Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర విధానాలను ప్రతిఘటించండి! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2022

కేంద్ర విధానాలను ప్రతిఘటించండి!

- మార్చి 28, 29 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌లో ఎ.కె. పద్మనాభన్‌ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రజల మేలు కోసమేనని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎకె పద్మనాభన్‌ అన్నారు. ఆ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోక పోతే కార్మికవర్గ ఆగ్రహాన్ని మరోసారి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె అవశ్యకతను, ధరల పెరుగుదల వల్ల ఎదురవుతున్న సమస్యలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మికకోడ్‌ల వల్ల తలెత్తబోతున్న ప్రమాదాలను క్షేత్ర స్థాయిలో కార్మిక వర్గానికి వివరించాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటాల ద్వారానే కేంద్రం విధానాలను తిప్పికొట్టగలుగుతామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా పద్మనాభన్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కరోనా కాలాన్ని బంగారు అవకాశంగా ఉపయోగించుకుని కార్పొరేట్లకు అనుకూల విధానాలను అవలంభిస్తూ ప్రజలపై భారం మోపిన తీరును వివరించారు. డీమానిటైజేషన్‌,నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌లతో దేశ ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నదని విమర్శించారు. ఈ సందర్భంలో గత రెండేండ్లుగా రైతాంగం, కార్మిక వర్గం, మైనార్టీలు, దళితులు, మహిళలు, విద్యార్థులు మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిరసనగా గతంలో 19 హర్తాళ్లను నిర్వహించామనీ, 2020లో రెండు హర్తాళ్లను జరిపామని గుర్తుచేశారు. కార్మికవర్గం ఐక్యంగా పోరాడకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి మొదలైన ప్రజా అవసరాలకు తగిన రీతిలో కేటాయింపులు చేయలేదన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలకంటే కార్పొరేట్ల ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అర్థమవుతున్నదని వివరించారు. స్వాతంత్రానంతర కాలంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు. మరోవైపు అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంక్షోభం కారణంగా మూతపడ్డాయనీ, దీంతో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజ వేతనాలు పడిపోయాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేదన్నారు. కార్మికులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించకుండా కులం, మతం, ప్రాంతం తదితర అంశాలను తెర మీదకు తెచ్చి వారి మధ్య ఘర్షణలు సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పారు.ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల సందర్భంగా కర్నాటకలో మతచిచ్చు రేపేందుకు కుట్ర చేస్తున్నదని తెలిపారు. మోడీ ఎన్ని హెచ్చులు పోయినా..చివరికి మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇది కార్మిక, కర్షక ఐక్యత ఫలితమేనని తెలిపారు. నికరంగా నిలబడి పోరాడిన రైతాంగ విజయం తర్వాత కార్మిక వర్గం మరింత పట్టుదలగా పోరాడాల్సిన అవశ్యకత ఉందన్నారు. అన్ని స్థాయిల్లోని సీఐటీయూ కమిటీలు సమ్మె జయప్రదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటాన్ని శక్తివంతంగా నడపాలన్నారు. ఐక్యఉద్యమాల కోసం ముందు పీరిన నిలవాలని కోరారు.Ä

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.