Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడ్జెట్‌లో సామాజిక న్యాయానికి విఘాతం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 19,2022

బడ్జెట్‌లో సామాజిక న్యాయానికి విఘాతం

- తరతరాలుగా అన్యాయమే : కేవీపీఎస్‌ వెబినార్‌లో బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సామాజిక న్యాయానికి విఘాతం కలిగించేదిగా ఉందనీ, తరతరాలుగా దళితులు, గిరిజనులు మోసపోతూనే ఉన్నారని దళిత సోషల్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) కార్యదర్శి బీవీరాఘవులు తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'కేంద్ర బడ్జెట్‌-దళితుల సమగ్రాభివృద్ధి' అనే అంశంపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు సమన్వయంతో వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌.. సామాజిక న్యాయానికి ఏ మేరకు న్యాయం చేస్తుందో పరిశీలించాల్సిన అవసరముందన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, వికలాంగులు తదితర తరగతులకు ఈ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. బడ్జెట్‌లోని అంకెలు చూసి సంబరపడితే నష్టం జరుగుతుందని తెలిపారు. వాస్తవంగా ఈ బడ్జెట్లలో ధనవంతులకు, భూస్వాములకు, పారిశ్రామిక వేత్తల కేటాయింపులకు సంబంధించి అంతగా కత్తిరింపులు ఉండబోవని లెక్కలతో ఉదహరించారు. ఈ కత్తిరింపులకు గురయ్యేది దళితులు, గిరిజనులు, మహిళలు ఇతర సామాజిక వెనుకబాటుకు గురయ్యే ప్రజానికమేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. పది శాతానికి మించి కత్తిరింపులుంటే ఆ తరగతులకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని చెప్పారు. దళితులకు బాగా ఖర్చు చేశామని చెప్పినప్పుడు కూడా కేటాయించిన బడ్జెట్‌ నుంచి 20శాతం కత్తిరించారనీ, గిరిజనులకు అదే పరిస్థితి సృష్టించారని తెలిపారు. ఆ రకంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పెరుగనున్న ధరలను అంచనా వేసి కేటాయింపులు చేశారా? లేదా? అని పరిశీలించాల్సిన అవసరముందన్నారు. ఈ రూపంలో చూసినప్పుడు సామాజిక తరగతులకు కేటాయించిన బడ్జెట్‌ అంకెల్లో చూపినా.. వాస్తవంగా ధరలను పరిగణలోకి తీసుకుంటే జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరగలేదన్నారు. అందుకే కేంద్రం అర్థిక దోపిడితో పాటు సామాజిక అణచివేతకు పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రజలనుంచి పన్నుల రూపంలో పిండి, కార్పొరేట్ల లాభాలను గడించే విధంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని చెప్పారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచకుండా బడ్జెట్‌ను గాడిలో పెట్టలేమన్నారు. అప్పుల మీద ఆధారపడి దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకుపోవాలని చూడటం సరికాదన్నారు. అప్పులకు వడ్డీలు చెల్లించటం కోసం మళ్లీ అప్పులు తెస్తే..అది ప్రజలకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. మోడీ సర్కారుది అప్పులకు వడ్డీలు చెల్లించే బడ్జెట్‌ అన్నారు. 2019కి ముందే దేశం ఆర్థికంగా దివాళా అంచున ఉందని చెప్పారు. కరోనా కాలంలో అది మరింత దెబ్బతిన్నదన్నారు. అయితే ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమయిందని చెప్పారు. కానీ..పారిశ్రామిక వేత్తలు మాత్రం బాగా లాభపడ్డారని చెప్పారు. సుమారు రూ.20 లక్షల కోట్లు ఉద్ధీపనలు ప్రకటించి వారి ప్రయోజనాలను కాపాడిందని చెప్పారు. పేదలు మాత్రం ఉన్న కాస్త ఆదాయాన్ని ఆస్పత్రులకు ఖర్చు చేశారనీ, ఆర్థికంగా బాగా దిగజారారని వివరించారు. రోగాన్ని కూడా లాభాలకు అనువుగా ఉపయోగించుకునేలా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం తోడ్పడిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు పేదల్లో అంతర్భాగంగా ఉన్న దళితులకు మరింత నష్టం తీసుకువచ్చే విధంగా ఉందని వివరించారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ శక్తులు దళితులు, గిరిజనులమీద అత్యంత పాశవికంగా దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్నాయని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. చెప్పారు. ఇలాంటి సమయంలో వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులను పటిష్టం చేయటం కోసం తగిన రీతిలో బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం ఉద్యమం చేయటం వల్ల దళితుల్లో కొంత చైతన్యం వచ్చిందన్నారు. వారికి కేటాయించిన నిధులను తగిన రీతిలో ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు ఇతర రంగాలకు మళ్లిస్తున్నాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం లేదని చెప్పారు. వీటిని రాబట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దారిమళ్లించిన నిధులను తిరిగి ఆయా రంగాలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వాటాకోసం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరముందన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.