Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రాణం పోయినా మోటార్లకు మీటర్‌ పెట్టనియ్య | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 12,2022

ప్రాణం పోయినా మోటార్లకు మీటర్‌ పెట్టనియ్య

- అవసరమైతే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం..
- ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం
- ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు
- మమ్మల్ని టచ్‌ చేస్తే ఊరుకోం..
- ధాన్యం కొనరంట.. సాగు పెట్టుబడి ధరలు పెంచారు
- గోదావరి జలాలతో జనగామ పాదాలు కడుగుతం
- మెడికల్‌, డిగ్రీ కాలేజీల మంజూరు: జనగామ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
''కేంద్రం విద్యుత్‌ సంస్కరణల పేరిట.. ప్రతి మోటార్‌కూ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోం ది.. ప్రాణం పోయినా మీటర్లు పెట్టనివ్వ.. రైతులను ఆగం చేస్తున్రు.. కేంద్రంపై తిరగబడదాం.. అవసర మైతే ఢిల్లీ వెళ్లి కోట్లాడతాం.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుదాం..'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో సమీ కృత జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని సీఎం ప్రారంభిం చారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారి టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం యశ్వంత్‌పూర్‌ వద్ద జరిగిన బహిరంగ సభకు రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించగా సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌, తాను ఈ ప్రాంతంలో సమస్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. బచ్చన్నపేటలో మీటింగ్‌కు వెళితే అందరూ ముసలోళ్లే వచ్చిండ్రు.. యువకులేరీ అంటే 8 ఏండ్లుగా కరువులో వున్నామని, పనుల కోసం పట్నం పోయిండ్రని చెబితే కన్నీళ్లొచ్చాయన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక బచ్చన్నపేట బతుకులు బాగుపడుతున్నరు.. జనగామలో పంటలు పండుతున్నరు.. గోదావరి నీళ్లు తెచ్చి జనగామ కాళ్లు కడిగే కార్యక్రమాలు చేపట్టాం. రాబోయే ఏడాదిలో అన్ని చెరువుల్లో నీళ్లు నింపుతాం. సమ్మక్క బ్యారేజీ పూర్తయింది.. 365 రోజులపాటు దేవాదుల ప్రాజెక్టును వినియోగించుకొని గోదావరి జలాలతో జనగామ పాదాలు కడుగుతాం.. జనగామకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తాం. దీనిపై రెండు 3 రోజుల్లోనే జీవో జారీ చేస్తాం. పాలకుర్తిలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం.. దళిత జీవితాలు బాగుపడాలి. ఈ ఏడాది 40వేల కుటుంబాలకు దళితబంధు ఇస్తాం.. రాష్ట్రంలోని 17లక్షల దళిత కుటుంబాలకు విడతల వారీగా దళితబంధు అమలు చేస్తాం' అని సీఎం చెప్పారు. 'గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజుల్లోపు బీమా సొమ్ము రూ.5లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం.. రాష్ట్రం వచ్చి 8 ఏళ్లు అయింది.. కేంద్రం సాయం చేయకున్నా కడుపు కట్టుకుని అభివృద్ధి చేసుకున్నాం. కానీ, ప్రధాని నరేంద్రమోడీ విద్యుత్‌ సంస్కరణల పేరిట.. ప్రతి మోటార్‌కూ మీటరు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణం పోయినా మోటార్‌కు మీటరు పెట్టనివ్వను. రైతుల ధాన్యాన్ని మాత్రం కొనేది లేదంటున్నారు.. మరోవైపు డీజిల్‌, గ్యాస్‌, ఎరువుల ధరలు అడ్డగోలుగా పెంచారు. సాగు పెట్టుబడి ధరలు పెంచుతున్నారు. కేంద్రంపై తిరగబడదాం.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కొట్లాడతాం. ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వదు, వైద్య కళాశాలలు ఇవ్వదు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అందరం కొట్లాడతాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం. ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు. బీజేపీ వాళ్లను మేం టచ్‌ చేయం.. మమ్మల్ని టచ్‌ చేస్తే ఊరుకోం'' అని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.
కేంద్రంపై పోరాటం చేయాలే : మంత్రి దయాకర్‌రావు
   కేంద్ర ప్రభుత్వంపై సీఎం పోరాటం చేయాలని, తమ వెంట మేముంటామని పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎంను కోరారు. కొడకండ్లలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. బమ్మెర, వల్మిడికి నిధులివ్వాలన్నారు. రాయపర్తి సన్నూరు వెంకటేశ్వరస్వామి దేవాలయం కింద వెయ్యి ఎకరాల భూమి వుందని, గిరిజన రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారని, వారికి పట్టాలివ్వాలని సీఎంను కోరారు.
   తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గిరిజన సంక్షేమం మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఒకప్పుడు జనగామ ఎడారిలా ఉండేదని, ఇప్పుడు.. పంటలు పండుతున్నాయన్నారు. సభలో చీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌, ఎంపీలు పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్మెన్‌ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.