Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధి హామీకి నిధులు తగ్గించలే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

ఉపాధి హామీకి నిధులు తగ్గించలే

- అడిగినోళ్లందరికీ పనిదినాలు కల్పించాం
- ఏడున్నరేండ్ల మోడీ పాలన అభివృద్ధిపై కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధం : మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతంలో రూ. 98 వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని 73 వేల కోట్లకు కుదించి 25 వేల కోట్ల మేర కోతపెట్టారని సీఎం చెప్పారు. దాంటో వాస్తవం లేదు. గతేడాదీ ఉపాధి హామీ చట్టానికి రూ.73 వేల కోట్లే కేటాయించాం. కరోనాతో తర్వాతి కాలంలో దానికి కేటాయింపులు పెరిగాయి. పట్టణ, సబ్‌ అర్బన్‌డివిజన్‌ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉపాధి కోల్పోయారు కాబట్టి రైతులకు, కార్మికులకు అదనంగా పనిదినాలు కల్పించాం. ఎవరు అడిగితే వారికి పనిచూపెట్టాం. దాంతో రూ.73 వేల కోట్ల నుంచి రూ.98 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇంకా ఆర్థిక సంవత్సరం అయిపోలేదు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. 11 కోట్ల 19 లక్షల మందికి ఉపాధి కల్పించాం' అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఏడున్నరేండ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీనియర్‌ పాత్రికేయుల సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. అయితే, కేసీఆర్‌ తన భాషను విడనాడి ప్రజల భాషలో మాట్లాడాలని షరతు విధించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయంలో ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుత టార్గెట్‌ని పూర్తిచేయలేదన్నారు. ఈ నెల 25వ తేదీన వచ్చే సీజన్‌లో సేకరించే ధాన్యం టార్గెట్‌పై అన్ని రాష్ట్రాలతోనూ మీటింగ్‌ ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఆహ్వానం పంపామని చెప్పారు. వ్యవసాయ బావులకు విద్యుత్‌ మీటర్లను పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ తెలంగాణలో త్వరలో పర్యటిస్తారనీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని తెలిపారు. ఐదేండ్లు రాష్ట్రంలో మహిళామంత్రి లేకపోవడం.. సచివాలయానికి రాకుండా పాలన చేయడం..ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం..ప్రశ్నించేవారిని అరెస్టు చేయడం...ప్రతిపక్షనేతలను నిర్బంధించడం..ఇదేనా గుణాత్మక మార్పు అని ప్రశ్నించారు. కొత్తరేషన్‌కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల త్యాగాలను కేసీఆర్‌ అవమానించడం బాధాకరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత రాజ్యాంగాన్ని పొగుడుతుంటే కేసీఆర్‌ మాత్రం మారుస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజ్యాంగ హక్కు వల్లనే హుజురాబాద్‌లో కేసీఆర్‌ ఓడిపోయారనీ, అప్పటి నుంచి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీకి నడ్డా తరువాత ఎవరు అధ్యక్షులవుతారో తెలియదుగానీ, టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌నే అధ్యక్షులవుతారని చెప్పారు. కేసీఆర్‌ డైనింగ్‌ టేబుల్‌పె రాష్ట్ర భవిష్యత్‌ నిర్ణయాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఎరువులను రైతులకు ఉచితంగా ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం మూడు కోట్లఇండ్లను కట్టించిందనీ, తెలంగాణలో ఇస్తామన్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
హైదరాబాద్‌, విశాఖలో మ్యూజియంల ఏర్పాటు
   దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో 10 కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రిమేజినింగ్‌ మ్యూజియమ్స్‌ ఇన్‌ ఇండియా సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటిలో ఒకటి హైదరాబాద్‌లో, మరొకటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో ఐదు కొత్త మ్యూజియాలకు గ్రాంట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.ఒక కోటి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేశామని తెలిపారు. ఏపీలో రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం జరుగుతున్నదనీ, దీన్ని ఆయన జయంతి రోజున ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌కు కేంద్రం మంజూరు చేసిన సైన్స్‌ సిటీకి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నగలను భద్ర పరిచేందుకు భవనం కేటాయిస్తే తీసుకురావడానికి తమకు అభ్యంతరం లేదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.
నేడు బీజేపీలో యువతెలంగాణ పార్టీ విలీనం
   యువతెలంగాణ పార్టీ బీజేపీలో విలీనం కానున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు రాణిరుద్రమదేవి, ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులతో పాటు పలువురు నాయకులు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ సమక్షంలో ఈ విలీన ప్రక్రియ జరుగనున్నది. యువజన సంఘాల జేఏసీ ఏర్పాటులో, తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
   టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ గతంలో కీలక భూమిక పోషించారు. భువనగిరి టికెట్‌ విషయంలో కేసీఆర్‌తో వచ్చిన మనస్పర్ధలతో ఆయన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆతర్వాత కాలక్రమంలో కాంగ్రెస్‌ను వీడి యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. భువనగిరి శాసనసభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పలుమార్లు పోటీచేసి స్వల్పతేడాలతో ఓడిపోయారు. స్వతంత్రంగా వెళ్లేదానికంటే ఏదో ఒక పార్టీ గుర్తు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌ పార్టీవైపు తొలుత మొగ్గుచూపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.