Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొలిక్కిరాని జలవివాదాల పరిష్కారం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2022

కొలిక్కిరాని జలవివాదాల పరిష్కారం

- గెజిట్‌ విడుదలకే కేంద్రం పరిమితం
- ఆరు నెలలుగా తాత్సారం
- జాడలేని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
- వేగంగా సాగని వ్యవహారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇంకా కొలిక్కిరాలేదు. వీటికి సంబధించి కేంద్రంలోని బీజేపీ సర్కారు గెజిట్‌ విడుదల చేసి మిన్నకుండిపోయింది. వేగంగా సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి ఉన్నట్టు కనిపించడం లేదు. రకరకాల నిబంధనల పేరుతో తాత్సారం చేస్తున్నది. ఆరు నెలల దాటినా ఈ అంశంలో ఆశించిన వేగం లేదు. ప్రగతి అంతకన్నా లేదు. దీంతో సాగునీటి సమస్యల పరిష్కారం తీవ్ర ఆలస్యమవుతున్నది. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల నిర్వహణ లేకపోవడంతో వివాదాలు దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉన్నాయి. జాప్యం మూలంగా సమస్యల పరిష్కారం మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. 2014లో యూపీఏ తెచ్చిన పునర్విభజన చట్టాన్ని అమలుచేయడం లేదు. దీంతో వివాదాలు ఎటూ తేలడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని సాగునీటి పథకాలు, వాటి అనుబంధ కాంపొనెంట్లకు సంబంధించి జులై 15న కేంద్ర జలశక్తి శాఖ జారిచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రెండు రాష్ట్రాల్లోనూ వివాదాస్పదమైంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) పరిధిలోకి రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు తీసుకురావాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే ఆ గెజిట్‌పై రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నాయి. గెజిట్‌ను అమలుచేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, కేంద్రం మాత్రం గెజిట్‌ను అమలుచేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతున్నది. అంతేగాక మరిన్ని షరతులు పెట్టింది. వాటిపైనా తెలుగు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. సమన్యను పరిష్కరించమంటే నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో కేంద్రం కొత్త సమస్యలను సృష్టిస్తున్నదనే విమర్శలు అంటున్నాయి. ఇప్పటికే రెండు బోర్డులు ఇరురాష్ట్రాల్లో పర్యటించాయి. ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించాయి. సబ్‌కమిటీలతోనూ భేటి అయ్యాయి. సమాచారం తీసుకున్నాయి. బోర్డుల పరిధిలో సమస్య కొలిక్కివచ్చే అవకాశం కనిపించకపోవడంతో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి తప్పనిసరని తెలంగాణ సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జీఆర్‌ఎంబీ పరిధిలో ఎలాంటి వివాదాలు లేకున్నా ప్రాజెక్టులు అప్పగించాలనడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే ఆక్షేపించింది. అయినా కేంద్రం ససేమిరా అనడంతో ఆ బోర్డు పరిధిలోని ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధమైంది. అలాగే కేఆర్‌ఎంబీ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు అభ్యంతరం లేదని చెబుతున్నది. కాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చిన ఐదు నెలల తర్వాత డిసెంబరు 28న రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల భేటి ఆన్‌లైన్‌లో జరిగింది. అయినా సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తాము కేంద్రం అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తున్నామని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు చెబుతుండగా, అడిగిన సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వాల నుంచి సహకారం ఉండటం లేదని కేంద్రం చెబుతున్నది. అలాగే ఆయా ప్రాజెక్టుల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేయడం, రెండు బోర్డులకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌ మనీ డిపాజిట్‌ చేయడం, గెజిట్‌ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలనడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను సమర్పించాలంటూ చెబుతున్నది. డీపీఆర్‌లను రాష్ట్రాలు సమర్పించాయి. అసలే గత మూడేండ్ల ముందు నుంచే ఆర్థిక సంక్షోభం ఉండటంతో బోర్డులకు రూ. 200 కోట్ల చొప్పున కేటాయించడం కుదరదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుతం ఉంది. గెజిట్‌ అమలుతోపాటు వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్రాల జలవనరులు, సాగునీటి శాఖల ఉన్నతాధికారులు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈమేరకు ఇరు రాష్ట్రాలను సమన్వయం చేసి అపెక్స్‌ కౌన్సిల్‌ను నిర్వహించడంలో కేంద్రం విఫలమవుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.