Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కరెంట్‌ బిల్లులతో 'షాక్‌' | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2022

కరెంట్‌ బిల్లులతో 'షాక్‌'

- ఫిబ్రవరి కరెంట్‌ చార్జీలతో వినియోగదారుల బెంబేలు
- లోడ్‌కు అనుగుణంగా మీటర్‌ నమోదు లేదని వడ్డన
- డెవలప్‌మెంట్‌ పేమెంట్‌, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో మోత
- రూ.200 బిల్లు వచ్చేవారికి ఏకంగా రూ.10వేలు చార్జి
- ఒక్క ఖమ్మం జిల్లా ప్రజలపైనే రూ.100 కోట్ల భారం
- సంస్థ నష్టాల పేరుతో ప్రభుత్వ కుటిలయత్నాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. సంస్థ రూ.10వేల కోట్ల నష్టాల్లో ఉందనే పేరుతో ప్రభుత్వం ఎత్తుగడలకు తెరతీసింది. దీనిలో భాగంగా త్వరలో విద్యుత్‌ వినియోగ టారిఫ్‌ చార్జీలు పెంచాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా సంస్థకు రూ.6వేల కోట్లు వస్తాయట. మిగిలిన రూ.4వేల కోట్లను భర్తీ చేసుకునేందుకు వినియోగదారులపై వివిధ రకాల పేరుతో భారం మోపాలనే ప్రణాళికలో భాగంగా డెవలప్‌మెంట్‌ చార్జీలు (డీఈవీ. సీహెచ్‌జీ), సెక్యూర్టీ డిపాజిట్‌ ( ఎస్డీ ఏఎంటీ)లను ఫిబ్రవరి నెల బిల్లులో విధిస్తోంది. ఫలితంగా గతంలో రూ.400లోపు బిల్లు రానివారికి సైతం ఒక్కసారిగా రూ.10వేల వరకు బిల్లు రావడంతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. ఆ బిల్లులు పట్టుకుని కరెంట్‌ ఆప ˜ీసుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు లోడ్‌కు అనుగు ణంగా మీటర్‌ నమోదు లేదని సమాధానం ఇస్తున్నారు. ఈ ఒక్కసారికి బిల్లు వచ్చిన మొత్తం చెల్లిస్తే భవిష్యత్‌లో ఇలాంటి లోడ్‌ చార్జీలేవీ ఉండవని సూచిస్తున్నారు. బిల్లు తగ్గించడం వంటివేవీ తమ చేతులో లేదని, దరఖాస్తు చేస్తే రెండు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తామని చెప్పి భారమైనా భరించాల్సిందేనని సెలవిస్తున్నారు. కేటగిరీలతో నిమిత్తం లేకుండా ఎస్డీ, డీఈవీ చార్జీలను మీటర్‌ ఉన్న వినియోగదారులందరికీ వర్తింపజేస్తు న్నారు. వినియోగించే ఎలక్ట్రికల్‌ వస్తువుల ఆధారంగా లోడ్‌చార్జీలను గతంలో నిర్దేశించారు. గతంలోనేలోడ్‌ చార్జీలు చెల్లించినవారు మినహా మిగిలిన వినియోగదారుల నుంచి ఎస్డీ, డీఈవీ పేమెంట్‌లను వసూలు చేస్తున్నారు.
ఒక్కసారిగా రూ.10వేల బిల్లు
   ఖమ్మం అర్బన్‌ మండలం టేకులపల్లికి చెందిన చిన్నంశెట్టి సుబ్బారావు (యూఎస్‌సీ నెం: 10229634) కరెంట్‌ బిల్లులో లోడ్‌ 2 కిలోవాట్స్‌గా నిర్దేశించారు. డిసెంబర్‌ నెలలో రూ.178, జనవరిలో రూ.254 బిల్లు వచ్చింది. ఈ రెండు నెలల్లోనూ నెట్‌ అమౌంట్‌ కింద డీఈవీ చార్జి (6 కిలోవాట్స్‌) రూ.8,496, ఎస్డీ అమౌంట్‌ రూ.1,200 అని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి నెల బిల్లులో ఏకంగా రూ.9,782 చార్జి విధించారు. ఈ బిల్లులో గతంలో నెట్‌ అమౌంట్‌ కింద వచ్చిన డీఈవీ, ఎస్డీ చార్జీలు ఈ సారి టోటల్‌ అమౌంట్‌లో కలిపివేశారు. బిల్లు చూసి సుబ్బారావు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. తొమ్మిదేండ్ల కిందట మీటర్‌ తీసుకున్న సుబ్బారావు తన గృహంలో మూడు ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ, ఓ ఫ్రిడ్జ్‌, రెండు ఫ్యాన్లు, ఒక నీటి మోటార్‌ మాత్రమే వినియోగిస్తున్నామనీ, ఏసీల వంటివేవీ తమకు లేవని చెబుతున్నారు. ఆ బిల్లులు పట్టుకుని కరెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 'రెక్కాడితే గానీ డొక్కాడని' తాము ఇంత బిల్లు ఎలా చెల్లించాలని వాపోతున్నారు. ఒక్క గదిలో ఉంటూ లైటు, ఫ్యాన్‌ మాత్రమే వాడే ఒంటరి మహిళకు సైతం రూ.6,000 చార్జి విధించారు. ఇలా ఈ నెల బిల్లులో ఎస్డీ, డీఈవీ చార్జీల భారం మోపడంపై వినియోగదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల వినియోగదారులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. కరెంట్‌ ఆఫీసుల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయం, చేతివృత్తులు ఇతరత్రా వారికి ఈ చేత సబ్సిడీలు ఇచ్చి ఆ చేత అంతకు రెట్టింపు లాక్కుటోందని వాపోతున్నారు.
ఈ లోడ్‌ల లెక్కేంటి..?
   ఒక బల్బ్‌ 5 నుంచి 60 వాట్స్‌, సీలింగ్‌ ఫ్యాన్‌ 50-150, టీవీ 150- 250, సింగిల్‌ ఫేజ్‌ మోటార్‌ పంపు 375-1500, మిక్సీ 150-750, వాటర్‌ హీటర్‌ 550-1500, కంప్యూటర్‌ 100-250, ఏసీ- 1000- 3000 వాట్స్‌గా నిర్ణయించారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఇంట్లో నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్‌ వినియోగిస్తే ఎలా లెక్కిస్తారో చూద్దాం. 4×9= 36, 2×125= 250, 1×250= 250, 1×200= 200 ఇలా మొత్తంగా 736 వాట్స్‌ వినియోగిస్తున్నట్టు లెక్కకడుతున్నారు. దీని ఆధారంగా కిలోవాట్స్‌ (కేడబ్ల్యూ) వారీగా లోడ్‌లను నిర్దేశిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం ఏడు కేటగిరీల కింద 6.22 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులున్నారు. వీరిలో అత్యధికంగా కేటగిరీ 1 కింద 4,58,572 మంది ఉన్నారు. వీరిలో లోడ్‌కు అనుగుణంగా మీటర్‌లో నమోదు కాని వారందరికీ ఈ చార్జీలు విధించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈరకంగా ఒక్క ఖమ్మం జిల్లా వినియోగదారుల నుంచే రూ.100 కోట్ల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక్కసారి పే చేస్తే మళ్లీమళ్లీ కట్టాల్సిన పనిలేదు
   డెవలప్‌మెంట్‌, ఎస్డీ చార్జీలు ఒకసారి చెల్లిస్తే మళ్లీ మళ్లీ చెల్లించాల్సిన పనిలేదు. ప్రతి నెలా కరెంట్‌ బిల్లులో ఇవి రావు. వినియోగించే లోడ్‌ ఆధారంగా ఈ చార్జీలు విధిస్తున్నాం. ఈ చార్జీల్లో ఎలాంటి సవరింపు ఉండదు. ఒకేసారి మొత్తం చెల్లించలేని స్థితిలో ఉన్నవారు స్థానికంగా ఉన్న ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకుంటే రెండు, మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇస్తారు. అంతకుమించి ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు.
- రమేష్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, ఖమ్మం
దొంగచాటుగా భారం
   ప్రభుత్వం ప్రత్యక్షంగా చార్జీలు పెంచితే ఆందోళనలు చేపడతారనే యోచనతో ఇలా దొడ్డిదారిలో దొంగచాటుగా భారం మోపుతోంది. త్వరలో టారిఫ్‌లలో మార్పులు చేసి భారం మోపాలనే యోచనలో ఉంది. లోడ్‌, సర్వీసు, డెవలప్‌మెంట్‌, సెక్యూరిటీ డిపాజిట్‌లు.. ఇలా రకరకాల పేర్లు చెప్పి ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం వేస్తోంది. కనీసం మీటర్లు చెడిపోయినా కొత్త మీటర్లు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేసి అప్పటివరకు అత్యధికంగా వచ్చిన బిల్లును పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా ప్రతినెలా బిల్లులు విధిస్తోంది. ఇలా రకరకాలుగా ప్రజలపై భారం వేస్తూ ఈ చేతితో ఉచిత, సబ్సిడీలు ఇచ్చి ఆ చేతితో లాక్కుంటోంది.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.