Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జీవో నెంబర్‌ 317ని వెంటనే రద్దు చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2022

జీవో నెంబర్‌ 317ని వెంటనే రద్దు చేయాలి

- పంచాయతీకార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేయాలి
- ఇందిరాపార్కు వద్ద టీఈఏ నిరసన దీక్షలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 317ని వెంటనే రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్‌ చేయాలనీ, వారిపై అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులను అరికట్టాలని కోరారు. తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(టీఈఏ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జీవో నెంబర్‌ 317 బాధిత ఉద్యోగులు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిరసన దీక్ష చేపట్టారు. '70 మందికి మించొద్దు' అన్న పోలీసుల ఆంక్షల నడుమ, ప్రత్యేక అనుమతితో మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 గంటల వరకు కొనసాగింది. ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆప్‌నేత ఇందిరాశోభన్‌ మాట్లాడుతూ..ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మెజార్టీ ఉద్యోగ సంఘాల నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులను చెట్టుకొకరిని.. పుట్టకొకరిని వేసి ఏం సాధించాలనుకుంటున్నదని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు భజన, తొత్తు ఉద్యోగ సంఘాల వల్లనే నేడు ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఉద్యోగుల బాధలు సంఘాల నేతలకు పట్టవా? అని ప్రశ్నించారు. సంఘాల పేర్లతో వ్యాపారాలు చేస్తున్న, స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న నేతల కుతంత్రాలను ఉద్యోగులు అర్థం చేసుకుని మసలుకోవాలని పిలుపునిచ్చారు. టీఈఏ రాష్ట్ర అధ్యక్షులు సంపత్‌కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడుతూ.. ఉద్యోగులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తమ అసోసియేషన్‌ కృషి చేస్తోందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గొప్పగా ఉండేదనీ, నేడు అమ్మో సర్కారు కొలువా? వద్దు బిడ్డా..చచ్చిపోతారనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామకార్యదర్శుల ఆత్మహత్యలపై సీబీఐ విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులంతా కలిసి ఉంటేనే విజయం దక్కుతుందనీ, విడిపోతే పడిపోయి ఓడిపోతారని అన్నారు. జీవో 317వల్ల నిరుద్యోగులకూ పెద్ద నష్టం చేకూరుస్తున్న తీరును వివరించారు. ఉపాధి హామీచట్టంలో తొలగించబడిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి నియమించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని కోరారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 33 నెలల పీఆర్సీ బకాయిలు, 18 నెలల డీఏ. ఏరియల్స్‌ను చెల్లించాలని కోరారు. బిశ్వాల్‌ కమిటీ సూచించిన ఒక లక్షా 92 వేల ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టి ఉద్యోగుల పై ఉన్న తీవ్ర పని భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించి ఉద్యోగికి భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సదానందంగౌడ్‌ మాట్లాడుతూ..ఒక ప్రణాళికాబద్ధంగా బదిలీల ప్రక్రియ చేపట్టకపోవడం వల్లనే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీఈఏ మహిళా విభాగం అధ్యక్షులు జి.నిర్మల, కోశాధికారి జి.బాలస్వామి, చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆనంద్‌ యాదవ్‌, కోఆర్డినేటర్‌ బొడ్డు ప్రసాద్‌, చీఫ్‌ కన్వీనర్‌ భోగ శ్రీనివాస్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి యాకూబ్‌ పాషా, కన్వీనర్లు వేముల రాధికారెడ్డి, డి.చక్రపాణి, కార్యనిర్వాహక అధ్యక్షులు జయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీల ఫోరం అధ్యక్షులు కరుణాకర్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఫోరం అధ్యక్షులు భరత్‌ సత్యనారాయణ, నాయకులు లక్ష్మణాచారి, శశికాంత్‌, నిరంజన్‌, ఖాసింబాబా, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.