Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆ బీసీ గురుకులాలు.. సమస్యలకు నిలయాలు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 18,2022

ఆ బీసీ గురుకులాలు.. సమస్యలకు నిలయాలు..

- కలుషితమైన నీటితో వంద మంది విద్యార్థులకు అస్వస్థత
- 30మంది ఉపాధ్యాయులకు అనారోగ్యం
- విషయం బైటకి పొక్కకుండా జాగ్రత్తలు
- రంగారెడ్డి జిల్లా మునగనూరు క్యాంపస్‌లో విద్యార్థినుల అవస్థలు
- ఒక్కో హాల్‌లో వంద మందికి పైగా స్టూడెంట్లు
- ఎస్సీ, ఎస్టీ గురుకులాల పరిస్థితీ అంతే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇరుకిరుకు గదులు.. మంచినీటి సౌకర్యం అంతంతమాత్రమే. బాత్రూంల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం బీసీ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయం. అంబర్‌పేట, ఎల్‌బీ నగర్‌, సికింద్రాబాద్‌ పాఠశాలల విద్యార్థినీలందరికీ ఈ క్యాంపస్సే దిక్కు.
   ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 1,500 మందివిద్యార్థినీలకు ఇక్కడే విద్యాభ్యాసం. 50మంది ఉపాధ్యాయులు. 35మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలు.అసౌకర్యాలతో కాలం నెట్టుకొస్తున్న విద్యాలయంలో ఇటీవల 100మంది విద్యార్థులు 30మంది ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు బాలికలు, ఉపాధ్యాయులు నేటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని యజమాన్యం గోప్యంగా ఉంచటంపై బాలికల తల్లిదండ్రులనుంచి నిరసన వ్యక్తమవుతున్నది. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు..పిల్లలను బడికి పంపించేందుకు జంకుతున్నారు.
   ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు మాత్రం గురుకులాల గురించి గొప్పగా చెబుతున్నప్పటికీ...అవి సమస్యలకు నిలయాలుగా కూడా ఉన్నాయన్న విషయాన్ని మరుగుపరుస్తున్నారు. ఒకటి రెండు మినహాయిస్తే..రాష్ట్రంలోని గురుకులాల్లో ఎటుచూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. వందల మంది విద్యార్థులను ఇరుకు గదుల్లో ఉంచి చదువు చెప్తున్నారు. చాలా గురుకులాల్లో ఇది తరగతి గది, ఇది వరండా, ఇది వంట శాల అని ప్రత్యేకంగా లేవు. ఓ హాల్‌ కేటాయించి అందులో పిల్లల్ని ఉంచుతున్నారు. అక్కడే తినుడు.. అక్కడే చదువుడు.. అక్కడే పండుడు అయితున్నది. దాదాపు 75 శాతం గురుకులాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో, ఇరుకిరుకు గదుల్లో వీటిని నడిపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాత్రూంలు లేకపోవడంతో కొన్ని చోట్ల రెండు, మూడు రోజులకోసారి స్నానం చేస్తున్నామని బాలికలు చెబుతున్నారు. ఉన్నా వాటికి తగిన విధంగా తలుపులు లేవు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ బాత్రూంలను రోజుల తరబడి శుభ్రం చేయక, నల్లాలు పనిచేయక, బకెట్లతో నీళ్లను మోసుకెళ్లలేక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గీజర్లు లేక చన్నీటి స్నానాలు చేస్తున్నారు. దోమలతో సావాసం చేస్తున్నారు. చాలా గురుకులాల్లో మెనూ సరిగ్గా అమలు కావటం లేదు. కొన్ని గురుకులాల్లో బెంచీలు లేక నేలమీద కూర్చొని చదువుకుంటుండగా.. ఇంకొన్ని చోట్ల ఆ జాగ కూడా లేక ఆరు బయటే ఉపాధ్యాయులు క్లాసులు బోధిస్తున్నారు.
అద్దె భవనాలే దిక్కు!
   రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ , 204 మైనార్టీ గురుకులాలుండగా.. ఒక్కదానికి కూడా సొంత సొంతభవనాల్లేవు. 133 ఎస్టీ గురుకులాల్లో 30.. 268 ఎస్సీ గురుకులాల్లో 150 గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 665 గురుకులాలకు సొంత భవనాలు లేవు. అన్ని గురుకులాల్లో కలిపి 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రెసిడెన్షియల్‌ విధానంలో ఇంగ్లీష్‌ మీడియం కావడం, ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేయడంతో తల్లిదండ్రులు పోటీపడి గురుకులాల్లో పిల్లలను చేర్పించారు. చదువు సంగతేమోగానీ అక్కడ సౌకర్యాలు, సరైన ఆహారం సరిగ్గా లేక పిల్లలు తిప్పలు పడుతున్నారు. సొంత భవనాలు ఉన్నచోట్ల వసతులు బాగానే ఉన్నప్పటికీ.. అద్దె భవనాల్లో అధ్వాన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మిటరీలు, వంటగది, హాళ్లు, బాత్రూంలు లేవు. సరిపడా ఉపాధ్యాయులు ఉండటం లేదు. వారంలో నాలుగురోజులు గుడ్డు, రెండురోజులు మటన్‌ , రెండు రోజులు చికెన్‌ పెట్టాల్సి ఉండగా.. వారంలో ఒకరోజు గుడ్డు, ఒకరోజు చికెన్‌తో సరిపెడుతున్నారు. ఇదేంటని అడిగితే కాంట్రాక్టర్‌ సప్లై చేయట్లేదని, వస్తే పెడ్తామని సిబ్బంది చెప్పడం విశేశం.
సొంత బిల్డింగ్‌ ఏర్పాటుచేయాలి
   గురుకులాలకు సొంత భవనాలు లేకపోవటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్యలతో విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. అంటువ్యాధులు ప్రభలుతున్నాయి. సెప్టిక్‌ ట్యాంకులు లేవు. బాత్రూంలు సరిగా లేవు. తరగతి గదులు విశాలంగా లేవు. మెనూ సరిగా అమలు కావటం లేదు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్యమాలు తప్పవు.
- నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.