Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకుల సంజరు రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి 311 మంది డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లను వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజరు రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్మాసిస్టులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనాను కోరారు. సీఎం కలగంటున్న ఆరోగ్య తెలంగాణ దిశగా పయనించాలని సూచించారు.