Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తున్న కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తున్న కేంద్రం

- నిరుద్యోగం, పేదరికం మోడీ విజయాలు
- ధర్మభిక్షం స్ఫూర్తితో నిరంకుశంపై పోరాడాలి
- శతజయంతి సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
- స్వామీజీలు రియల్టర్లయ్యారు : నారాయణ
- ఎర్రజెండా పట్టిన వారిలో స్వార్థం ఉండదని నమ్మిన ధర్మభిక్షం : మంత్రి జగదీశ్‌రెడ్డి
- పోరాట మార్గంతోనే సమత, సమానత్వం: చెరుపల్లి
నవతెలంగాణ- కల్చరల్‌
బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని, లౌకికవాద నీతిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఇలాంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజలు ఐక్యపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. నిబద్ధత, నిజాయితీగల ధర్మభిక్షం నిరాడంబరంగా, కమ్యూనిస్టుగానే జీవించారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర వహించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా సమస్యలపై గళమెత్తారని, ఆ స్ఫూర్తితో ప్రస్తుతం మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపిత బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
   ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బీజేపీ పాలనపై పోరాటానికి సంసిద్ధమయ్యారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల మోడీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, ఇకపైనా అలాగే ఉండాలని కోరారు. భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఒకే జాతి, ఒకే సంప్రదాయం, ఒకే మతం, ఒకే భాష సంస్కృతం, ఒకే ఎన్నిక అంటూ మోడీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవాలన్నారు. హిందుత్వ వాదంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అన్నారని, అట్టి ప్రాంతీయ భాషలను దిగజార్చి హిందీ సంస్కృతాన్ని రుద్దాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్మిక, కర్షక, పేదల కోసం కాదని టాటా, అదాని, అంబానీల వంటి కార్పొరేట్ల కోసమేనని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడం, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సంక్షోభం మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులను కేరళ నుంచి కూడా వెళ్లగొడతానంటున్నారని, అలా అన్న ముస్సోలిని, హిట్లర్‌ చరిత్ర కాలగర్భంలో కలిసి పోయారని, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పారు. ఆల్‌ ఇండియా మూవ్‌మెంట్‌లో సమైక్యంగా జస్టిస్‌ ఫర్‌ ఇక్వాలిటీ కోసం పోరాటం చేయాలన్నారు.
   సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. సమతా విగ్రహం వద్దకు కేంద్ర మంత్రులు క్యూ కట్టారని, స్వామిజీలు రియల్టర్లుగా మరిపోయారని విమర్శించారు.
   విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎర్రజెండా పట్టిన వారిలో స్వార్థం ఉండకూడదని నమ్మిన కొద్దిమందిలో ధర్మభిక్షం ప్రముఖులని చెప్పారు. ఆయన కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతులని కొనియాడారు. ప్రపంచ పటంలో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు. హక్కుల కోసం నియంతలపై పోరాడే శక్తి తెలంగాణ సమాజం రక్తంలోనే ఉందన్నారు.
   సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ధర్మభిక్షం సహచర్యంలో పనిచేసే అవకాశం యువకునిగా ఉన్న సమయంలో తనకు వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ప్రతిష్టించాలని, పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పొందుపరిస్తే యువతకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. సమత, సమానత్వం యాగాల వల్ల రావని, పోరాట మార్గం ద్వారా వస్తాయని చెప్పారు. ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసుకొని, ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉందన్నారు.
   మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లడుతూ.. రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా నియంత్ర పోకడలు పోయేవారికి బుద్ధి చెప్పాల్సింది యువతేనని అన్నారు.
  అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. లౌకిక ప్రజాస్వామిక శక్తులు ఏకం కావాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సీపీఐ సీనియర్‌ నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి, రామకృష్ణ, అజీజ్‌ పాషా, పి.వెంకట రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ తదితరులు ధర్మ భిక్షం నిబద్ధత, నైతికతలను ప్రశంసించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.