Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మందు గోలీలు ఇస్తలే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2022

మందు గోలీలు ఇస్తలే..

- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఇబ్బందులు
- ప్రయివేటు వైద్యానికి వెళ్లలేక అవస్తలు
- 104 వైద్యసేవల స్వస్తికి ప్రభుత్వం యత్నం..?
- ఆందోళనలో రోగులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మందు గోలీలు అందక వ్యాధి తీవ్రతతో సతమతమవుతున్నారు. ప్రయివేటుగా మందులు కొనుగోలు చేసే స్తోమతలేని రోగులు మంచాన పడుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెల రోగులకు మందులు అందించే 104 వైద్యసేవలు కరోనా పేరుతో నిలిపి వేయడంతో రోగులు అల్లాడిపోతున్నారు. మందు గోలీల కోసం కిలో మీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమయానికి అక్కడ సైతం మందులు లేకపోతే.. ఉసూరుమంటూ వెనుదిరుగాల్సి వస్తోందని రోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే 104 వైద్య సేవలను పునరుద్ధరించి మా ప్రాణాలు కాపాడాలని రోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 104 వైద్యసేవలు 14 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం సేవలు అందిస్తోంది. ఒక్కో వాహనంలో ల్యాబ్‌ టెక్నిషియన్‌, పార్మసిస్టు, నర్సులు, ఆ గ్రామ ఆశావర్కర్లు ఉంటారు. వీరు ప్రతి నెలా ఆయా గ్రామాలకు వెళ్లి రక్తపోటు, మధుమేహం, మూర్ఛ, అస్తమా, చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేసేవారు. షుగర్‌, బీపీ, రక్త పరీక్షలు నిర్వహించేవారు. 104 సేవలు పొందేవారు.. ఒక్కో గ్రామంలో సుమారు 30 నుంచి 50 మంది వరకు ఉంటారు. వీరంతా ప్రయివేటులో మందులు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేనివారు. ఉదాహరణకు నందిగామ మండలం పిట్టలవాడి గూడెంలో ప్రభుత్వం ఇచ్చే మందు గోలీలు మింగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నవారు సుమారు 25 మంది, జనరల్‌ వైద్యం పొందేవారు 30 మంది ఉన్నారు. వీరంతా ప్రతి నెలా తమ గ్రామానికి వచ్చే 104 వాహనం వద్ద ఇచ్చే మందులు వాడేవారు. ప్రస్తుతం కోవిడ్‌-19 నెపంతో రెండేండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 104 సేవలు నిలిపివేయడంతో రోగులు వైద్యసేవలకు దూరమయ్యారు.
'104'కు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం..?
   ఏఎన్‌ఎంలతో ఇంటింటికీ తిరిగి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల సర్వే చేసి.. వారికి వైద్యసేవలు అందించేందుకు ఇటీవల ఎన్‌సీడీ కార్యక్రమం తీసుకువచ్చారు. దాంతో ప్రభుత్వం మొత్తానికే 104 వైద్యసేవలు అవసరం లేదన్న ధోరణిలో ఉన్నట్టు వైద్యశాఖలో చర్చ నెలకొంది. రెండేండ్లుగా ఇప్పటికే మందు గోలీల కోసం నానా తిప్పలు పడ్డ రోగులు.. 104 సేవలు బంద్‌ పెడితే మా ఆరోగ్యాన్ని కాపాడే దిక్కేలేకుండా పోతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏండ్ల నుంచి కొనసాగుతున్న 104 వైద్యసేవలు యధావిధిగా కొనసాగించాలని రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.
ప్రాణం పోయేట్టు ఉంది
   సర్కారు మందు గోలీలు ఇచ్చే సరికి ప్రాణం పోయేట్టుంది. ఏడాదిగా మందులు సకాలంలో ఇవ్వడం లేదు. ఒక నెల దొరికితే మరో నెల దొరకడం లేవు. కరోనాకు ముందు గ్రామ పంచాయతీ దగ్గర ఇచ్చేవారు. ఇప్పుడు ఆశావర్కర్‌ ఇంటికి పోయి తెచ్చుకోవాల్సి వస్తోంది. చేతనై.. చేతగాక కర్ర సాయంతో వెళ్లినా ఆమె దగ్గర మందులు ఎప్పుడూ ఉండవు. ఆ మందులు వచ్చేసరికి.. నేను కాటికి పోయేట్టు ఉన్నా. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలే..
-దాసరి లక్షమ్మ, రోగి కోడిచర్ల గ్రామం
రోగం పెరిగిపోతుంది
   పదేండ్లుగా షుగర్‌ వ్యాధితో బాధ పడుతున్నా.. ప్రయివేటులో మందులు కొనలేక సర్కారు ఇచ్చే మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న. కరోనా వచ్చిన నుంచి ఊరిలోకి 104 బండి వస్తలేదు.. మందులిస్తలేరు. ఆశావర్కర్‌ను అడిగితే ఎప్పుడో ఒకసారి రెండు, మూడు గోలీలు ఇస్తోంది. సర్కారు ఆస్పత్రికి పోయినా.. అక్కడా మందులు దొరకడం లేవు.. రోజు రోజుకు షుగర్‌ పెరుగుతుంది. ప్రయివేటులో మందులు కొద్దామంటే చేతిలో డబ్బులు లేవు. సర్కారు మందు గోలీలు ఇచ్చి మా ప్రాణాలు కాపాడాలి.
- ఎలుక వెంకటమ్మ , షుగర్‌ రోగి, పెంజర్ల గ్రామం, కొత్తూరు మండలం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.