Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక శాఖలో దరఖాస్తుల కట్టలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 20,2022

కార్మిక శాఖలో దరఖాస్తుల కట్టలు

- మూలన పడిన 3వేల పత్రాలు
- మూడేండ్లుగా పెండింగ్‌లోనే..
- సిబ్బంది లేరనే పేరుతో కాలయాపన
- సమావేశమవ్వని బోర్డు సలహా కమిటీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక శాఖలో దరఖాస్తులు మూలనపడ్డాయి.. మూడేండ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కార్మికులకు సంక్షేమబోర్డు నుంచి అందించే ప్రోత్సహకాలు సరైన సమయంలో అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూడేండ్లుగా లబ్దిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కార్యాలయం నుంచి బోర్డుకు పంపితే వెంటనే మంజూరయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సిబ్బంది లేరనే కారణం చూపి పక్కనబెట్టారు.
సంక్షేమ బోర్డులో నమోదు
   ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 1,26,149 మంది కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో మహిళలు 64,482, పురుషులు 61,044 ఉన్నారు. ఇందులో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం పరిహారం, బహుమతుల పేరుతో కొంత ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రసూతి (రెండు కాన్పుల వరకు) రూ.30,000, పెండ్లి బహుమతి రూ.30వేలు, సహజ, ప్రమాద మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.లక్ష సహాయం, అంత్యక్రియలకు రూ.30వేలు, పాక్షిక అంగవైకల్యం పొందితే జరిగిన నష్టాన్నిబట్టి అందిస్తారు.
మూడేండ్లుగా క్లైమ్‌లు పెండింగ్‌
   భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోనే 2009లో ఏర్పడింది. అయితే, మూడేండ్లుగా క్లైమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 1536, సూర్యాపేటలో 1200, యాదాద్రి భువనగిరిలో 500పైగా ఉన్నాయి. ఇందులో కూడా నల్లగొండ అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి పరిధిలో దాదాపు 1000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్మికుల దరఖాస్తులను ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌ చేయడానికి సిబ్బంది లేరనే కారణం చూపి నిర్లక్ష్యం వహిస్తున్నారు. 'క్లైమ్‌లు చేయడం ఒక్కటే మా పని కాదు.. ఇతరత్రా పనులు చాలా ఉన్నాయి' అంటూ కార్మికులతో చులకనగా మాట్లాడుతున్నారని, ఎన్నిసార్తు తిరిగినా తమకు సహాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బడ్జెట్‌ సమస్య కూడా లేదు. ఇప్పటికే సుమారు రూ.2వేల కోట్ల బడ్జెట్‌ ఉందని సమాచారం. దానిని వినియోగించకుండా కార్మికులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
శాఖలో అన్ని ఖాళీలే..
   కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన కార్మిక శాఖ సిబ్బంది లేక వెలవెల బోతుంది. ఉమ్మడి జిల్లాలో 8 అసిస్టెంట్‌ కార్మికశాఖ అధికారి కార్యాలయాలున్నాయి. అందులో నల్లగొండ 4, సూర్యాపేట 2, యాదాద్రి భువనగిరి 2 కేంద్రాలున్నాయి. సూర్యాపేట, యాదాద్రి నాలుగు, నల్లగొండలో ఏఎల్‌వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయిలో ఆఫీసు సిబ్బంది కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే కార్మికులను సంక్షేమబోర్డులో నమోదు చేసుకోవడం, క్లైమ్స్‌ దరఖాస్తులు స్వీకరించడం, పరిష్కరించడంలో ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
బోర్డు సమావేశాలెక్కడా..?
   రాష్ట్ర స్థాయిలో సంక్షేమ బోర్డుకు సలహా కమిటీని నియమిస్తారు. అదే కోవలో జిల్లాలో కూడా కమిటీని నియమించారు. దానికి జిల్లా కార్మికశాఖ అధికారి చైర్మెన్‌గా ఉంటారు. వివిధ కార్మిక సంఘాల నాయకులను సభ్యులుగా నియమిస్తారు. జిల్లాలో కార్మికుల సమస్యలు, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు తదితర వాటి గురించి చర్చిస్తారు. కానీ జిల్లా బోర్డు సమావేశం ఏర్పాటు చేయక దాదాపు మూడేండ్లు గడుస్తుంది. ఒకవేళ ఎవరైనా కార్మిక సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేయాలంటే 'అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది ఇక సమావేశాలతో ఏం పని' అంటూ జిల్లా అధికారి చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో పరిహారం కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి వసూళ్లు కూడా చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై చర్చించాలనుకుంటే సమావేశాలే నిర్వహించడం లేదని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.
త్వరలో పూర్తి చేస్తాం
   పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. డివిజన్‌ స్థాయిలో అధికారులు, కొంత సిబ్బంది లేకపోవడం వల్ల ఆలస్యమైంది. ఈ మధ్య ఒకరిద్దరు అధికారులు వచ్చారు. తొందరలోనే అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం.
రాజేంద్రప్రసాద్‌- జిల్లా కార్మికశాఖ అధికారి
పెండింగ్‌ సమస్యను పరిష్కరించాలి
   సంక్షేమ బోర్డు నుంచి కార్మికుల కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే అందేలా కార్మికశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. సిబ్బంది లేరని పనులు ఆగడంలేదు.... కేవలం కార్మికుల పనులే ఎందుకు పెండింగ్‌లో ఉంటాయి. ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేయాల్సివస్తుంది.
చిన్నపాక లక్ష్మినారాయణ-
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నల్లగొండ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.