Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆహారం, దుస్తుల పేరిట బీజేపీ దాడి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 20,2022

ఆహారం, దుస్తుల పేరిట బీజేపీ దాడి

- హిజాబ్‌ పేరుతో రెచ్చగొడుతున్న కాషాయమూకలు
- సంఘటిత ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపు
- ఉత్తేజంగా టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలుత ఆహారపు అలవాట్ల పేరుతోనూ, ఇప్పుడు దుస్తుల పేరుతోనూ దాడులు చేస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. కర్నాటకలో హిజాబ్‌ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టటం ద్వారా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని కాషాయమూకలు భావిస్తున్నాయని అన్నారు. సమకాలీన పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలనీ, చైతన్యవంతంగా ఆలోచించాలని సూచించారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ (టీఎంఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర నాలుగో మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉత్తేజభరితంగా ప్రారంభమయ్యాయి. టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి మురళి ఆ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రారంభసభలో నర్సిరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచంలోని వనరులను ప్రజలందరి వినియోగంలోకి తేవాలని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను తెల్లజాతి పోలీసు ఊపిరాడకుండా చంపాడని గుర్తు చేశారు. ట్రంప్‌ వర్ణవివక్షతను పాటించి అహంకారంతో గెలవాలకున్నా అక్కడి ప్రజలు బైడెన్‌కు మద్దతుగా నిలిచారని అన్నారు. అమెరికాలో నల్లజాతీయుల తరహాలోనే భారత్‌లో ముస్లింమైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వివరించారు. సంప్రదాయాల ముసుగులో అభివృద్ధి కుంటుపడుతున్నదని చెప్పారు. ప్రజలు, కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిస్థితులు అందరి కుటుంబాలపైనా, వ్యక్తిగత జీవితాలపైనా ప్రభావం చూపుతాయన్నారు. కార్మికవర్గం హక్కులను మోడీ సర్కారు కాలరాస్తున్నదని విమర్శించారు. దేశ సంపద, ఆస్తులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. కార్మికులు సంఘటితం కాకుండా పాలకులు వర్ణ వివక్షతను, కుల, మత విద్వేషాలను, ప్రాంతీయ, సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలని సూచించారు. అవిశ్రాంత పోరాటం వల్లే వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. రైతాంగం స్ఫూర్తితో కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలనీ, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
మార్చి 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : రమేష్‌ సుందర్‌
   కేంద్రంలో బీజేపీ సర్కారు అనుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఫ్‌ఎంఆర్‌ఏఐ అధ్యక్షులు ఆర్‌ రమేష్‌ సుందర్‌ పిలుపునిచ్చారు. ఫార్మారంగంలో యాజమాన్యాల ఆగడాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా మేడీ సర్కార్‌ ఆరోగ్యరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించిందని అన్నారు. బడ్జెట్‌లో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, 1.5 శాతం నిధులే కేంద్రం ప్రతిపాదించిందని వివరించారు. బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకట్రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా ఉన్నా సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మెజార్టీ, మైనార్టీ మతం పేరుతో దేశాన్ని నిలువునా మోడీ సర్కారు చీల్చుతున్నదని ఏఐఐఈఏ నాయకులు పివిఎన్‌ఎస్‌ రవీంద్రనాథ్‌ విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రజాధనంతో అభివృద్ధి చేసిన ప్రభుత్వరంగ సంస్థలను ఎన్‌ఎంపీ పేరుతో హోల్‌సేల్‌గా కార్పొరేట్‌ శక్తులకు అమ్ముతున్నదని అన్నారు. కార్మిక కోడ్‌లను రద్దు చేయకుంటే ఆ వర్గానికి హక్కులుండబోవని చెప్పారు. టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి మురళి అధ్యక్షతన జరిగిన ప్రారంభసభలో ప్రధాన కార్యదర్శి ఐ రాజుభట్‌, ఎఫ్‌ఎంఆర్‌ఏఐ కార్యదర్శి కె సునీల్‌కుమార్‌, టీఎంఎస్‌ఆర్‌యూ ఉపాధ్యక్షులు జి విద్యాసాగర్‌, కోశాధికారి సిహెచ్‌ భానుకిరణ్‌, రాష్ట్ర కార్యదర్శులు పివిఎస్‌ఏ ప్రసాద్‌, దొంతుల శ్రీనివాస్‌, కె ఐలయ్య, సయ్యద్‌ సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.
మోడీ సర్కారు విధానాలపై పోరాటం
   మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న కాలంలో ఐక్య పోరాటాలు చేపట్టాలని టీఎంఎస్‌ఆర్‌యూ సంయుక్త కార్యదర్శి ఎ నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను, ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ఖండించారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ఈ విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.