Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్రం విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2022

కేంద్రం విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

- ఎఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- టీఎస్‌ఈఆర్సీ బహిరంగ విచారణలో సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ ఆందోళన
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్పీడీసీఎల్‌ ప్రతిపాదించిన విద్యుత్‌ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్రం విద్యుత్‌ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కమిషన్‌ సిఫారసు చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. హన్మకొండ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి.. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై సోమవారం బహిరంగ విచారణ చేపట్టింది. మండలి చైర్మెన్‌ శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, కృష్ణయ్య విచారణ నిర్వహించారు. తొలుత ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు ప్రతిపాదిత ఛార్జీల పెంపు ఆవశ్యకత, కంపెనీ నష్టాలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల నేతలు, రైతులు తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ చట్టంతో మున్ముందు క్రాస్‌ సబ్సిడీలుండవన్నారు. ఈ చట్టంతో ఫెడరల్‌గా రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యుత్‌ కేంద్ర జాబితాలోకి వెళ్లిపోతుందని తెలిపారు. దాంతో ఇక ముందు ఉచిత విద్యుత్‌ ఉండదని అన్నారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్‌ కోరాలని సూచించారు. గత నాలుగేండ్లుగా ఈఆర్‌సీ కార్యాచరణలో లేదనీ, ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఇవి పనిచేయడం విచారకరమన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ పెట్టిన ప్రతిపాదిత విద్యుత్‌ చార్జీల పెంపు అశాస్త్రీయంగా ఉందని తెలిపారు. ప్రతి కేటగిరికి గుండు గుత్తాగా యూనిట్‌కు 0.50 పైసలు, యూనిట్‌కు రూ.1 పెంచాలని ప్రతిపాదించారన్నారు. గృహ వినియోగదారులపైనే 30 శాతానికి పైగా ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. ఇది రాష్ట్రంలో 50 లక్షల మంంది వినియోగదారులపై భారం పడుతుందన్నారు. డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరిట వినియోగదారులపై భారాలు మోపడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లాలోనే రూ.100 కోట్ల భారాన్ని వేశారని తెలిపారు. రూ.200 బిల్లు చెల్లించే వాళ్లకు డెవలప్‌మెంట్‌ ఛార్జీల మోతతో రూ.2 వేల నుంచి రూ.5 వేల మేరకు బిల్లులు వేశారన్నారు. డిస్కంలకు 20 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని తేల్చగా, కంపెనీ 25 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరముందని ప్రతిపాదించడంలోని ఆంతర్యాన్ని ప్రశ్నించారు. ట్రాన్స్‌ఫార్మర్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 600 మంది విద్యుత్‌ షాక్‌తో మృతిచెందినట్టు చెబుతున్నారన్నారు. ఈఆర్‌సీ ప్రత్యేకంగా కమిషన్‌ వేస్తే ట్రాన్స్‌ఫార్మర్ల దుస్థితిని స్వయంగా చూపిస్తానని తెలిపారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. ఆర్టిజన్స్‌కు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాల్సి ఉండగా వెట్టి చాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనలో తిండి పెట్టి వెట్టి చాకిరి చేయిస్తే ఎన్‌పీడీసీఎల్‌లో తిండి పెట్టకుండానే వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. విద్యుత్‌ ఛార్జీల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత చర్యలతో విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. ఉత్పత్తికి, సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించక తప్పులు చేశారన్నారు. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఎక్కువ ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయొద్దన్నారు. కొత్తగా అవసరమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేయాలన్నారు. సౌరశక్తిని వినియోగించుకోవాలని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చినట్లే, పేదలకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బడా పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి చౌకగా కరెంట్‌ ఇవ్వడంతో పేదలపై భారం పడుతుందన్నారు. విద్యుత్తు కొనుగోలు విధానాన్ని సమీక్షించుకోవాలని సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.