ భూములపై ప్రభుత్వ పెద్దల దృష్టి పడింది. ఇండిస్టీయల్‌ పార్కు ఏర్పాటు పేరుతో ఆ భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 14న పత్రికలో.. ఇండిస్టీయల్‌ పార్కును 72 సర్వే నెంబర్‌లోని 108.21 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్నట్టు, ఏ రైతుకు ఎంత భూమి పట్టా ఉందో వివరాలను తెలియజేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చారు. నోటిఫికేషన్‌ వచ్చే వరకు రైతులకు ఎలాంటి సమాచారమూ లేదు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే సర్వే మొదలు పెట్టడానికి వచ్చిన ఎమ్మార్వో, ఎంపీడీవో, ఇతర అధికారులను రైతులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన రైతులు
   తమ భూములు లాక్కోవద్దని జనవరి 20న స్థానిక ఎమ్మెల్యేను రైతులు కలిసి విన్నవించారు. అక్కడ ఎమ్మెల్యేకు తమ బాధలు చెపుకుంటుండగానే భూమిలో అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. ''ఎట్టి పరిస్థితుల్లో మీ భూములను ఎవరూ కాపాడలేరు. అడ్టుకుంటే పోలీసులను తీసుకొచ్చి అందరినీ లోపల వేసి సర్వే చేస్తాం'' అని రైతులను అధికారులు బెదిరించినట్టు సమాచారం. తమ భూములు కాపాడాలని బాలచారి అనే రైతు అక్కడే ఎమ్మెల్యే కాళ్లపై పడి బోరున విలిపించినట్టు తెలిసింది. ఒకవేళ భూములు పోయినా మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రజాప్రతినిధి పేర్కొనడంతో... ఇదంతా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కలిసి ఆడుతున్న నాటకమని రైతులకు అర్థమైంది.
పాసు పుస్తకాలివ్వాలని బెదిరింపులు
   ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సంగతి దేవుడెరుగు.. భూముల కోసం కనీసం రైతులతో సంప్రదించనూ లేదు. బెదిరింపులో పట్టాపాసు పుస్తకాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. రెవెన్యూ అధికారులు తమ సిబ్బందిని రైతుల ఇండ్లల్లోకి పంపించి వెంటనే భూమి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని, లేకపోతే ఒక్క రూపాయి కూడా రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మీకు ఎప్పుడో ఉచితంగా వచ్చిన భూమి.. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా వింటే మంచిది.. లేకపోతే మీకే నష్టమనే పద్ధతిలో మాట్లాడుతున్నారని తెలిసింది.
పోరాటానికి సిద్ధమవుతున్న రైతులు
   నాలుగు తరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమిని గద్దల్లా కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసే ప్రభుత్వ పెద్దలు లాక్కుంటే ఊరుకునేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం పోయినా సరే .. భూమిలిచ్చే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒక కమిటీగా ఏర్పడి పోరాటం మొదలుపెట్టారు. తహాసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలు చేశారు. శనివారం ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈనెల 9న కుటుంబాలతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు.
మా భూములు వదిలిపెట్టం
   మా తాత నుంచి సాగు చేస్తున్నం.. కేసీఆర్‌ ఇచ్చిన గొర్రెలను కూడా ఇక్కడే మోపుతున్నం. మరెక్కడా భూమి లేదు.. భూమి తీసుకుంటే మేమేం తినాలే.. గొర్రెలేం తింటయి.. ఎవరొచ్చినా అడ్డుకుని తీరుతాం. ప్రాణం పోయినా భూమి వదలం.
రైతు గోపాల్‌ యాదవ్‌- తుర్కపల్లి
ప్రభుత్వ భూములు వేల ఎకరాలున్నాయి
   ఆలేరు నియోజకవర్గంలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి.. వాటిని పెద్దోళ్లు కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు.. అందులో ఇండిస్టీయల్‌ పార్కు ఏర్పాటు చేయొచ్చు కదా.. మా భూములపై ఎందుకు కన్ను వేశారు. కావాలనే కుట్రతోనే మా భూములపై పడుతున్నరు.
- రైతు షరీఫ్‌
భూములు గుంజుకునే ఆలోచనను విరమించుకోవాలి
   పేదల భూములను గుంజుకునే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలి. వ్యవసాయ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడి సమస్యలొస్తాయి. ఈ రైతులకు వ్యవసాయం తప్ప మరొక్కటి లేదు. జీవనాధారం ఇదే. ప్రభుత్వం ఈ భూముల జోలికి వస్తే మల్లన్న సాగర్‌ తరహా ఉద్యమాన్ని నిర్మిస్తాం.
కల్లూరి మల్లేశం- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు- యాదాద్రి జిల్లా

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.