Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కక్కుర్తి కౌన్సిలర్లు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

కక్కుర్తి కౌన్సిలర్లు..

- మంత్రి కేటీఆర్‌ ఇలాకాలో డబుల్‌ ఇండ్ల దందా
- లిస్టులో పేరు వచ్చినా.. కొత్తగా పేరు చేర్చాలన్నా 50వేల నుంచి లక్ష ఇవ్వాల్సిందే..!
- ఇండ్ల పంపిణీ ప్రక్రియలో వెలుగుజూస్తున్న వైనం
- వామపక్షాల ఆధ్వర్యంలో నాల్గు రోజులుగా నిరసన
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్ల టౌన్‌
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇలాకాలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల దందా నడుస్తోంది.. అర్హులను గుర్తించే వ్యవహారంలో సిరిసిల్ల పట్టణ కౌన్సిలర్లు కొందరు 'వసూళ్ల'కు తెరలేపారు. మొత్తం 39వార్డుల నుంచి వచ్చిన 7363 దరఖాస్తుల్లో 2767 మంది అర్హులను అధికారులు గుర్తించగా.. ఆ ప్రక్రియంలో తలదూర్చిన ఆయా వార్డు కౌన్సిలర్లు సంబంధిత అధికారులతో కుమ్మక్కైనట్టు సమాచారం. గూడు కోసం తమ ఇంటి తలుపుతట్టిన వారి నుంచి అర్హత లేకున్నా.. అర్జీలు పెట్టుకున్న వాళ్ల నుంచి రూ.20వేల నుంచి రూ.50వేలు.. ఆపై రూ.లక్ష వరకు డిమాండ్‌ చేశారు. లిస్టులో పేరు రావాలన్నా.. లక్కీడ్రాలో ఇండ్లు వచ్చినా ఒప్పుకున్న డబ్బులు ముట్టజెప్పాకే తాళాలిచ్చేదంటూ ఓ వార్డు కౌన్సిలరు షరతు విధించడం కొందరు కౌన్సిలర్ల 'డబుల్‌' దందాను బేరీజు వేసుకోవచ్చు. మరోవైపు లిస్టులో పేరూ రాక, లక్కీడ్రాలో ఇల్లూ దక్కక కొందరు అర్హులైన పేదలు ఆందోళన బాటపట్టారు. ఇంటి స్థలం, రూ.5లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మండెపల్లిలో 1260, శాంతినగర్‌లో 204, పెద్దూర్‌లో 516, రగుడులో 72 ఇండ్లు కలుపుకుని 2052 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇండ్లకు లబ్దిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా పట్టణంలోని 39వార్డుల నుంచి వచ్చిన 7363 అర్జీల్లో.. 2767 మంది మాత్రమే అర్హులు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఇందులో ఎస్సీలకు 126, ఎస్టీలకు 14, మైనార్టీలకు 274, ఇతర తరగతులకు 2348, వికలాంగులకు 5 ఇండ్లు కేటాయించారు. ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసిన అధికారులు ఆయా వార్డుల వారీగా లక్కీ డ్రా తీసే పనిలో పడ్డారు.
పైసలిస్తేనే పత్రాల్లో పేరంటూ..
   డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతమైన నెలన్నరగా పేదలు తమ వార్డు కౌన్సిలర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు తమ అనుచరులను రంగంలోకి దింపారు. అడ్వాన్సుగా రూ.20వేలు.. లిస్టులో పేరు వచ్చాక రూ.50వేలు ఆయా వార్డుల వారీగా లక్కీ డ్రా తీసే పనిలో పడ్డారు.
పైసలిస్తేనే పత్రాల్లో పేరంటూ..
   డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతమైన నెలన్నరగా పేదలు తమ వార్డు కౌన్సిలర్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు తమ అనుచరులను రంగంలోకి దింపారు. అడ్వాన్సుగా రూ.20వేలు.. లిస్టులో పేరు వచ్చాక రూ.50వేలు లేదా ఆపై రూ.లక్ష ఇవ్వాలంటూ బేరాలకు దిగారు. 'డ్రాలో ఇల్లు వచ్చినా.. మిగిలిన డబ్బులు ముట్టజెప్పాకే మూన్నెళ్లకు తాళాలిచ్చేది' అంటూ షరతులు విధించడం గమనార్హం. ఎలాగైనా ఇల్లు దక్కించుకోవాలన్న ఆశతో ధైర్యం చేసి కొందరు అప్పుల్జేసి మామూళ్లు ఇస్తుంటే.. ఆ సాహనం చేయలేని మరికొందరు కౌన్సిలర్ల కాళ్లావేళ్లా పడుతున్నారు. మొత్తంగా అర్హుల జాబితా పూర్తయిన నేపథ్యంలో ఒక్కో వార్డు నుంచి మామూళ్లు ముట్టజెప్పిన వాళ్లలో అనర్హులు 10 నుంచి 15మంది వరకు ఉంటారనేది అంచనా.
కేటీఆర్‌సారు జెప్పినా ఇల్లు రాలే..
   నాల్గు రోజులుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పలు రూపాల్లో నిరసనతో పేదలు తమ గోడు వెలిబుచ్చుతున్నారు. పట్టణంలోని కాలేజీ మైదానంలో దీక్షలో కూర్చున్న కొందరిని 'నవతెలంగాణ' పలకరించింది. 'ఈ ఇల్లుగాకుంటే ఆ ఇల్లు.. ఆ ఇల్లు గాకుంటే ఈ ఇల్లు అన్నట్టు.. కిరాయి ఇండ్లు మారుకుంట 40ఏండ్ల సంది ఇన్నే బతుకుతున్నం. మాకు ఇల్లు లేదు. గజం జాగ సుత లేదు. గిప్పుడు సర్కారు ఇల్లు ఇత్తదని ఆశతో దరఖాస్తు ఇచ్చినం. కేటీఆర్‌ సారు అస్తే కలిసిన. చిట్టీలేసినప్పుడు నీకొస్తదమ్మ అన్నరు. అసలు చిట్టీల లిస్టుల నా పేరే లేదు' సారూ అంటూ బాధితురాలు రాజమ్మ కన్నీటిపర్యంతమైంది. కొండ లావణ్య అనే వికలాంగురాలు మాట్లాడుతూ.. 'అన్నా 80శాతం నా కాలు పనిచేయదు. ఐదేండ్ల సంది సదరం సర్టిఫికెట్‌ కూడా ఉంది. డ్రా తీయకుండానే వికలాంగులకు ఇస్తానన్నరు. నాకు కాలు పన్జేయదు. కిరాయి ఇండ్లండ్ల ఉంటున్న ఇల్లు కాదుకదా.. గజం జాగకూడా లేదు' అంటూ విలపించింది. 'మా కౌన్సిలర్‌ ఇంటి చుట్టూ తిరిగిన. చివరికి రూ.లక్ష ఇస్తేనే లిస్టుల పేరు పెట్టిస్తా అన్నడు. పైసలియ్యకపోతే లిస్టుల పేరే రాలేదు. గూడు లేని మమ్మల్ని గిట్ల మోసం చేస్తరా?' సారూ అంటూ అలువాలపవిత్ర అనే అర్జీదారు బోరున విలపించింది. ఇలా ఆ దీక్షా శిబిరంలో ఉన్న పేదలంతా ఇండ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చేందుకు ఇండ్లు లేకపోతే ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5లక్షలు అయినా ఇవ్వాలంటూ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.
అర్హులందరికీ స్థలం, రూ.5లక్షలు ఇవ్వాలి
మూషం రమేష్‌- సీపీఐ(ఎం) రాజన్నసిరిసిల్ల జిల్లా కార్యదర్శి
   డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపుల్లో పేదల నుంచి కొందరు కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారు. డబ్బులు తీసుకుంటూ అనర్హులకూ ఇండ్లు కేటాయించారు. వారిని గుర్తించి తొలగించడమే కాకుండా.. అర్హులకు ఇవ్వడంతోపాటు మిగిలిన పేదలకు ఇంటిస్థలంతోపాటు గృహ నిర్మాణానికి రూ.5లక్షల సాయం ఇవ్వాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.