Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆస్తులను అమ్మే బడ్జెట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 19,2022

ఆస్తులను అమ్మే బడ్జెట్‌

- కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై ఆందోళనలు
- 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె.. 25న గ్రామీణ బంద్‌
- సీఐటీయూ, వ్యకాస, రైతుసంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ: వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తి ప్రజావ్యతిరేకమైనదని వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు తెలిపారు. ప్రభుత్వరంగ ఆస్తులను విక్రయించి తద్వారా వచ్చిన ఆదాయంతో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనే రీతిలో కేంద్రం బడ్జెట్‌ ఉందన్నారు. దీన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతుసంఘాల ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె, దీనికి సన్నాహంగా 25న గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో చూపిన రూ.35 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మడం ద్వారా రూ.11లక్షల కోట్లు సమకూర్చుకుంటామని కేంద్రం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వరంగ ఆస్తులను అమ్మే హక్కు మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విమానాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో వాటాలు అమ్మడం, ఎల్‌ఐసీ ప్రయివేటీకరణ, గనుల విక్రయం ద్వారా రూ.7లక్షల కోట్లు సమకూర్చుకుంటామని చెప్పడం దారుణమన్నారు. ఆహారభద్రతకు గత బడ్జెట్‌లో రూ.2.70లక్షల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ.2.05 లక్షల కోట్లకు కుదించడంతో వ్యవసాయరంగం కుదేలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఫుడ్‌, కాటన్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలు నిర్వీర్యం అవుతాయన్నారు. పంటలకు మద్దతు ధర లభించదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసమే ఇలాంటి కుటిలయత్నాలు అని ఆరోపించారు. ఎరువులు, పురుగుమందుల సబ్సిడీకి రూ.20వేల కోట్లు కోత విధించారని తెలిపారు. గతంలో ఉపాధి హామీకి రూ.లక్ష కోట్లు నిధులు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.73వేల కోట్లకు కుదించారని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది ఉపాధి లేక అవస్థలు పడుతుంటే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు నిధులు తగ్గించడం సరికాదన్నారు. రాష్ట్రాలు, కార్మికుల హక్కులను హరించేలా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్శిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ... వీటి ఊసేది బడ్జెట్‌లో లేదన్నారు. అనేక మంది రాజకీయ నాయకులకు బినామీగా ఉండి వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేసిన చినజీయర్‌స్వామి ఆస్తులపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కులం పేరుతో రాష్ట్రపతి కోవింద్‌కు జరిగిన అవమానంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిజనిర్ధారణ చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. నాలుగు లేబర్‌ కోడ్‌లను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయాన్ని, చిన్న, కుటీరపరిశ్రమలను దెబ్బతీయడంతో సామాన్య ప్రజానీకంపై భారం వేసే నూతన విద్యుత్‌ చట్టాలను సైతం ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, వ్యవసాయ కార్మక సంఘం, తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వర్లు, మాదినేని రమేష్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విష్ణు, కళ్యాణం వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎం.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.