Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రమోషన్లలో వివక్ష.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 18,2022

ప్రమోషన్లలో వివక్ష..

- దళితులకు దక్కని న్యాయం
- అర్హత ఉన్నా ఉద్యోగోన్నతి రాలేదు
- సర్కార్‌ ఆదేశాలు బేఖాతర్‌
- కమిషనర్‌ను తప్పుదోవపట్టిస్తున్న పరిపాలన విభాగం
- ఇదీ జీహెచ్‌ఎంసీ బాగోతం
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని రోడ్లు, ప్రధాన కూడళ్లు, నగరమంతా శుభ్రంగా ఉందంటే పారిశుధ్య కార్మికుల శ్రమే. వీరిలో అత్యధిక మంది దళితులే. వీరితోపాటు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లోనూ కమాటి, ఆఫీస్‌ సబార్డినేట్‌లు సైతం 80శాతానికిపైగా దళితులే ఉన్నారు. అయితే, ప్రమోషన్ల విషయంలో వారికి అన్యాయం జరుగుతోంది. అందుకు ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగోన్నతులే నిదర్శనం.
   సీనియారిటీ ఉన్నా, ప్రొవిజినల్‌ లిస్టులోని ముందు వరుసులో ఉన్నా, ఇతర అన్ని అర్హతలు ఉన్నా దళితులకు ప్రమోషన్‌ రాలేదు. ఇతరులకు మాత్రం పైవేవీలేకున్నా ప్రమోషన్స్‌ ఇచ్చారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఇచ్చిన జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ ప్రమోషన్లలో అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమోషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను పరిపాలన విభాగం అధికారులు లెక్కచేయకుండా నచ్చినవారికి ఇచ్చేశారు. మరోపక్క కొంత మంది అధికారులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను తప్పుదోవపట్టిస్తున్నారని పలువురు యూనియన్‌ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వం ఆదేశాలు బేఖాతర్‌
   ప్రసాదరావు కమిటీ ప్రకారం.. బల్దియాలో 200 రికార్డు అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు కమాటీలు, ఆఫీస్‌ సబార్డినేట్లు 100 మందికి రికార్డు అసిస్టెంట్‌లుగా ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఓ అధికారి చెప్పారు. కానీ, 85పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పిన అధికారులు 217మందితో ప్రొవిజినల్‌ జాబితా తయారు చేసి 76 మందికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. దాంతో ప్రసాదరావు కమిటీ అంటే గౌరవం లేదని, ప్రభుత్వ ఆదేశాలంటే లెక్కలేదని యూనియన్‌ నేతలు వాపోతున్నారు. దీంతోపాటు సూపరింటెండెంట్‌, ఏఎంసీ, డీఎంసీ, జేసీ స్థాయి ప్రమోషన్లను ప్రసాదరావు కమిటీ సిఫారసు ప్రకారం చేస్తున్న అధికారులు రికార్డు అసిస్టెంట్ల విషయంలో ఎందుకు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కమిషనర్‌ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఉల్లంఘనలు ఇలా..
   రికార్డు అసిస్టెంట్‌ ప్రమోషన్లలో జీహెచ్‌ఎంసీ పరిపాలన విభాగం అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. ప్రమోషన్‌ ఇవ్వడానికి రెండేండ్ల నిడివి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అర్హులకు ప్రమోషన్లు సైతం ఇచ్చింది. కానీ జీహెచ్‌ఎంసీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రొవిజినల్‌ జాబితాలో 85 నెంబర్‌లోపు ఉన్నవారికి సగానికిపైగా అర్హులకు ప్రమోషన్‌ రాలేదు. విచిత్రమేమంటే టాప్‌10లో ఉన్నవాళ్లకు ప్రమోషన్లు రాలేదు. 2016లో జవాన్‌లుగా ప్రమోషన్‌లు పొందిన వాళ్లకు 2020లో రికార్డు అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. దీంతోపాటు 8నెలల కిందట జవాన్‌గా ప్రమోషన్‌ తీసుకున్నవారు మళ్లీ ప్రస్తుతం రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. కానీ 2016 నుంచి జవాన్‌గా పనిచేస్తున్న దళిత సామాజిక తరగతి వాళ్లకు ఈ సారి కూడా రికార్డు అసిస్టెంట్‌ ప్రమోషన్‌ రాలేదు.
- తమకు రికార్డు అసిస్టెంట్‌ ప్రమోషన్‌ కావాలని అడిగినవారికి ఇవ్వని అధికారులు అవసరం లేదని రాతపూర్వకంగా రాసిచ్చినవారికీ మాత్రం బలవంతంగా కట్టబెట్టారు. ఈ విషయంపై సదరు అధికారులను ఓ యూనియన్‌ నేత అడిగితే కమిషనర్‌ చెబితేనే ఇచ్చామని సమాధానం చెప్పినట్టు తెలిసింది.
- ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు స్టడీ పర్మిషన్‌ తీసుకుని పై చదువులకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అనుమతి ఉంటేనే ప్రమోషన్లకు అర్హులు. కానీ అలాంటివారికి సైతం బల్దియా అధికారులు ప్రమోషన్లు ఇచ్చారు.
- ప్రమోషన్ల కోసం తయారు చేసిన ప్రొవిజినల్‌ లిస్టుపై క్లర్క్‌, ఏఎంసీ, జేసీ, ఏసీ, కమిషనర్‌ సంతకాలు చేశారు. కానీ ఫైనల్‌ లిస్టుపై మాత్రం క్లర్క్‌, కమిషనర్‌ సంతకాలతో విడుదల చేశారు. పై విషయాలపై అదనపు కమిషనర్‌(పరిపాలన)ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
విజిలెన్స్‌ విచారణ జరిపించాలి
  జీహెచ్‌ఎంసీలో ప్రమోషన్ల విషయంలో చాలా అవకతవకలు జరగుతున్నాయి. దీనిపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలి. పరిపాలన విభాగంలోని అధికారులు కిందిస్థాయి ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన వారి పేర్లను పక్కకు పెట్టి అనర్హులకు ప్రమోషన్లు ఇచ్చారు. ఈ విషయంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.
తెలంగాణ గ్రేటర్‌ హైదరాబాద్‌
ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు బాలకృష్ణ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.