Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీ ప్రజారవాణానే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2022

ఆర్టీసీ ప్రజారవాణానే..

- కార్మిక సంఘాలను అనుమతించాలి
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: టీఎస్‌ఆర్టీసీ జేఏసీ రౌండ్‌ టేబుల్లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ఎప్పటికీ ప్రజారవాణానే అనీ, దాన్ని లాభనష్టాల వ్యాపార కోణంలో చూడరాదని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌ అన్నారు. ఆ సంస్థను ప్రజల నుంచి దూరం చేయాలనే ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచే ఉద్యమం ఆవిర్భవించాలని చెప్పారు. అలాంటి ఉద్యమాన్ని కార్మిక సంఘాలు అందిపుచ్చుకోవాలనీ, సంస్థ పరిరక్షణతోపాటు సామాజిక సేవా బాధ్యతనూ చేపట్టాలని పిలుపునిచ్చారు. తొమ్మిది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్‌ యూనియన్‌) అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన ఉద్యమ నాయకత్వానికి సామాజిక అవగాహన ఉంటుందని తాము భావించామనీ, కానీ స్వరాష్ట్ర సాధన తర్వాత అలాంటిదేం కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారనీ, వాటిని అమలు చేయాల్సిన ఉద్యమ నాయకత్వం ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం దిగ్భ్రాంతికరమనీ, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఆర్టీసీ బస్సులపై టీడీపీ నినాదాలు రాయించాలనే ఫైల్‌ను పంపితే, అప్పటి రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న ఎస్‌ఆర్‌ శంకరన్‌ దాన్ని తిప్పి పంపారనీ, ఆర్టీసీ బస్సు ప్రజలదే తప్ప, పార్టీలది కాదని నేరుగా ఎన్టీఆర్‌కు చెప్పారని గుర్తుచేశారు. అలాంటి అధికారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చెప్పినా, పట్టించుకొనే రాజకీయ చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ, రైల్వే, రక్షణరంగం సహా అన్నింటినీ కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెట్టిందనీ, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ మనుగడను ప్రశ్నించే వారు కార్లలో తిరుగుతున్నారనీ, బస్సులో ప్రయాణించే సామాన్యులు ప్రశ్నించలేకపోతున్నారని విశ్లేషించారు. బస్సుపై ఆధారపడిన సాధారణ ప్రయాణీకుల సమీకరణ జరగాలనీ, దాన్ని కార్మిక సంఘాలు అందిపుచ్చుకోవాలని చెప్పారు. స్వీడన్‌లో ఒక్క కంపెనీలో సమ్మె పిలుపు ఇస్తే, అక్కడి కార్మిక సంఘాలన్నీ దానిలో భాగాస్వామ్యం అవుతాయనీ, ఇక్కడ కూడా సంఘాల మధ్య ఆ తరహా ఐకమత్యం పెరగాలని ఆకాంక్షించారు.
బడ్జెట్‌లో 2 శాతం నిధులు కేటాయించాలి
   రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలనీ, అప్పులను ఈక్విటీగా మార్చాలనీ, సంక్షేమ మండళ్లను రద్దు చేసి, సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ వీఎస్‌ రావు (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2017, 2021 వేతన ఒప్పందాలు, ఆరు డిఏలనూ చెల్లించాలని దానిలో పేర్కొన్నారు. ఏడేండ్లలో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సగటున కేవలం రూ.145 కోట్లు మాత్రమే ఇచ్చిందని గణాంకాలతో వివరించారు. రూ.1,600 కోట్ల విలువైన ఆర్టీసీ కార్మికుల క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఎన్నికలు నిర్వహించేందుకు యాజమాన్యం సహకరించాలనీ, బకాయిలు చెల్లించాలని కోరారు. 2021 ఫిబ్రవరి 7న విడుదల చేసిన ఉద్యోగభద్రత మార్గదర్శకాలను ఆరునెలల తర్వాత సమీక్ష చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందనీ, అది ఇప్పటికీ జరగలేదని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఆర్టీసీ విస్తరణ, కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఏకగ్రీవ ఆమోదం
   సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కార్మిక సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌, ఎమ్‌ శ్రీనివాస్‌, కే సూర్యం ఆమోదం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను వివరించారు. ప్రజా ఉద్యమాల ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్‌ఆర్టీసీ జేఏసీ వైస్‌ చైర్మెన్‌ కే హన్మంతు ముదిరాజ్‌ (టీజేఎమ్‌యూ), కన్వీనర్‌ పి కమాల్‌రెడ్డి (ఎన్‌ఎమ్‌యూ), కో కన్వీనర్లు జీ అబ్రహం (ఎస్‌డబ్ల్యూయూ), కే యాదయ్య (బీకేయూ), ఎస్‌ సురేష్‌ (బీడబ్ల్యూయూ), సత్యనారాయణగౌడ్‌ (ఎస్‌టీఎమ్‌యూ) తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్టీసీ యాజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ సంస్థ స్థితిగతులపై ప్రత్యేకంగా లేఖలు రాయాలని నిర్ణయించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.