Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓడీఎఫ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందడుగు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 11,2022

ఓడీఎఫ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందడుగు

- ప్లాస్టిక్‌ వాడక రహిత జిల్లాగా మార్చేందుకు అడుగులు
- ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- జిల్లా మొత్తాన్ని ఓడీఎఫ్‌ ప్లస్‌గా మార్చేందుకు యత్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాలుష్య సమస్య నుంచి ప్రజలను రక్షించి, ప్రజలకు ఆరోగ్యమైన జీవన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. కాలుష్య రహిత కార్యక్రమాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నది. గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మొదటి దశలో 88,416 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం దేశస్థాయిలో గుర్తింపు పొందింది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రతికొత్తింట్లోనూ మరుగుదొడ్డి సౌకర్యం ఉండేలా చూస్తున్నది.
ఘన, పొడి వ్యర్థాల నిర్వహణ..
   ఘన వ్యర్థాల నిర్వహణ కోసం 22 మండలాల్లోని 479 గ్రామ పంచాయతీలు షెడ్లు నిర్మించాయి. వ్యర్థాలను సేకరించేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేశాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ కంపోస్టింగ్‌ జరుగుతున్నది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో అయిదంచెల వ్యవస్థ అమలవుతున్నది. పొడి వ్యర్థాలను సురక్షితంగా తొలగించేందుకు గ్రామ పంచాయతీలు స్థానిక స్క్రాప్‌ డీలర్లతో కలిసి పనిచేస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ సేవలను అందిస్తున్న సంస్థలతో జిల్లా యంత్రాంగం అవగాహన కుదుర్చుకుంది. ఐటీసీ ఇప్పటికే స్థానిక పట్టణ ప్రాంతాల సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, పాల్వంచలలో 4 డ్రై రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాల శుద్ధి జరుగుతున్నది. తమ సమీపంలో ఉన్న డ్రై రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్లకు తమ వ్యర్థాలను తరలించాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వాష్‌-ఐ సంస్థ సహకారంతో వ్యర్థాల ప్రామాణీకరణ, వర్గీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. స్థానిక పట్టణ సంస్థల సహకారంతో అవసరమైన ప్రాంతాల్లో డీఆర్‌సీసీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొడి వ్యర్థాలను విభజించి వాటిని తరలించే ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నది. సమస్యలను అధిగమించేందుకు జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలో అధికారులకు, సిబ్బందికి సామర్థ్య-నిర్మాణ సదస్సులను వాష్‌-ఐ సంస్థ నిర్వహించింది. ప్రస్తుతం 168 గ్రామ పంచాయతీలలో వ్యర్థాలను అవి వెలువడుతున్న ప్రాంతాల్లోనే విభజిస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇది 70 శాతం వరకు అమలవుతున్నది. అన్ని పంచాయతీల్లోనూ 100 శాతం వ్యర్థాల విభజన జరిగేలా వారానికోసారి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అడుగులు...
   ప్లాస్టిక్‌ వాడక రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగాన్ని నిషేధిస్తూ 5 సెప్టెంబర్‌ 2019న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుడ్డతో చేసిన సంచులను ప్రత్యామ్నాయంగా జిల్లా యంత్రాంగం అమల్లోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్లాస్టిక్‌ వినియోగానికి వ్యతిరేకంగా కారక్రమాలు చేపడుతున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడానికి స్వయం సహాయక బృందాల సభ్యుల సహకారాన్ని అధికారులు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్‌ సంచులను సేకరించడానికి, వేరు చేయడానికి, పార వేసేందుకు ప్రజల సహకారం పొందేందుకు ప్రయత్నించి విజయం సాధించారు.
ద్రవ వ్యర్థాల నిర్వహణ:
   ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశానికి గ్రామ పంచాయతీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద రంగు మారిన నీటిని కమ్యూనిటీ సోక్‌ పిట్‌లకు తరలిస్తున్నారు. అక్కడ వ్యర్థ జలాలను సమర్థవంతంగా శుద్ధి చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల రీఛార్జ్‌ జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి మండలంలోనూ కనీసం ఆరు గ్రామ పంచాయతీలు ఎల్‌డబ్ల్యూఎం కార్యకలాపాలతో పనిచేసే మిషన్‌ మోడల్‌లో సోక్‌ పిట్‌లు, వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఇప్పటి వరకు 3279 వ్యక్తిగత మరుగుదొడ్లు , 1,331 సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు.
ఓడిఎఫ్‌ ప్లస్‌ విజయాలు
   ఇప్పటివరకు జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్‌-ప్లస్‌ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. అన్ని గృహాలు, సంస్థలకు మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించడం, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను కల్పించి వాటిని సక్రమంగా నిర్వహించడం లాంటి అంశాలకు దీనిలో ప్రాధాన్యత కల్పిస్తారు. ఓడీఎఫ్‌-ప్లస్‌ కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించే అంశంలో ఐఈసి కార్యక్రమాల నిర్వహణ, ప్రముఖ ప్రాంతాలలో సందేశాలను ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. 100 శాతం ద్రవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు సౌకర్యాలను కల్పించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఓడీఎఫ్‌ ప్లస్‌ గుర్తింపు పొందాలని అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం గ్రామ పంచాయతీలు మాత్రమే కాకుండా మొత్తం జిల్లా ఓడిఎఫ్‌ ప్లస్‌ గుర్తింపు పొందేలా చూసేందుకు మల వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. దీనిలో భాగంగా నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నాలుగు శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇవి సెప్టిక్‌ ట్యాంక్‌లతో కూడిన గ్రామీణ హెచ్‌హెచ్‌ల అవసరాలను తీరుస్తూ మల వ్యర్థాలను సురక్షితంగా తొలగిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.