Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్థిక సవాళ్లకు పరిష్కారమేది? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 12,2022

ఆర్థిక సవాళ్లకు పరిష్కారమేది?

- బడ్జెట్‌ పై కేంద్రానికి రాజకీయ దృక్పథం కరువు
- డిమాండ్‌ వైపు కాదు.. సప్లయి వైపు ఆలోచిస్తున్న సర్కార్‌
- ద్రవ్యోల్బణం నియంత్రణకు చర్యలేవి..? ొ అసమానతలను పెంచే పద్దు
- 25న నిరసన దినాన్ని జయప్రదం చేయండి : కేంద్ర బడ్జెట్‌పై సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌... ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు పరిష్కారం చూపలేదని పలువురు వక్తలు చెప్పారు. ఇందుకు సంబం ధించి మోడీ సర్కారుకు రాజ కీయ దృక్పథం కొరవడిందని వారు విమర్శించారు. ప్రజల అవసరాలు, వారి డిమాండ్ల ఆధారంగా కాకుండా... పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వారి కంపెనీల్లో తయారవుతున్న వస్తువులు, వాటి సప్లయికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో కోతలు విధించటం వల్ల ఇప్పుడున్న అసమానతలు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న నిర్వహించతలపెట్టిన 'బడ్జెట్‌పై నిరసన దినాన్ని' జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 'కేంద్ర బడ్జెట్‌ - ఆర్థిక రంగంపై దాని ప్రభావం...' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహించారు. పట్నం, సీఐటీయూ, ఐద్వా, వ్యకాస, రైతు సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, ఆర్థిక నిపుణులు డి.పాపారావు, ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) అధ్యక్షుడు వి.రమేశ్‌ వక్తలుగా ప్రసంగించారు. పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నర్సింహారావు సెమినార్‌కు అధ్యక్షత వహించారు. నాగేశ్వర్‌ మాట్లాడుతూ... 'ప్రభుత్వం ప్రతీయేటా తన ఆర్థిక వనరులను సమీకరించుకోవటం ద్వారా ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకోవటాన్నే బడ్జెట్‌ ప్రక్రియ అంటారు...' అని నిర్వచించారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌... కరోనా వల్ల దేశంలో సంభవించిన సవాళ్లను పరిష్కరించేదిగా లేదని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో... కోవిడ్‌ సమయంలో కూడా దేశం ఆర్థిక వృద్ధిని సాధించిందంటూ చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు పడిపోయి, ఉద్యోగాలు ఊడిపోయిన తరుణంలో ఆర్థిక వృద్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచటం ద్వారానే ఖజానాను నింపుకున్నారని చెప్పారు. ఇది నిజమైన ఆర్థిక వృద్ధా..? అని ప్రశ్నించారు. సంపన్న వర్గాలపై పన్నులేయకుండా పేదల్ని పిప్పి చేయటమే మీ విధానమా..? అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభ సమయంలోనే ఆదానీ విమానాశ్రయాలకు ప్రయాణీకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌లో గతేడాదితో పోలిస్తే ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్లు తగ్గించారని గుర్తు చేశారు. 2021-22 బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.లక్ష కోట్లు కేటాయించామంటూ చెప్పిన కేంద్రం.. ఈ యేడాది పద్దులో ఆ అంశానికి కేవలం రూ.500 కోట్లే విదిల్చారని ఎద్దేవా చేశారు. ఆహార సబ్సిడీకి 25 శాతం నిధులు తగ్గించటం, మధ్యాహ్న భోజన పథకం కేటాయింపుల్లో రూ.1,267 కోట్లు తగ్గించటమనేది దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆహార ధాన్యాల నిల్వల్లో అగ్రభాగంలో ఉన్న మనం... అదే రీతిలో ఆకలి కేకల్లోనూ అగ్రభాగంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 10 కోట్ల టన్నుల గోధుమలు, బియ్యం గోదాముల్లో మూలుగుతున్నా పేదలకు వాటిని పంచటానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 'ప్రధానమంత్రి పోషణ్‌...' లాంటి ముద్దు ముద్దు పేర్లతో పథకాలు పెడితే ఏం ప్రయోజనమని నాగేశ్వర్‌ వ్యాఖ్యానించారు. పాపారావు మాట్లాడుతూ... బడ్జెట్‌ సరిపోకపోతే అదనంగా నోట్లను ముద్రించటం ద్వారా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచాలని సూచించారు. దీన్నే ద్రవ్యలోటు అంటామని వివరించారు. కానీ ఫైనాన్స్‌ పెట్టుబడి దాన్ని అంగీకరించబోదని చెప్పారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వ్యయం నానాటికీ తగ్గిపోవటానికి ఇదే కారణమని అన్నారు. ప్రజలు ఆకలితో అలమటించినా ఫరవాలేదు.. కానీ షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరటం శోచనీయమని అన్నారు. రమేశ్‌ మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ వల్ల జరిగే నష్టాలను సోదాహరణంగా వివరించారు. ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలను నియంత్రించాల్సిన సర్కారు అందుకు భిన్నంగా వాటికి రాయితీలివ్వటం దారుణమన్నారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలివ్వకుండా ఉపాధి కల్పనా రంగాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌.సాయిబాబు కూడా ప్రసంగించిన ఈ సెమినార్‌లో ఐద్వా, రైతుసంఘం, వ్యకాస ప్రధాన కార్యదర్శులు మల్లు లక్ష్మి, టి.సాగర్‌, ఆర్‌.వెంకటరాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.