Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కబ్జా కోరల్లో సర్కారు భూములు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 12,2022

కబ్జా కోరల్లో సర్కారు భూములు

- కోట్ల విలువ గల భూముల్లో అక్రమ కట్టడాలు
- ఎఫ్‌టీఎల్‌లో ఓ ఫుడ్‌ కంపెనీ నిర్మాణాలు
- సర్వీస్‌ రోడ్డును ఆక్రమించిన కొత్తురు లాజిస్టిక్‌ పార్క్‌ నిర్వాహకులు
- పాటు కాలువల కబ్జాతో ఎండుతున్న చెరువులు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ప్రజా సంఘాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా పెడుతున్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకుంటున్నారు. చివరికి చెరువులను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. ఆనవాలు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువు శికం, పాటు కాల్వలు, సర్వీస్‌ రోడ్లను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కోట్ల విలువైన భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి.
   భూముల ధరలకు రెక్కలు రావడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ అక్రమార్కులు పాగా వేస్తున్నారు. కబ్జా చేసే వారంతా రాజకీయ నాయకుల అండదండలు ఉన్న బడా పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే కావడంతో అధికారుల సైతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల పరిధిలో రవి ఫుడ్‌ కంపెనీ ఏకంగా ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టినట్టు సమాచారం. బొద్దికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 15 ఎకరాలు ఉందని అధికారులు గుర్తించారు. కానీ ప్రస్తుతం అక్కడ 5 ఎకరాలు కూడా లేదు. చెరువు శికం 9.20 ఎకరాలు ఉండగా, మరో 5 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌గా గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌లో పట్టా భూములు ఉన్నప్పటికీ వ్యవసాయానికి తప్ప ఎలాంటి నిర్మాణాలూ చేపట్టడానికి అవకాశం లేదు. కానీ నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టారు. పట్టా ఉన్న ఎఫ్‌టీఎల్‌తోపాటు మరో రెండు మూడెకరాల చెరువు శికం భూములను ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇటీవల ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేపట్టి.. దాదాపు రెండున్నర ఎకరాలు కబ్జాకు గురైనట్టు అంచనా వేశారు. ఈ భూమి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ ప్రకారం సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇదే కంపెనీ యాజమాన్యం కాశన్న చెరువుల నుంచి బొద్దికుంట చెరువులకు వచ్చే 6 మీటర్ల విస్తీర్ణంతో కూడిన కిలో మీటరు మేరకు ఉన్న పాటు కాలువను కబ్జా పెట్టిందని తెలిసింది. దీంతో బొద్దికుంట చెరువుకు వెళ్లాల్సిన వరద నీరు వెళ్లడం లేదు. ఆ చెరువు కింది ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. ఇలాంటి విషయాలు మా వద్దకు రావడం లేదని, పైపైనే జరుగుతున్నాయని కొంతమంది అధికారులు వాపోతున్నారు. నిబంధనలు ఉన్నా.. మాకు తెలియకుండానే అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారని చెప్పడం గమనార్హం.ఇదిలా ఉంటే, మరో ప్రయివేటు సంస్థ కొత్తూరు లాజిస్టిక్‌ పార్కుతో నిర్మాణాలు చేపడుతోంది. 30 మీటర్ల విస్తీర్ణంతో ఉన్న సర్వీస్‌ రోడ్డును 15 మీటర్ల మేర సుమారు 2 కిలో మీటర్లు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతోంది.అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడ నట్టు వదిలేస్తున్నారు.పరిశ్రమల పేరు తో పురాతన చెరువు శికం, కాలువలను, ఎన్నో ఏండ్లు ఉన్న రోడ్లను కనమరుగు చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు.
చెరువు శికం భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటాం
   బొద్దికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ భూములను సర్వే చేశాం. అందులో ప్రయివేటు సంస్థ రవి ఫూడ్‌ కంపెనీ కొంత మేరకు నిర్మాణాలు చేపట్టినట్టు అంచనాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. చెరువు శికంలో ఉన్న నిర్మాణాలను కూల్చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
ప్రసన్న లక్ష్మి - ఇరిగేషన్‌ డీఈ
చెరువు ఆనవాళ్లు లేకుండా చేశారు
   బొద్దికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. ఇదే విషయం ఎన్నోసార్లు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులకు మత్స్యశాఖ సహకార సంఘం తరుపున ఫిర్యాదు చేసినం. అధికారులు సర్వే చేసి గోడ కూలగొ ట్టారు. కూల్చిన ఆరు నెలలకే మళ్లీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అక్కడ చెరువు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
రవి- కొత్తురు గ్రామం
ప్రభుత్వ భూములను కాపాడాలి
   ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ కొరవడి పెద్ద సంఖ్యలో భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణకు గురైన భూములపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. బొద్దికుంట చెరువు శికం భూముల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలి. లేనిపక్షంలో భవిష్యత్‌లో పెద్దఎత్తున్న ఉద్యమాలు చేపడుతాం.
సాయిబాబు- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.