Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విశ్వాసం నింపాల్సిన చోట..విద్వేషపు మాటలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 10,2022

విశ్వాసం నింపాల్సిన చోట..విద్వేషపు మాటలు

- తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి
- అభివృద్ధిలో గుజరాత్‌ కంటే తెలంగాణ ముందంజ
- ఏడేండ్లలో కేంద్రం పైసా కేటాయించలేదు
- మోడీ తెచ్చిన నల్ల చట్టాలు తప్పని రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది
- ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ సభలో మంత్రి కేటీఆర్‌ విమర్శలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దేవాలయంలాంటి పార్లమెంట్‌లో మోడీ అబద్దాలాడుతున్నాడనీ, విశ్వాసం నింపాల్సిన చోట.. విద్వేషపు మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్న ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అభివృద్ధిలో గుజరాత్‌ కంటే తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ఏడేండ్లలో తెలంగాణకు కేంద్రం పైసా కేటాయించలేదని విమర్శించారు. దేశంలో అంబేద్కర్‌ రాజ్యాంగం నడవడం లేదని, మోడీ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.221 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కొంతమందికి కడుపు మండుతోందని, గుజరాత్‌ కంటే ముందుకు దూసుకెళ్తుందన్న బాధతో ప్రధాని పార్లమెంట్లో రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ప్రజాస్వామ్య దేవాలయంలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. తల్లిని చంపి బిడ్డనిచ్చారన్నారనీ, అవి మాట్లాడాల్సిన మాటలేనా.. ఇప్పుడెందుకు అలా అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇంత అన్యాయంగా, ఆ సందర్భంగా, ఇష్టారీతిన మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, అమరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాన్ని కించపరిచినట్టు కాదా అని ప్రశ్నించారు. ఈ ఎనిమిదేండ్లలో పారిశ్రామిక రాయితీలు, రాష్ట్రానికి కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కూడా ఇవ్వలేదన్నారు. ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్కుకి అరపైసా సాయం చేయలేదని ఆరోపించారు. మెడికల్‌ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐటీఐఆర్‌ సంస్థలు ఒక్కటీ కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. 50 ఏండ్ల్ల తెలంగాణ పోరాటాన్ని, వందలాది మంది త్యాగాలను అవమానించినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని అన్ని సంస్థలను మోదీ గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు తపుపడుతున్నారన్నారని, దేశంలో అంబేద్కర్‌ రాజ్యాంగం లేదని.. మోదీ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బెంగాల్‌ ప్రభుత్వం గవర్నర్‌ను బ్లాక్‌ చేసినా ఎందుకు సమన్వయం చేయడంలేదని ప్రశ్నించారు. కర్నాటకలో మత విద్వేశాలు రెచ్చగొడుతూ బేటీ బచావో.. బేటీ పడావో మాటలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. మోడీ తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు చేసిన పోరాటానికి తలొగ్గి.. చివరకు చట్టాలు రద్దుచేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో మంత్రి పి.సబితారెడ్డి, జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ సాయిచంద్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మెన్‌ వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీపీ కృపేష్‌, రైతుబంధు జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ చైర్మెన్‌ మనోహర్‌రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.